From Wikipedia, the free encyclopedia
లిబియా (ఆంగ్లం : Libya) (అరబ్బీ : ليبيا )), అధికారిక నామం : లిబియా దేశం (الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى అల్-జమ్హూరియ అల్-అరబియ్య అల్-లిబియ్యా అస్-సాబియ్య అల్-ఇష్తిరాకియ్యా అల్-ఉజ్మా) అధికారికంగా "లిబియా దేశం" [3][4][5][6]) ఇది ఉత్తర ఆఫ్రికాలోని మఘ్రెబు ప్రాంతంలో ఉంది. దేశ ఉత్తరసరిహద్దులో మధ్యధరా సముద్రం, తూర్పుసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో చాద్, నరుతీసరిహద్దులో నైగర్, పశ్చిమసరిహద్దులో అల్జీరియా, వాయవ్యసరిహద్దులో టునీషియా దేశాలు ఉన్నాయి.[7]చమురు నిల్వలలో లిబియా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది..[8] అతిపెద్ద నగరం, రాజధాని అయిన ట్రిపోలి పశ్చిమ లిబియాలో ఉంది. నగర జనసంఖ్య 6 మిలియన్ల కంటే అధికంగా ఉంది.[9] రెండవ అతిపెద్ద నగరం బెంఘాజి. ఇది తూర్పు లిబియాలో ఉంది.
లిబియా దేశం |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం అల్లాహు అక్బర్ అల్లాహ్ గొప్పవాడు |
||||||
రాజధాని | ట్రిపోలి 32°54′N 13°11′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
ప్రజానామము | లిబియన్ | |||||
ప్రభుత్వం | Jamahiriya | |||||
- | Leader and Guide of the Revolution | గడాఫి | ||||
- | Secretary General of the General People's Congress | Imbarek Shamekh | ||||
- | Prime Minister | Baghdadi Mahmudi | ||||
Independence | ||||||
- | Relinquished by Italy | 10 February 1947 | ||||
- | From France/United Kingdom under United Nations Trusteeship | 24 December 1951 |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | అంచనా | 6,173,579 (July 2008)[1] (105వది) | ||||
- | 2006 జన గణన | 5,670,6881 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $90.627 billion[2] | ||||
- | తలసరి | $14,593[2] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $108.475 billion[2] | ||||
- | తలసరి | $17,468[2] | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | 0.840 (high) (52వది) | |||||
కరెన్సీ | దీనార్ (LYD ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ly | |||||
కాలింగ్ కోడ్ | +218 | |||||
1 | Includes 350,000 foreigners (Libyan 2006 census, accessed September 15, 2006; ) |
పురాతన గ్రీకు వలసవాదులు తూర్పు లిబియాలో నగర-రాజ్యాలను ఏర్పాటు చేశారు. రోమను సామ్రాజ్యంలో భాగంకావడానికి ముందే లిబియాను కార్తగినియన్లు, పర్షియన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు పాలించారు. లిబియా క్రైస్తవ ప్రారంభ కేంద్రంగా ఉంది. పాశ్చాత్య రోమను సామ్రాజ్యం పతనం తరువాత 7 వ శతాబ్దంలో లిబ్యా ప్రాంతంలో అధికభాగాన్ని వండలు ఆక్రమించింది. ఆక్రమణలు ఈ ప్రాంతానికి ఇస్లాంను తీసుకుని వచ్చాయి. 16 వ శతాబ్దంలో స్పెయిన్ సామ్రాజ్యం, నైట్సు ఆఫ్ సెయింటు జాను ట్రిపోలీను ఆక్రమించుకున్నారు. 1551 లో ఒట్టోమను పరిపాలన ప్రారంభమైంది. లిబియా 18 వ - 19 వ శతాబ్దాల బార్బరీ యుద్ధాలలో పాల్గొంది. 1911 నుండి 1947 లిబియా ఇటాలియన్ ఆక్రమణ తరువాత తాత్కాలిక ఇటాలియన్ లిబియా కాలనీకి మారే వరకు ఒట్టోమను పాలన కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఉత్తర ఆఫ్రికా ఉద్యమంలో లిబియా ముఖ్యమైన ప్రాంతంగా ఉంది. ఈ సమయంలో ఇటాలియన్ జనాభా క్షీణించింది.
