దక్షిణ తీర రైల్వే జోన్
From Wikipedia, the free encyclopedia
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కేంద్రంగా భారత ప్రభుత్వం భారతీయ రైల్వేలలో ప్రకటించిన కొత్త రైల్వే జోన్.[1][2] 2019 ఫిబ్రవరి 27 న భారత ప్రభుత్వం ఈ జోన్ ఏర్పాటును ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి.[3][4][5] వాల్తేరు రైల్వే డివిజన్ను రెండు భాగాలు చేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భాగం దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంటుంది.[6] దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కొంతమేరకు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది.[7]
త్వరిత వాస్తవాలు దక్షిణ తీర రైల్వే జోన్, రిపోర్టింగ్ మార్క్ ...
దక్షిణ తీర రైల్వే జోన్ | |
---|---|
రిపోర్టింగ్ మార్క్ | SCoR |
లొకేల్ | ఆంధ్రప్రదేశ్ |
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) |
ఎలక్ట్రిఫికేషన్ | 25 kV |
ప్రధానకార్యాలయం | విశాఖపట్నం |
మూసివేయి