ఆపద్బాంధవుడు
1992 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఆపద్బాంధవుడు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
త్వరిత వాస్తవాలు ఆపద్భాందవుడు, దర్శకత్వం ...
ఆపద్భాందవుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
స్క్రీన్ ప్లే | కె.విశ్వనాథ్ |
కథ | కె.విశ్వనాథ్ |
నిర్మాత | ఏడిద నాగేశ్వరరావు |
తారాగణం | చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల |
ఛాయాగ్రహణం | ఎ. విన్సెంట్, అజయన్ విన్సెంట్ |
కూర్పు | జి. జి. కృష్ణారావు |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | అక్టోబరు 9, 1992 (1992-10-09) |
భాష | తెలుగు |
మూసివేయి
చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.