1969 లో లిబియా ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. 1969 లో ఒక రక్తపాతరహిత సైనిక తిరుగుబాటు రాజా మొదటి ఐడ్రిసును పడగొట్టింది.[10] తిరుగుబాటు నాయకుడు ముమామరు గడ్డాఫీ 1969 నుండి దేశం పరిపాలించాడు 1973 లో లిబియన్ సాంస్కృతిక విప్లవంతో గడాఫీ పదవీచ్యుతుడయ్యాడు. 2011 లిబియా అంతర్యుద్ధంలో చంపబడ్డాడు. లిబియాను పరిపాలించాలని రెండు అధికారులు ప్రారంభించారు: 2012 లో ఎన్నికైన జనరలు నేషనలు కాంగ్రెసు కొనసాగింపుగా భావించే ట్రిబొలీలో టొపూక్లో కౌన్సిలు ఆఫ్ డిప్యూటీసు, 2014 జనరలు నేషనలు కాంగ్రెసు (జి.ఎన్.సి) ఉన్నాయి.[11][12] టోబాకు, ట్రిపోలి ప్రభుత్వాల మధ్య ఐక్యరాజ్యసమితి నాయకత్వంలో శాంతి చర్చలు జరిగాయి,[13] 2015 లో ఐక్యరాజ్య సమితి మద్ధతుతో నేషనలు అకార్డు ప్రభుత్వం స్థాపించబడింది.[14] GNC దీనికి జి.ఎన్.సి. మద్దతు తొలగించింది.[15] లిబియా భాగాలు కొన్ని ప్రాంతాలు ఇస్లామిస్టు తిరుగుబాటుదారుల ఆధినంలో ఉండిపోయాయి. మరికొన్ని ప్రాంతాలు గిరిజన సైనికుల నియంత్రణలో ఉన్నాయి.[16] 2017 జూలై వరకు జి.ఎన్.ఎ, టోబాకు ఆధారిత అధికారుల మధ్య కొనసాగిన కలహాలు లిబియా జాతీయ సైన్యం, సెంట్రలు బ్యాంకు ఆఫ్ లిబియా వంటి విభజించబడిన స్థావరాలను ఏకీకరణతో కలహాలు ముగింపుకు వచ్చాయి.[17][18]
లిబియా ఐక్యరాజ్యసమితిలో (1955 నుండి), నాన్-అమెన్డు మూవ్మెంటు, అరబు లీగు, ఒ.ఐ.సి, ఒ.పి.ఇ.సి. లలో సభ్యదేశంగా ఉంది. దేశం అధికారిక మతం ఇస్లాం. లిబియా జనాభా సున్ని ముస్లింలు 96.6% మంది ఉన్నారు.
దీని విస్తీర్ణం 18 లక్షల చ.కి.మీ.,దీని అధికార భాష: అరబిక్, దీని కరెన్సీ దీనార్, ఇందులో 90% ఎడారి గలదు. జనాభా 66 లక్షలు.[19] దీని రాజధాని ట్రిపోలి నగరం, దీని జనాభా 17 లక్షలు.
లిబియా (Listeni / lɪbiə /; అరబ్బీ: ليبيا; మూస: Lang - it; అధికారికంగా లిబియా రాష్ట్రం, [సందేహాస్పద - చర్చ] [5] [6] [7] [8]) అనేది మఘ్రేబ్ ప్రాంతంలోని ఒక దేశం ఉత్తర ఆఫ్రికా, ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్ట్, దక్షిణాన సూడాన్, దక్షిణాన చాద్, నైరుతి నైరుతి, పశ్చిమాన అల్జీరియా, ట్వంటీషియాకు తూర్పున ఉన్నాయి. సార్వభౌమ రాజ్యం మూడు చారిత్రాత్మక ప్రాంతాలు కలిగి ఉంది: ట్రిపోలిటోనియా, ఫెస్జాన్, సైరెన్సియా. దాదాపు 1.8 మిలియన్ చదరపు మీటర్ల (700,000 sq mi) విస్తీర్ణంలో, లిబియా ఆఫ్రికాలో నాల్గవ అతిపెద్ద దేశం, ప్రపంచంలో 16 వ అతిపెద్ద దేశం. [9] లిబియా ప్రపంచంలోని ఏ దేశంలోని 10 వ అతి పెద్ద నిరూపితమైన చమురు నిల్వలను కలిగి ఉంది. [10] అతిపెద్ద నగరం, రాజధాని, ట్రిపోలి, పశ్చిమ లిబియాలో ఉంది, లిబియా యొక్క ఆరు మిలియన్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. [11] తూర్పు లిబియాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం బెంఘజి.
