కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన కార్యనిర్వాహక అంగం / From Wikipedia, the free encyclopedia
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి), భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యనిర్వాహక కమిటీ. 1920 డిసెంబరులో నాగపూరులో జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశాల్లో సి. విజయరాఘవాచారియర్ నేతృత్వంలో దీన్ని ఏర్పరచారు. ఇది పార్టీ సీనియర్ నాయకులతో కూడి ఉంటుంది. ముఖ్యమైన విధానం, సంస్థాగత విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలకు మార్గనిర్దేశం చేయడం దీని బాధ్యతలు. ఇందులో సాధారణంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నుండి ఎన్నికైన పదిహేను మంది సభ్యులు ఉంటారు. సిడబ్ల్యుసికి పార్టీ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. పార్టీ కేంద్ర పాలకమండలి అయిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు.
వర్కింగ్ కమిటీ వివిధ సమయాల్లో పార్టీలో వివిధ స్థాయిల్లో అధికారాలు ఉండేవి. స్వాతంత్ర్యం రావడానికి ముందు, వర్కింగ్ కమిటీ అధికార కేంద్రంగా ఉండేది. కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చురుకుగా ఉండేవారు. 1967 తర్వాత కాలంలో, కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయినప్పుడు (ఇందిరాగాంధీకి విధేయులైన వర్గానికీ, కామరాజ్, ప్రఫుల్ల చంద్ర సేన్, అజోయ్ ముఖర్జీ, మొరార్జీ దేశాయ్ వంటి నాయకులతో కూడిన ప్రాంతీయ నాయకుల సిండికేట్ ల మధ్య చీలిపోయింది) వర్కింగ్ కమిటీ ఆధిపత్యం క్షీణించింది. కానీ 1971 లో ఇందిరా గాంధీ విజయం సాధించాక, రాష్ట్రాల నుండి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుండి అధికారం తిరిగి కేంద్రీకృతమైంది. ఢిల్లీలోని వర్కింగ్ కమిటీ మరోసారి పార్టీకి ప్రధాన నిర్ణయాధికార సంస్థగా మారింది.[1] కాంగ్రెస్ నిర్ణయాధికారంలో ఉండే కేంద్రీకృత స్వభావం అప్పటి నుండి రాష్ట్రాలలోని పరిశీలకులు ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాలు "హైకమాండ్" నుండి వచ్చినట్లు చెప్పడం పరిపాటి అయింది.