తళ్ళికోట యుద్ధం
From Wikipedia, the free encyclopedia
తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26[1] ) (జనవరి 23[2]) న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్ఛస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాతి కాలంలో అచ్యుత రాయలు, ఆ తరువాత సదాశివ రాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు. వాస్తవంలో పూర్తి అధికారాలు అళియ రామరాయలు వద్ద ఉండేవి. అతడే దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.
మరింత సమాచారం తళ్ళికోట యుద్దం, ప్రత్యర్ధులు ...
తళ్ళికోట యుద్దం | |
---|---|
![]() యుద్దము వివరాలు తెలిపే పటము | |
కారణము: భారతదేశ ముస్లిం దండయాత్ర | |
తేదీ: జనవరి 23, 1565 | |
స్థలము: ప్రస్తుత కర్ణాటకలోని రాక్షసి-తంగడి | |
పరిణామము: దక్కన్ సల్తనత్ల విజయము | |
ప్రత్యర్ధులు | |
విజయనగర సామ్రాజ్యము | దక్కన్ సల్తనత్లు |
సేనాధిపతులు | |
రామ రాయలు | దక్కన్ సుల్తానులు & సేనానులు |
సైనిక బలములు | |
140,000 పదాతి, 10,000 అశ్విక, 100కు పైగా యుద్ధ గజములు | 80,000 పదాతి, 30,000 అశ్విక, కొన్ని డజన్ల ఫిరంగులు |
ప్రాణనష్టము | |
నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము. | నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము. |
మూసివేయి