చివరి కాంస్య యుగం నుండి లిబియా బెర్బెర్సు నివసితప్రాంతంగా ఉంది. పశ్చిమ లిబియాలో ఫోనీషియన్ల వర్తకులు స్థావరాలను స్థాపించారు.
చాలా సంవత్సరాలు నియంతృత్వ పాలనలో ఉన్న ఈ దేశానికి 1951, డిసెంబరు 24 న స్వాతంత్ర్యం వచ్చింది. జనాభాలో 97% ప్రజలు ముస్లింలే. ప్రజలందరికీ ప్రాథమిక విద్య ఉచితంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరు ఉన్నత పాఠశాల విద్య విధిగా అభ్యసించాలనే నియమం కూడా ఉంది. దేశంలో చాలా విశ్వవిద్యాలయాలున్నాయి కానీ స్వాతంత్ర్యం లభించిన మొదట్లో ప్రారంభించిన లిబియా విశ్వవిద్యాలయంలో చదవడం గౌరవంగా భావిస్తారు.
ఆహార ధాన్యాలను చాలావరకు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటారు. గోధుమ, జొన్న, ఖర్జూరం, ఆలివ్, టమోటా, బంగాళాదుంపలు పండిస్తారు. మద్యపానం నేరం.
తొలుత పేద దేశంగా ఉన్నప్పటికీ చమురు నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కొంతకాలం క్రిందట ప్రారంభమైన రైల్వేలైన్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. లిబియా అధ్యక్షుడు గడాఫీ నియంతృత్వ పోకడల వల్ల అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల అశాంతి నెలకొన్నది. [20]
లాటిన్ పేరు లిబియా (గ్రీకు Λιβύη, లిబి) అని పిలువబడుతుంది. నైలు నదికి పశ్చిమంలో ఉత్తర ఆఫ్రికా మద్యప్రాంతాలలో ఉపస్థితమై ఉన్న ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మకంగా అనేక మధ్యధరా సంస్కృతులు ప్రవేశించాయి. దీని ఆదిమవాసులు దీనిని "లిబ్యూ" గా సూచించబడ్డారు. 1934 లో ఈ ప్రాంతం " ఇటలీ లిబియా " గా పిలువబడింది. ఈ పేరు నుండి దేశం కొరకు లిబియా స్వీకరించబడింది. పురాతన గ్రీకులు వాయవ్య ఆఫ్రికాను Λιβύη (లిబుయు) అని పిలిచారు. దానిలో లిబుయు రూపాంతరం చెందిన లిబియా పేరును స్వీకరించి " ఇటాలీ లిబియా " పేరు వచ్చింది.[21] 1551 నుండి 1911 వరకు ఒట్టోమను సామ్రాజ్య పాలనలో ఉన్న ప్రస్తుత లిబియా తీరప్రాంతం (తీరప్రాతం ట్రిపోలిటోనియా లఘుద్వీపంగా పరిగణించబడింది) ఒట్టోమను ట్రిపోలిటానియాగా ఉండేది. నికి ఒట్టోమన్ ట్రిపోలిటోటియాకు వర్తింపజేయడానికి ఉద్దేశించబడింది. 1903 లో ఇటలీ భౌగోళిక శాస్త్రవేత్త ఫెడెరికో మినుటిల్లి "లిబ్యా" అనే పేరు తిరిగి ఉపయోగించాడు.[22]
1951 లో లిబియా యునైటెడు లిబియను రాజ్యంగా (అరబ్బీ: المملكة الليبية المتحدة al-Mamlakah al-Lībiyyah al-Muttaḥidah) స్వాతంత్ర్యం పొందింది. 1963 లో దాని పేరు లిబియా రాజ్యంగా (అరబ్బీ: المملكة الليبية al-Mamlakah al-Lībiyyah) మార్చబడింది.[23] 1969 లో ముయామ్మరు గడాఫి నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు తరువాత దేశం పేరు " లిబియా అరబు రిపబ్లికు " అయింది.(అరబ్బీ: الجمهورية العربية الليبية al-Jumhūriyyah al-‘Arabiyyah al-Lībiyyah). 1977 నుండి 1986 అధికారిక నామం " సోషలిస్టు పీపుల్సు లిబియను అరబు జమాహిరియా " అని ఉంది.[24] (అరబ్బీ: الجماهيرية العربية الليبية الشعبية الاشتراكية العظمى[25] al-Jamāhīriyyah al-‘Arabiyyah al-Lībiyyah ash-Sha‘biyyah al-Ishtirākiyyah al-‘Uẓmá listen (help·info)) 1986 నుండి 2011 ఈ దేశం " గ్రేటు సోషలిస్టు పీపుల్సు లిబియను అరబు జమాహిరియ " అని పులువబడింది.
