కాశీనాథుని నాగేశ్వరరావు
విద్యావేత్త, వ్యాపారవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అతనును 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని అతనును అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనును 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.[1][2] ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు.[3]
కాశీనాథుని నాగేశ్వరరావు | |
---|---|
![]() విశ్వదాత, దేశోద్ధారక | |
జననం | మే 1, 1867 ఎలకుర్తి |
మరణం | 1938 ఏప్రిల్ 11(1938-04-11) (వయసు 70) |
ప్రసిద్ధి | వ్యాపారవేత్త, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, దానశీలి |
తండ్రి | బుచ్చయ్య |
తల్లి | శ్యామలాంబ |
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను అతను స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. అతను స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
అతనుకు విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులు ఉన్నాయి. అతను తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. అతను దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నాడు[ఆధారం చూపాలి].
చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.