![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/7e/Jawahar_Navodaya_Vidyalaya_logo.jpg/640px-Jawahar_Navodaya_Vidyalaya_logo.jpg&w=640&q=50)
జవహర్ నవోదయ విద్యాలయం
From Wikipedia, the free encyclopedia
జవహర్ నవోదయ విద్యాలయాలు (సంక్షిప్తంగా జె ఎన్ వి లు) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థ. ఈ పాఠశాలలను భారత ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తుంది. జెఎన్వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుసంధానంతో, ఆరో తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్ ఆఖరి సంవత్సరం) వరకు చదువు చెప్తారు.
జవహర్ నవోదయ విద్యాలయం | |
---|---|
![]() | |
స్థానం | |
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో (తమిళనాడు మినహా) భారతదేశం | |
సమాచారం | |
ఇతరపేర్లు | జేఎన్వీ, నవోదయ |
రకం | ప్రభుత్వ రంగం |
Motto | ప్రజ్ఞానం బ్రహ్మ[lower-alpha 1] ("అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము") |
స్థాపన | 1986; 38 సంవత్సరాల క్రితం (1986) |
స్థాపకులు | భారత ప్రభుత్వం |
పాఠశాల పరీక్షల బోర్డు | సిబిఎస్సి |
Chairman | ధర్మేంద్ర ప్రధాన్ |
తరగతులు | VI - XII |
వయస్సు | 11 – 19 సంవత్సరాలు |
విద్యార్ధుల సంఖ్య | 265,574 [1] |
Campus size | ప్రతీ విద్యాలయం సుమారు 30 ఎకరాలు |
Campus type | నివాసంతో కూడినది |
Color(s) | నేవీ నీలం,తెలుపు |
Website | navodaya.gov.in |
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను కనుగొనడం, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం జేఎన్వీలకు ప్రత్యేకంగా అప్పగించబడింది.[2] జేఎన్వీలలో విద్య, వసతి, కార్యకలాపాల కోసం నిధులు భారత ప్రభుత్వ విద్యా శాఖ అందిస్తుంది. ఇక్కడ విద్యార్థులు 7 సంవత్సరాల పాటు ఉచితంగా ఉండవచ్చు.
జేఎన్వీలు తమిళనాడు మినహా భారతదేశమంతటా ఉన్నాయి.[3] 2019 సెప్టెంబరు 30 నాటికి, 636 జేఎన్వీలు 265,574 మంది విద్యార్థులతో నమోదు చేయబడ్డాయి, అందులో 206,728 (~ 78%) గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులున్నారు. 2019 లో జేఎన్వీలు 10 వ, 12 వ తరగతుల్లో వరుసగా 98.57%, 96.62% ఉత్తీర్ణతతో సిబిఎస్సి పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచాయి.[4][5]