2011 లో స్థాపించబడిన " నేషనలు ట్రాంసిషనలు కౌన్సిలు " దేశాన్ని "లిబియా" అని మాత్రమే సూచించింది. 2011 సెప్టెంబరు నుండి ఐఖ్యరాజ్యసమితి దేశాన్ని లిబియాగా గుర్తించింది.[26] 2011 నవంబరులో ఫ్రెంచి భాషలో "లిబియా (లా)" అనే పేరును ఆంగ్ల భాషలో "లిబియా" అనే కొత్త పేరుతో పిలువబడింది.[27]
2017 డిసెంబరులో " పర్మనెంటు మిషను ఆఫ్ లిబియా " ఐక్యరాజ్యసమితికి దేశం అధికారిక పేరు ఇకపై "లిబియా రాజ్యం" అని తెలియజేసింది. "లిబియా" అనే పేరు అధికారిక సంక్షిప్త రూపంగా మిగిలిపోయింది.[28]
లిబియా తీర మైదానం సామన్య శకం 8000 నుంచి నియోలిథికు ప్రజలు నివసించారు. కాంశ్య యుగం చివరిలో బెర్బెరు ప్రజల పూర్వీకులుగా భావించబడుతున్న ఆఫ్రోయాసిటికు ప్రజలు ఈ ప్రాంతంలో విస్తరించారు. ఆఫ్రోయాసిటికు తెగకు మొట్టమొదటి పేరు గరమంటా. వీరు జెర్మాకు చెందిన వారు. ఫొనీషియన్లు లిబియాలో మొట్టమొదటి వర్తక స్థానాలను స్థాపించారు.[29] సామన్య శకం 5 వ శతాబ్దం నాటికి ఫొనీష్యా కాలనీల్లో అతి పెద్దది కార్తేజు ఉత్తర ఆఫ్రికాలో చాలా భాగంలో తన ఆధిపత్యాన్ని విస్తరించింది. ఇక్కడ ప్యూనికు అని పిలవబడే విలక్షణమైన నాగరికత ఏర్పడింది.
సామన్య శకం 630 లో పురాతన గ్రీకులు తూర్పు లిబియాలోని బార్కా చుట్టుప్రక్కల ప్రాంతానికి వలసవచ్చి సైరెను నగరాన్ని స్థాపించారు.[30]200 సంవత్సరాలలో సైప్రెనాకా అని పిలవబడే ప్రాంతంలో నాలుగు ముఖ్యమైన గ్రీకు నగరాలు స్థాపించబడ్డాయి;[31] అకామెనిడ్ లిబియా
సామన్య శకం 525 లో రెండవ కాంబిసెసు పర్షియా సైన్యం సైరెనాకాను జయించింది. అది తరువాతి రెండు శతాబ్దాలు పర్షియా లేదా ఈజిప్టు పాలనలోనే ఉన్నాయి. గ్రీకుల ప్రోత్సాహంతో అలెగ్జాండరు ది గ్రేటు సామన్య శకం 331 లో సైరెన్సియాలో ప్రవేశించిన తరువాత తూర్పు లిబియా మళ్లీ గ్రీకుల నియంత్రణలో పడిపోయింది. ఈసారి టోలెమిక్ రాజ్యంలో భాగంగా ఉంది.
కార్థేజు పతనం తరువాత రోమన్లు వెంటనే ట్రిపోలిటోనియా (ఈ ప్రాంతం ట్రిపోలి చుట్టూ) ప్రాంతాన్ని ఆక్రమించనప్పటికీ నమిడియా రాజులు తీరప్రాంత పట్టణాల (పట్టణాలు రక్షణకావాలని కోరేవరకు) నియంత్రణను గ్రీకులకు విడిచిపెట్టారు.[32] చివరి గ్రీకు పాలకుడైన టోలెమి అపియను సిరెనకాను రోముకు అప్పగించాడు. ఇది సామన్య శకం. 74 లో అధికారికంగా కలుపుకొని రోమనుల ప్రొవింసులో చేర్చబడింది. ఆఫ్రికా నోవా ప్రావిన్సులో భాగంగా ట్రిపోలిటోనియా సంపన్నమైనది,[32] 2-3 శతాబ్ధాలలో లెప్టిసు మాగ్నా నగరం సెవెవాను వంశం నివాసప్రాంతంగా ఉన్నసమయంలో అది స్వర్ణయుగంగా సుసంపన్నమై శిఖరాగ్రానికి చేరుకుంది. [32]
చక్రవర్తి క్లాడియసు కాలం నాటికి తూర్పు వైపున సైరెన్సికా మొదటి క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి.[33]కిటోసు యుద్ధం సమయంలో సైరెనికా ధ్వంశం చేయబడింది.[34] గ్రీకులు, యూదులు వదిలి వెళ్ళడంతో దాదాపు నిర్మానుష్యం అయింది.[35]
తిరిగి ట్రాజను సైన్యస్థావరాలతో తిరిగి జనసమ్మర్ధప్రాంతం అయింది.[34] తరువాత దాని క్షీణదశ మొదలైంది.[33]లిబియా ఆరంభంలోనే " నిసెనె క్రైస్తవ మతం " నికి మారి మొదటి పోపు విక్టరుకు నివాసంగా ఉంది. అయినప్పటికీ లిబియా ఆరంభకాల ఆర్యనిజం, డోనటిజంకు సిరియా వేదికగా ఉంది.
