![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/18/Telugu_Mahasabhalu%252C_world_telugu_conference_2017_%252816%2529.jpg/640px-Telugu_Mahasabhalu%252C_world_telugu_conference_2017_%252816%2529.jpg&w=640&q=50)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
తెలుగు విశ్వవిద్యాలయం / From Wikipedia, the free encyclopedia
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం.[1] ఇది 1985 డిసెంబరు 2న ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. రాజమండ్రిలో విశ్వవిద్యాలయం శాఖ ఉంది.
![]() | |
రకం | ప్రభుత్వ |
---|---|
స్థాపితం | 1985, డిసెంబరు 2 |
ఛాన్సలర్ | సీ.పీ. రాధాకృష్ణన్ (తెలంగాణ గవర్నర్) |
వైస్ ఛాన్సలర్ | శైలజారామయ్యర్, ఐఏఎస్ (ఇంచార్జ్ వీసీ) |
స్థానం | హైదరాబాదు, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంత |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Telugu_University_Auditorium.jpg/640px-Telugu_University_Auditorium.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Telugu_Mahasabhalu%2C_world_telugu_conference_2017.jpg/640px-Telugu_Mahasabhalu%2C_world_telugu_conference_2017.jpg)
ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది. 2022 జూలై 20న విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జరుపుకుంది.