జమిందారు
From Wikipedia, the free encyclopedia
భారత ఉపఖండంలో జమీందారు (జోమిందారు, జోమిదారు జోమిదారు) ఒక కులీనుడుగా గౌరవం అందుకునేవాడు. ఈ పదానికి పర్షియా భాషలో భూమి యజమాని అని అర్థం. సాధారణంగా వంశపారంపర్యంగా జమీందార్లు అపారమైన భూమిని, వారి రైతుల మీద నియంత్రణను కలిగి ఉన్నారు. వారు సామ్రాజ్య రాజాస్థానం తరపున లేదా సైనిక ప్రయోజనాల కొరకు పన్ను వసూలు చేసే హక్కును కలిగి ఉన్నారు. వారి కుటుంబాలు నామమాత్రంగా ప్రభునామాలు కలిగి ఉన్నాయి.
19 - 20 శతాబ్దాలలో బ్రిటీషు సామ్రాజ్యవాదం రావడంతో చాలా మంది సంపన్న, ప్రభావవంతమైన జమీందార్లకు మహారాజా, రాజా, నవాబు వంటి రాచరిక, రాజ బిరుదులను ప్రదానం చేశారు. మొఘలు సామ్రాజ్యం సమయంలో జమీందార్లు ప్రభువులుగా ఉన్నారు.[1] వారు పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్బరు చక్రవర్తి వారికి మన్సాబులు అనే అధికారులను మంజూరు చేశాడు. వారి పూర్వీకుల రాజ్యాలను జాగీర్లుగా పరిగణించారు.[2] భారతదేశంలో బ్రిటీషు వలస పాలనలో శాశ్వత స్థావరం కలిగిన జమీందారీ వ్యవస్థగా పిలువబడింది. బ్రిటిషు వారు వీరిని సహాయక జమీందార్లను యువరాజులుగా గుర్తించి బహుమతి ఇచ్చారు. ఈ ప్రాంతంలోని అనేక రాచరిక రాజ్యాలు వలసరాజ్యానికి పూర్వం జమీందారు సంస్థానాలు అధికంగా రాచరికస్థాయికి పెంచబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ బ్రిటీషు వారు వలసరాజ్యానికి పూర్వం ఉన్న అనేక రాచరిక రాజ్యాలను, భూస్వామ్యవ్యవస్థకు, అధిపతి స్థాయికి తగ్గించారు. వారి స్థితిని గతంలో ఉన్నత రాజాస్థానాల నుండి జమీందారు స్థాయికి తగ్గించారు.
1950 లో భూసంస్కరణలో భాగంగా తూర్పు బెంగాలు (బంగ్లాదేశు)లో,[3] 1951 లో భారతదేశంలో [4] పశ్చిమ పాకిస్తానులో 1959 లో భూ సంస్కరణల సమయంలో ఈ వ్యవస్థ రద్దు చేయబడింది.[5] ఉపఖండంలోని ప్రాంతీయ చరిత్రలలో జమీందార్లు తరచుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. భాటి ప్రాంతంలో (బారో-భూయాన్లు) 12 మంది జమీందార్లు ఏర్పాటు చేసిన 16 వ శతాబ్దపు సమాఖ్య చాలా ముఖ్యమైన ఉదాహరణలలో ఒకటిగా ఉంది. ఇది జెస్యూట్లు, రాల్ఫు ఫిచి అభిప్రాయం ఆధారంగా నావికా యుద్ధాల ద్వారా మొఘలు దండయాత్రలను వరుసగా తిప్పికొట్టడంలో ఖ్యాతిని సంపాదించింది. ఈ సమాఖ్యకు జమీందారు-రాజు ఇసా ఖాను నాయకత్వం వహించాడు. ఇందులో ముస్లింలు, ప్రతాపదిత్య వంటి హిందువులను చేర్చారు. జమీందార్లు కూడా కళలకు పోషకులుగా ఉన్నారు. ఠాగూరు కుటుంబానికి చెందిన 1913 లో భారతదేశపు మొట్టమొదటి నోబెలు గ్రహీత రవీంద్రనాథ ఠాగూరు తన సంస్థానంలో ఉండేవాడు. జమీందార్లు నియోక్లాసికలు, ఇండో-సారాసెనికు నిర్మాణాలను కూడా ప్రోత్సహించారు.