రోమను సామ్రాజ్యం తిరోగమనం సాంస్కృతిక నగరాలు నాశనమయ్యాయి. 5 వ శతాబ్దంలో ఉత్తర ఆఫ్రికా వాండల్సు దాడుల కారణంగా ఒక ప్రక్రియ వేగవంతం అయింది. 6 వ శతాబ్దం జస్టీనియను (ఇప్పుడు ఈస్ట్ రోమన్లు) తిరిగి ఈ ప్రాంతాన్ని జయించి పాత నగరాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ త్వరలోనే అవి ఉపయోగించబడకుండా పోయాయి. వాండలు కాలంలో బైజాంటైను సామ్రాజ్యం కేంద్రం అయిన సైరైనెకా ఒక సాయుధ శిబిరాల స్థావరం అయింది. అప్రసిద్ధ బైజాంటైను గవర్నర్లు సైనిక ఖర్చులను ఎదుర్కొనేందుకు భారీస్థాయిలో పన్ను విధించారు. అయితే నీటి వ్యవస్థతో సహా పట్టణాలు, ప్రభుత్వ సేవలు - క్షీణించబడ్డాయి. 7 వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతంపై బైజాంటైన్ నియంత్రణ బలహీనంగా ఉంది. బెర్బెరు తిరుగుబాట్లు మరింత తరచుగా జరగడంతో ముస్లిం ముట్టడిని వ్యతిరేకించడం చాలా సమర్ధత కొరవడింది.[36]
అమరు ఇబ్ను అలు-ఆసు ఆధ్వర్యంలో రషీదును సైన్యం సైరెనకాను జయించాడు.[37] 647 లో అబ్దుల్లా ఇబ్ను సాదు నేతృత్వంలోని ఒక సైన్యం బైజాంటైన్సు నుండి ట్రిపోలిని తీసుకుంది.[37] 663 లో ఉజ్బా ఇబ్ను నఫీ ""ఫెజ్జను " స్వాధీనపరుచుకుంది. అయితే హింటర్లాండులో ఉన్న బెర్బెరు తెగల ప్రజలు ఇస్లాంను స్వీకరించారు. అయితే వారు అరబు రాజకీయ పాలనను వ్యతిరేకించారు.[38]
లిబియా తర్వాతి అనేక దశాబ్దాలు డమాస్కసు ఖలీఫు ఉమయ్యదు ఖలీఫు ఆధ్వర్యంలో ఉంది. 750 లలో అబ్బాసిడ్లు ఉమయ్యదును పడగొట్టిన తరువాత లిబ్యా బాగ్దాదు పాలనలోకి వచ్చింది. 800 లో ఖలీఫు " హరును అలు-రషీదు" ఇబ్రహీం ఇబ్ను అలు-అఘ్లాబును ఇఫ్రికియా గవర్నర్గా నియమించిన సమయంలో అఘ్లాబిదు రాజవంశం ఆధ్వర్యంలో గణనీయమైన స్థానిక స్వయంప్రతిపత్తి సాధించింది. 10 వ శతాబ్దంనాటికి షీటే ఫాతిమిదులు పాశ్చిమ లిబియాను నియంత్రిస్తూ 972 లో మొత్తం ప్రాంతాన్ని పాలించారు. బోలోగ్నిను ఇబ్ను జిరిని గవర్నరుగా నియమించారు.[32]
ఇబ్ను జిరి ""బెర్బెరు జిరిడు సామ్రాజ్యం " చివరికి షిటే ఫాతిమిదుల నుండి విడిపోయింది. బాగ్దాదు సున్ని అబ్బాసిడ్లను ఖచ్చితమైన ఖలీఫులుగా గుర్తించింది. ప్రతీకారంతో ఫతిమిదులు వేల సంఖ్యలో రెండు అరబు క్వాసీ తెగల (బాను సులైం, బాను హిలాలు)ప్రజలను ఈ ప్రాంతానికి వలసగా ఉత్తర ఆఫ్రికాకు తీసుకు వచ్చారు. ఈ చర్య లిబియా గ్రామీణ దృశ్యాన్ని తీవ్రంగా మార్చింది. ప్రాంతం సాంస్కృతిక, భాషా అరబీకరణను సుస్థిరం చేసింది.[32]
