నాథూ లా, చో లా ఘర్షణలు
From Wikipedia, the free encyclopedia
1967 సెప్టెంబరు 11–14 మధ్య నాథూ లా కోసం; 1967 అక్టోబరు 1 న చో లా కోసం భారత చైనాల మధ్య చోటు చేసుకున్న సైనిక ఘర్షణలే నాథూ లా, చో లా ఘర్షణలు. ఈ ఘర్షణలు, అప్పట్లో భారత సంరక్షణలో ఉన్న హిమాలయ రాజ్యం సిక్కిం సరిహద్దు వెంట జరిగాయి.[6]
1967 చైనా - భారత సరిహద్దు ఘర్షణలు | |||||||
---|---|---|---|---|---|---|---|
ప్రపంచ పటంలో చైనా, భారతదేశాలు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
India | China | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
Zakir Hussain (President of India) Indira Gandhi (Prime Minister of India) Swaran Singh (Defence Minister of India) Lt. General Jagjit Singh Aurora[4] Maj. General Sagat Singh[4] | Mao Zedong (Leader of the Communist Party of China and Chairman of Central Military Commission of China) Deputy Commander Wang Chenghan (zh)[5] [విడమరచి రాయాలి] | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
భారతీయ వర్గాలు: 88 మరణాలు 163 క్షతగాత్రులు - నాథూ లా, చో లాల్లో చీనా వర్గాలు: నాథూ లాలో 65 మరణాలు చో లాలో 36 మరణాలు | చైనా వర్గాలు: నాథూ లాలో 32 మరణాలు 'unknown' in the Cho La incident Indian sources: 340 killed 450 wounded in Cho La and Nathu La incidents combined |
1967 సెప్టెంబరు 11 న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాథూ లా లోని భారత సైనిక శిబిరాలపై దాడులు జరపడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణలు 1967 అక్టోబరు 15 వరకూ సాగాయి. 1967 అక్టోబరులో చో లా లో కూడా ఘర్షణలు జరిగి, అదే రోజున ముగిసాయి.
కొన్ని తటస్థ వర్గాల ప్రకారం, భారత బలగాలు చైనా బలగాలపై నిర్ణయాత్మక విజయాన్ని సాధించాయి.[2][3] నాథూ లాలో చైనా సైన్యానికి చెందిన అనేక స్థావరాలను నాశనం చేసి.[5] భారత దళాలు చైనా సైన్యాలను వెనక్కు తరిమి కొట్టాయి.[1] ఈ రెండు సంఘటనల్లో రెండు వైపులా గణనీయమైన సంఖ్యలో సైన్య నష్టం జరిగింది. నష్టానికి సంబంధించి, ఇరు పక్షాలూ వేరువేరు సంఖ్యలను చూపెట్టాయి.
చుంబీ లోయలోని వివాదాస్పద భూభాగంపై ఆధిక్యత సాధించేందుకు ఇరుదేశాల మధ్య తలెత్తిన పోటీ ఈ ఘర్షణలకు ప్రధాన కారణం. భారత్ పై దాడి నిర్ణయంపై చైనా చూపిన కారణాలు ఈ ఘర్షణల కారణంగా బలహీనపడినట్లుగా పరిశీలకులు భావించారు. భారత్ మాత్రం, 1962 యుద్ధంలో పరాభవం తరువాత చేజిక్కించుకున్న ఈ విజయం తన బలగాల పాటవంలో మెరుగుదలకు సూచికగా తీసుకున్నట్లుగా కూడా పరిశీలికులు భావించారు.