నిత్య సంతోషిణి
From Wikipedia, the free encyclopedia
నిత్య సంతోషిణి పేరు పొందిన తెలుగు గాయని. ఈమె మొదట శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని ఆలపించి ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తరువాత లలిత సంగీతం, సినిమా సంగీతం పాడటం మొదలు పెట్టింది. ఈమె తల్లి రామలక్ష్మి పద్మాచారి సంగీత ప్రియురాలు. ఆమెనే నిత్య సంతోషిణి ప్రథమ గురువు. ఈమె సంగీతపాఠాలను చిన్నతనం నుండే వినడం వల్ల సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. తరువాత ఈమె తంపెల్ల సూర్యనారాయణ, ఆకెళ్ల మల్లికార్జునశర్మల వద్ద సంగీతం అభ్యసించింది. ఈమె తన అక్కతో కలిసి అనేక శాస్త్రీయ సంగీత, భక్తి సంగీత కచ్చేరీలను ఇచ్చింది. ఎన్నో భక్తి పాటల ఆల్బమ్లను విడుదల చేసింది.[1]