ట్రిపోలిటోనియాలో జిరిడు పాలన కొద్దికాలం మాత్రమే ఉంది. 1001 లో బాను ఖజ్రను బెర్బర్లు విడిపోయారు. ట్రిప్టోలియానియా వారి నియంత్రణలో ఉంది. 1146 లో చివరకు సిసిలీ నార్మన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.[39] 1159 వరకు మొరాకో అల్మొహోదు నాయకుడు అబ్దు అలు-ము'మిను ఐరోపా పాలన నుండి ట్రిపోలిని తిరిగి చేజిక్కించుకున్నాడు. తర్వాతి 50 సంవత్సరాల వరకు అబూబాయిదులు, అల్మోహదు పాలకులు, బాను ఘనీయ తిరుగుబాటుదారుల మధ్య సంభవించిన అనేక పోరాటాలకు ట్రిపోలిటానియా వేదికగా ఉంది. తర్వాత ఆల్మోహదులు సైనికాధికారి ముహమ్మదు ఇబ్ను అబూ హఫ్సు 1207 నుండి 1221 వరకు లిబియాను పాలించాడు. తరువాత ఆయన ట్యునీషియా హఫ్సిదు రాజవంశాన్ని స్థాపించాడు.[39] దాదాపు 300 సంవత్సరాలుగా హఫీసిదులు ట్రిపోలిటానియాను పాలించారు. 16 వ శతాబ్దంనాటికి స్పెయిన్, ఒట్టోమను సామ్రాజ్యం మధ్య అధికార పోరాటం హఫ్సిదులకు ప్రయోజనకారిగా మారింది.
అబ్బాసిదుల నియంత్రణను బలహీనపరిచిన తరువాత సిరెనకా తులున్యిదులు, ఇఖిషీదులు, అయ్యుబిదులు, మమ్లుక్లు వంటి ఈజిప్టు ఆధారిత రాజ్యాల పాలనలో ఉంది. చివరగా ఫెజను కన్మే పాలన తర్వాత అహ్మదు ముహమ్మద్ రాజవంశం ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం పొందింది. ఒట్టోమన్లు 1556 - 1577 మధ్య కాలంలో ఓట్టమన్లు చివరకు ఫెజ్జనును స్వాధీనం చేసుకున్నారు.
1510 లో హబ్సుబర్గు స్పెయిన్ ట్రిపోలీ మీద విజయవంతంగా దాడిచేసి [39] సెయింటు జాను నైట్సుకు స్వాధీనం చేయబడిన తరువాత 1551 లో ఒట్టోమను అడ్మిరలు సినాను పాషా లిబియాపై నియంత్రణను తీసుకున్నాడు.[39] ఆయన వారసుడు టుగాటు రెయిసు దీనికి " ట్రిపొలీ బెయి " అని నామకరణం చేసాడు. తరువాత 1556 లో " పాషా ఆఫ్ ట్రిపాలి " అని పేరు పెట్టాడు. 1565 నాటికి ట్రిపోలీ రాజప్రతినిథి (పాషా) మారింది. ట్రిపోలీ పాషాను కాన్సుస్టాంటినోపులు ఇస్తాంబులు సుల్తాను నేరుగా నియమించాడు. 1580 లలో ఫెజ్జాను పాలకులు సుల్తానుకు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఒట్టోమన్ అధికారం సైరెనకాలో లేనప్పటికీ తరువాతి శతాబ్దంలో ట్రిపోలీ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడానికి బెంజజీలో ఒక బేను ఉంచారు.[33] సూడాన్ నుండి ఐరోపాకు రవాణా చేయబడిన బానిసలు పెద్ద సంఖ్యలో రోజువారీ ట్రిపోలీ జీవితంలో భాగంగా ఉన్నారు. 1551 లో " తుర్గట్ రెయిస్ " గోజా ద్వీపంలో ఉన్న దాదాపు మొత్తం మల్టీలను (5,000) బానిసలుగా చేసి లిబియాకు పంపించాడు.[40][41]
