గాంధార
From Wikipedia, the free encyclopedia
గాంధారా పురాతన భారత ఉపఖండం, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయవ్య భాగంలో పెషావర్ బేసిన్లో ఒక పురాతన రాజ్యం, మహాజనపదంగా ఉండేది. ఈ ప్రాంతం మధ్యలో కాబూలు, స్వాతు నదుల సంగమం వద్ద ఉంది. దీనికి పశ్చిమాన సులైమాను పర్వతాలు, తూర్పున సింధు నది సరిహద్దులుగా ఉన్నాయి. సఫేద్ కో పర్వతాలు దీనిని కోహత్ ప్రాంతం నుండి వేరు చేశాయి. ఇది గాంధార ప్రధాన ప్రాంతంగా "గ్రేటర్ గాంధార" సాంస్కృతిక కేంద్రంగా ఉంటూ ఇది సింధు నది మీదుగా తక్షశిలా ప్రాంతం, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్లోని కాబూలు, బామియను లోయల వరకు, ఉత్తరాన కరాకోరం శ్రేణి వరకు విస్తరించింది.[1][2][3] అంగుత్తారా నికాయ వంటి బౌద్ధ వ్రాత వనరులలో పేర్కొన్న పురాతన భారతదేశంలోని పదహారు మహాజనపదాలలో (పట్టణ, గ్రామీణ ప్రాంతాల పెద్ద సమ్మేళనం) గాంధార ఒకటి.[4][5] అచెమెనిదు కాలం, హెలెనిస్టికు కాలంలో దాని రాజధాని నగరంగా పుష్కలవతి (ఆధునిక చార్సద్దా) ఉంది.
Gandhāra | |||||||
---|---|---|---|---|---|---|---|
సుమారు 1500 BC–535 BC | |||||||
Gandhāra and other Mahajanapadas in the Post Vedic period. | |||||||
Approximate boundaries of the Gandhara Mahajanapada, in present-day northwest Pakistan and northeast Afghanistan. | |||||||
రాజధాని | Puṣkalavati (modern Charsadda) and Taxila, and later Peshawar (Puruṣapura) | ||||||
ప్రభుత్వం | Monarchy | ||||||
• సుమారు 750 BC | Nagnajit | ||||||
• సుమారు 518 BC | Pushkarasakti | ||||||
చారిత్రిక కాలం | Ancient Era | ||||||
• స్థాపన | సుమారు 1500 BC | ||||||
• పతనం | 535 BC | ||||||
| |||||||
Today part of | Afghanistan Pakistan |
తరువాత క్రీస్తుశకం 127 లో కుషాను చక్రవర్తి కనిష్క ది గ్రేట్ చేత రాజధాని నగరాన్ని పెషావరు [గమనిక 1]కు తరలించారు.
ఋగ్వేదం (క్రీ.పూ. 1500 - సి. 1200)నుండి గాంధార ఉనికిలో ఉంది.[6][7] అలాగే జొరాస్ట్రియను అవెస్టా కాలం నుండి గాంధార ఉనికిలో ఉంది. ఇది అహురా మాజ్డా వ్రాతలలో భూమి మీద సృష్టించబడిన ఆరవ అందమైన ప్రదేశమైన వాకరాటా అని పేర్కొనబడింది. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దంలో గాంధారాను అచెమెనిదు సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ 327 లో అలెగ్జాండరు ది గ్రేట్ చేత జయించబడింది. తరువాత ఇది మౌర్య సామ్రాజ్యంలో, తరువాత ఇండో-గ్రీకు రాజ్యంలో భాగమైంది. ఈ ప్రాంతం ఇండో-గ్రీకుల క్రింద గ్రీకో-బౌద్ధమతానికి, తరువాత రాజవంశాలలో గాంధారన్ బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. బౌద్ధమతం మధ్య ఆసియా, తూర్పు ఆసియాకు వ్యాప్తి చెందడానికి ఇది ఒక కేంద్ర ప్రదేశం.[8] ఇది బాక్టీరియను జొరాస్ట్రియనిజం, హిందూ మతం కేంద్రంగా ఉంది.[9] గాంధార (గ్రీకో-బౌద్ధ) కళ స్థానిక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన గాంధార 1 వ శతాబ్దం నుండి 5 వ శతాబ్దం వరకు కుషాను సామ్రాజ్య పాలనలో శిఖరాగ్రస్థాయిని సాధించింది. గాంధారా "ఆసియా కూడలిగా అభివృద్ధి చెంది" వాణిజ్య మార్గాలను అనుసంధానిస్తూ విభిన్న నాగరికతల సాంస్కృతిక ప్రభావాలను గ్రహిస్తుంది. ముందుగా ఇస్లాం ఆధిపత్యం చేసిన ఈప్రాంతంలో 8-9 వ శతాబ్దాల వరకు బౌద్ధమతం అభివృద్ధి చెందింది.[10] 11 వ శతాబ్దం వరకు పాకిస్తాన్ స్వాతు లోయలో బౌద్ధమతం ప్రాంతాలు కొనసాగాయి.[11]
చరిత్రకారుడు అల్-బిరుని పర్షియను పదం " షాహి "[12] పాలక రాజవంశాన్ని [13] సూచించడానికి ఉపయోగించారు. ఇది కాబూలు షాహి నుండి స్వీకరించబడింది.[14] ఈ రాజవంశం 10 - 11 వ శతాబ్దాల ముస్లిం ఆక్రమణలకు ముందు కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించింది. సా.శ. 1001 లో ఘజ్నికి చెందిన మహమూదు దీనిని స్వాధీనం చేసుకున్న తరువాత గాంధార పేరు అదృశ్యమైంది. ముస్లిం కాలంలో ఈ ప్రాంతం లాహోరు నుండి లేదా కాబూల నుండి పరిపాలించబడింది. మొఘలు కాలంలో ఇది కాబూలు స్వతంత్ర జిల్లాగా ఉంది.