జంధ్యాల జయకృష్ణ బాపూజీ
From Wikipedia, the free encyclopedia
జంధ్యాల జయకృష్ణ బాపూజీ[1] మే 5, 1948లో గుంటూరులో జన్మించాడు. ఇతని తండ్రి ప్రముఖ కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి. తల్లి అనసూయాదేవి.1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. 1972లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టాలు పొందాడు. గుంటూరులోని హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా, రీడర్గా, శాఖాధ్యక్షుడిగా, వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ చేశాడు.
త్వరిత వాస్తవాలు జంధ్యాల జయకృష్ణ బాపూజీ, జననం ...
జంధ్యాల జయకృష్ణ బాపూజీ | |
---|---|
![]() | |
జననం | జంధ్యాల జయకృష్ణ బాపూజీ (1948-05-05) 1948 మే 5 (వయసు 76) అమరావతి, గుంటూరు జిల్లా |
నివాస ప్రాంతం | ఇర్విన్, టెక్సాస్, అమెరికా |
వృత్తి | వైస్ ప్రిన్సిపాల్ |
ఉద్యోగం | హిందూ కళాశాల, గుంటూరు |
ప్రసిద్ధి | రచయిత, కవి, విమర్శకుడు |
Notable work(s) | శ్రీనాథుని సాహిత్య ప్రస్థానము విశ్వ తారావళి భారతీయ నృత్యామృతం |
మతం | హిందూ |
పిల్లలు | శ్రీనాథ్ |
తండ్రి | జంధ్యాల పాపయ్యశాస్త్రి |
తల్లి | అనసూయాదేవి |
మూసివేయి