కొద్దికాలానికే అధికారం పాషా దళాల జనిసరీలకు స్వాధీనం అయింది.[39] 1611 లో పాషాకు వ్యతిరేకంగా తిరుగుబాటులు జరిగాయి. డేలు పాషా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సులైమాను సఫరును ప్రభుత్వ అధిపతిగా నియమించారు. తర్వాతి వంద సంవత్సరాలు డేల శ్రేణి ట్రిపోలిటోనియాని సమర్థవంతంగా పరిపాలించారు. ఇద్దరు అతి ముఖ్యమైన డేలు మెహ్మెదు సక్జిలి (1631-49) ఒస్మాను సాక్విజిలి (R 1649-72). ఇద్దరూ పాషాలుగా సమర్థవంతంగా ఈ ప్రాంతాన్ని పాలించారు.[42] తరువాతి కూడా సిరెనకాను కూడా జయించారు.[42]
ఒట్టోమను ప్రభుత్వం నుండి వైదొలగుట వలన, ట్రిపోలి అప్పటి సైనిక తిరుగుబాటు కాలంలో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో తిరుగుబాటు తరువాత తిరుగుబాటు జరిగింది. కొంతమంది అధికారులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండడం అసాధ్యం అయింది. అలాంటి ఒక తిరుగుబాటుకు టర్కిషు అధికారి అహ్మదు కరామన్లీ నాయకత్వం వహించాడు.[42] 1711 నుండి 1835 వరకు ట్రిపోలిటోనియాను కరామాన్లీలు పాలించారు. 18 వ శతాబ్దం మధ్యనాటికి సైరెనికా, ఫెజ్జనులలో కూడా ప్రభావం చూపారు. అహ్మదు వారసులు స్వయంగా తండ్రి కంటే తక్కువ సామర్ధ్యం ఉన్న వారని నిరూపించుకున్నారు. అయితే ఈ ప్రాంతం అధికారం కరామన్లికి అనుమతించబడింది. 1793-95 ట్రిపోలిటానియను పౌర యుద్ధం జరిగింది. 1793 లో టర్కిషు అధికారి అలీ బెన్ఘులు హమేత్ కరామినలిని తొలగించి ట్రిపోలిటోనియాలో స్వల్పకాలం ఒట్టోమను పరిపాలన పునరుద్ధరించాడు. హమీదు సోదరుడు యూసఫు (1795-1832) తిరిగి ట్రిపోలిటోనియా స్వాతంత్రాన్ని తిరిగి నెలకొల్పారు.
19 వ శతాబ్దం ప్రారంభంలో యునైటెడు స్టేట్సు, ట్రిపోలీటానియా మధ్య యుద్ధం మొదలయ్యింది. తరువాత మొదటి బార్బరీ యుద్ధం, రెండవ బార్బరీ యుద్ధం అని పిలవబడిన వరుసలో యుద్ధాలు జరిగాయి. 1819 నాటికి నెపోలియన్ యుద్ధాల అనేక ఒప్పందాలు బార్బరీ రాజ్యాలను దాదాపు పూర్తిగా పైరసీని విడిచిపెట్టేలా బలవంతం చేశాయి. ట్రిపోలిటానియా ఆర్ధిక వ్యవస్థ పతనం మొదలైంది. యూసఫు బలహీనంగా ఉన్నందున అతని ముగ్గురు కుమారులు చుట్టూ వర్గాలు ఏర్పడ్డాయి. త్వరలోనే అంతర్యుద్ధం జరిగింది.[43]
ఒట్టోమను సుల్తాను రెండవ మహ్మూదు కమానులీ రాజవంశం, స్వతంత్ర ట్రిపోలిటోనియా రెండింటి ముగింపును సూచిస్తూ దళాలను పంపించాడు.[43] 1858 లో అబ్దు-ఎల్-జెల్లీ, గుమా బెన్ ఖలీఫాల నాయకత్వంలో లిబియన్ తిరుగుబాటు కొనసాగింది.[43] ప్రత్యక్ష ఒట్టోమను పరిపాలన రెండవ కాలంలో పరిపాలనా మార్పులు జరిగాయి. 1850 - 1875 మధ్యకాలంలో సహారా వాణిజ్యం నుండి ఆదాయాన్ని సంపాదించడానికి ఒట్టోమను పరిపాలన ఫెజ్జాను వరకు పునరుజ్జీవనం చెందింది.
