తిరుమల శిలాతోరణం
From Wikipedia, the free encyclopedia
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం యొక్క కొలతలు 8 మీటర్లు (26.2 అడుగులు) వెడల్పు, 3 మీటర్ల (9.8 అడుగులు) ఎత్తు. [1]
ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం. [2][3][4] ఇది ఎగువ ప్రోటెరోజోయిక్ (160-57 కోట్ల సంవత్సరాల క్రితం నాటి) కాలానికి చెందిన కడప క్వార్ట్జైటు రాళ్ళలో ఏర్పడింది. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడింది.[5][6][7]