కొలకలూరి ఇనాక్
తెలుగు రచయిత, ఆచార్యుడు, వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి / From Wikipedia, the free encyclopedia
కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం, "'పద్మశ్రీ"' పురస్కారం ఇచ్చింది.[1]. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది.