తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ముఖ్యులు. అతను 1919, మార్చి 6న అనంతపురంలో జన్మించాడు. [1] మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించాడు. ఆలంపూర్కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం అతను రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది. వీరు 2006, జూలై 25వ తేదీన మరణించారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు [2]. అతను సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందాడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి, రంగస్థల నటుడు కూడా.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.