కల్యాణం రఘురామయ్య
భారతీయ నటుడు / From Wikipedia, the free encyclopedia
ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య (మార్చి 5, 1901 - ఫిబ్రవరి 24, 1975) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు,[1] ఇరవైరెండు చలనచిత్రాలలో తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. తెలుగు నాటకాలకుమాత్రమే ప్రత్యేకము అయిన పద్య ఉటంకము. అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము, సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేస్తారని ప్రతీతి.
కల్యాణం రఘురామయ్య | |
---|---|
జననం | కల్యాణం వెంకట సుబ్బయ్య మార్చి 5, 1901 |
మరణం | ఫిబ్రవరి 24, 1975 |
మరణ కారణం | గుండెపోటు |
ఇతర పేర్లు | ఈలపాట రఘురామయ్య |
వృత్తి | నటుడు, గాయకుడు |
జీవిత భాగస్వామి | సావిత్రి (రోహిణి వెంకట సుబ్బయ్య, సీతమ్మ ల రెండవ పుత్రిక). 92 యేళ్ళ వయస్సు ఉండగా, డిసెంబరు 8, 2014న మరణించారు. |
పిల్లలు | ఒకే కుమార్తె, తోట సత్యవతి |
తల్లిదండ్రులు |
|
రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది. అనుపూర్విక నటనలో ఈయన ప్రసిద్ధుడు. కళారంగానికి చేసిన అత్యున్నత కృషికిగాను 1973లో సంగీత నాటక అకాడెమి వారి పురస్కారము, 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము ఈయనను వరించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకు "నాటక కూయిల" అని ప్రశంసించారు.[2]