దబ్బాల రాజగోపాల్ రెడ్డి
కంప్యూటర్ శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
దబ్బాల రాజగోపాల్ రెడ్డి (రాజ్ రెడ్డి) (1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించాడు. ఆయన గత 40 సంవత్సరాలుగా స్టాన్ఫర్డు, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నాడు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువతీ, యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడింది.
దబ్బాల రాజగోపాల్ రెడ్డి | |
---|---|
జననం | (1937-06-13) 1937 జూన్ 13 (వయసు 87) కాటూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
నివాసం | USA |
జాతీయత | భారతీయుడు - అమెరికన్ |
జాతి | తెలుగు |
రంగములు | కృతిమ మేథస్సు రోబోటిక్స్ మానవ-కంప్యూటర్ అన్యోన్యత |
వృత్తిసంస్థలు | కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం స్టాన్ఫర్డు విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ |
చదువుకున్న సంస్థలు | కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీ న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | జాన్ మెకార్తీ |
డాక్టొరల్ విద్యార్థులు | జేమ్స్ బేకర్[1] కై ఫు లీ [1] హ్యారీ షుమ్ హాన్ |
ముఖ్యమైన పురస్కారాలు | లీజియన్ ఆఫ్ ఆనర్ (1984) ట్యూరింగ్ అవార్డు (1994) పద్మ భూషణ్ పురస్కారం (2001) ది ఒకావా ప్రైజ్ (2004) ది హోండా ప్రైజ్ (2005) వాన్నెవర్ బుష్ అవార్డు (2006) |