ఖజురహో నిర్మాణ సమూహాలు
From Wikipedia, the free encyclopedia
ఖజురహో (ఆంగ్లం : Khajuraho) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.
ఖజురహో దేవాలయాల సమూహము | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | i, iii |
మూలం | 240 |
యునెస్కో ప్రాంతం | ఆసియా-పసిఫిక్ వారసత్వ ప్రాంతాలు |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1986 (10వ సమావేశం) |
ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.
ఈ దేవాలయాలు, హిందూ, జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.
ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో. తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం. ఇది చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం. 85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది. మధ్యప్రదేశ్ లో చత్తర్ పూర్ జిల్లాలో ఖజురహో ఉంది. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం. ఉత్తర దక్షిణ భారత దేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్ప కళ కు కాణాచి గా వెలసిల్లింది. సాత్నా రైల్వే స్టేషన్ దీనికి దగ్గరగా ఉంటుంది. వాతావరణం ఉష్ణ మండల శీతోష్ణ స్తితి. పూర్వకాలంలో వర్షపు నీటిని నిలవ చేయటానికి 60 తటాకాలు వుండేవి. ఇప్పుడు మూడు తటాకాలు మాత్రమే ఉన్నాయి. అవే ఖజురహో సాగర్ ,శివ సాగర్ ,ప్రేమ సాగర్ లు .ఇక్కడ ఇప్పపూల చెట్లు విపరీతం. వీటిని సాగు చేసి పెంచుతారు. ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి .
16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయి పోయింది .1838వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియ లేదు. బ్రిటిష్ సర్వేయర్ టి. ఎస్. బర్ట్ పల్లకీ లో వెలుతూ వుంటే అది ఒరిగి పడిపోతే బాగు చేయిస్తూ ఈ కళా ఖండాలను చూసి ఆశ్చర్య పడ్డాడు. "భారత దేశం లోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించ వచ్చు" అని రిపోర్టు రాశాడు. దంగాకు చెందిన 1002 నాటి శిలా శాసనాన్ని కాపీ చేసి పెట్టుకొన్నాడు. ఇది విశ్వనాధ దేవాలయంలో ఉంది .
అలెగ్జాండర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘’ఖర్జూర వనం’’ అని అర్ధం చెప్పాడు .’’ఖర్జూర వాటిక ‘’అనే వారు ఆనాడు. అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతం గా పండేది .దీనికి సాక్ష్యం గా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి. ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం. వాటిని విడిగా చూడకుండా మొత్తం శిల్పాలను కలిపి ఒకే దృష్టి తో చూడాలని చరిత్రకారులన్నారు. 1864లో కన్నింగ్ హాం దర్శించి 872 విగ్రహాలున్నాయని, అందులో గోడలకు వెలుపల 646 ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. అవన్నీ చెల్లా చెదరుగా పడి కుప్పలు గా ఉండిపోయాయని ఆ శిలాశిల్ప నిధి అపూర్వమనీ చెప్పాడు .
మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘’చాలా జుగుప్సా కరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని ‘’హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్ర నాథ్ ఠాగూర్ ‘’ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయ మనటం అవివేకమని అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ‘’అని గాంధీకే ‘’క్లాస్ ‘’పీకాడు. ఖజురహో పద్నాలుగో శతాబ్దపు చండేలా వంశ రాజుల మతాత్మక రాజధాని అన్నారు ఆరబ్ యాత్రికుడు’’ ఐబాన్ బుటూటా’’దీన్ని1335 లో చూసి దీన్ని ‘’కజర్రా ‘’అనే వారని ఇక్కడ యోగులు బారు గడ్డాలతో జటాజూటాలతో ఉండేవారని నిరాహారం వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు .ఇప్పుడున్న ఖజురహో సాగర్ 800మీటర్లు పడమటి దేవాలయాలకు దూరంగా ఉండేది. అప్పుడిది ఖజురహో నగరానికి గుండె కాయగా వర్ధిల్లిందని చెప్పాడు. ఇప్పటికీ శివరాత్రి నాడు వేలాది భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు. అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం" తప్పక చూసి అనుభూతి పొందాలి. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి. భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు. ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు. ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి. స్థానికంగా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతంలో ప్రదర్శించి అమ్ముతారు. ఈ ఉత్సవం భారత దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే.