ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరం పల్నాడుకు ముఖ ద్వారము వంటిది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.
పట్టణం | |
Coordinates: 16.3962°N 80.1497°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | సత్తెనపల్లి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 22.81 కి.మీ2 (8.81 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 56,721 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1001 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8641 ) |
పిన్(PIN) | 522403 |
Website |
జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి ఈశాన్య దిశలో 23 కి.మీ. దూరంలో, సమీప నగరమైన గుంటూరు కు వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఈ పట్టణం వుంది.
2011 జనగణన ప్రకాం పట్ణణ జనాభా 56,721.
గుంటూరు - మాచర్ల రహదారి పట్టణంగుండా పోతుంది. గుంటూరు - నడికుడి రైల్వే మార్గంలో ఈ పట్టణం వుంది.
ఉమ్మడి జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసింది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.