నిర్మలా సీతారామన్
భారత ఆర్థిక మంత్రి / From Wikipedia, the free encyclopedia
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం.[1]నిర్మలా సీతారామన్ 2019 నుండి ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[2] వరుసగా ఏడోసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, మహిళా మంత్రిగా కూడా గుర్తింపు పొందింది. [3]ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది.[4][5]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత వివరాలు, జననం ...
నిర్మలా సీతారామన్ | |||
భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1959-08-18) 1959 ఆగస్టు 18 (వయసు 64) తిరుచిరాపల్లి, తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | పరకాల ప్రభాకర్ (ఆంధ్రప్రదేశ్) | ||
బంధువులు | పరకాల శేషావతారం, పరకాల కాళికాంబ | ||
సంతానం | ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి | ||
నివాసం | కొత్త ఢిల్లీ, భారత్ | ||
పూర్వ విద్యార్థి | జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ |
మూసివేయి