ఇటాలో-టర్కిషు యుద్ధము తరువాత (1911-1912) ఇటలీ ఏకకాలంలో ఆ మూడు ప్రాంతాలను కాలనీలుగా మార్చింది. [44] 1912 నుండి 1927 వరకు లిబియా భూభాగం " ఇటాలియన్ నార్త్ ఆఫ్రికా " గా గుర్తించబడింది. 1927 నుండి 1934 వరకు ఈ భూభాగం ఇటలీ గవర్నర్లచే నిర్వహించబడుతున్న రెండు కాలనీలుగా, ఇటాలియన్ సిరెనకా, ఇటాలియన్ ట్రిపోలిటోటియాగా విభజించబడింది. ఈ సమయంలో 1,50,000 మంది ఇటాలియన్లు లిబియాలో స్థిరపడ్డారు. మొత్తం జనాభాలో దాదాపు 20% మంది ఉన్నారు.[45]
1934 లో ఇటలీ కాలనీ అధికారిక నామంగా (సిరెనకా, ట్రిపాలిటానియా, ఫెజ్జను మూడు ప్రావిన్సులతో తయారు చేయబడింది) అనే పేరుగా "లిబియా" (ఈజిప్టు తప్ప మిగిలిన మొత్తం ఉత్తర ఆఫ్రికాకు చెందిన ప్రాంతానికి పురాతన గ్రీకులు & రోమన్లు ఉపయోగించిన పేరు) అనే పేరును స్వీకరించారు. ఒమరు మొఘ్తరు ఇటాలీ వలసరాజ్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు 1931 సెప్టెమబరు 16 న పట్టుబడి మరణశిక్షకు గురికావడంతో జాతీయ నాయకుడు అయ్యాడు. ఆయన జ్ఞాపకార్థం ముఖం ప్రస్తుతం లిబ్యాను పది దినారు నోటు మీద ముద్రించడం ద్వారా అతని దేశభక్తిని గుర్తించబడింది. ఇడిసు అలు-మహది అసు-సేనుసి (తరువాత రాజా మొదటి ఐడ్రిసు), సిరెనికా ఎమిరు రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఇటాలీ ఆక్రమణకు లిబియా ప్రతిఘటనను నిర్వహించారు. 1928 - 1932 మధ్య ఇటలీ సైన్యం "బెడోయిన్ జనాభాలో సగం మందిని (ప్రత్యక్షంగా లేదా వ్యాధి, శిబిరాలలో ఆకలిని) హతమార్చిందని ఇయాను పాపె అంచనా వేశారు." [46] ఇటలీ చరిత్రకారుడు ఎమీలియో జెంటైలు ప్రతిఘటనను అణచివేసిన ఫలితంగా 50,000 మంది మరణించారు.[47]
1934 లో గవర్నర్ బబో రాజధాని ట్రిపోలి [48]. "లిబియా" అని పిలిచే రాజకీయ సంస్థ సృష్టించబడింది ఇటాలియన్లు మౌలిక మెరుగుదలలు, ప్రభుత్వకార్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వారు 1934 నుండి 1940 వరకు లిబ్యాను రైల్వే, రహదారి నెట్వర్కులను విస్తరించారు. వందల కిలోమీటర్ల కొత్త రహదారులను, రైల్వేలను నిర్మించారు. కొత్త పరిశ్రమలు, డజను కొత్త వ్యవసాయ గ్రామాల ఏర్పాటును ప్రోత్సహించారు.
1940 జూన్ లో ఇటలీ రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది. 1943 లో ఇటలీ, దాని జర్మన్ మిత్రరాజ్యం కోసం చివరకు ఓటమిని ఎదుర్కొనడంతో ముగిసింది.
1943 నుండి 1951 వరకు లిబియా మిత్రరాజ్యాల ఆక్రమణలో ఉంది. బ్రిటీషు సైన్యం ట్రిపోలిటోనా, సిరెనికా రెండు మాజీ ఇటాలియన్ లిబియన్ రాజ్యాలుగా నిర్వహించింది, ఫెజ్జను ప్రావిన్సును ఫ్రెంచి పాలించింది. 1944 లో ఇడిసు కైరోలో ప్రవాస నుండి తిరిగి వచ్చాడు. కానీ 1947 లో విదేశీ నియంత్రణలో అంశాలను తీసివేసే వరకు సెరెనికాలో శాశ్వత నివాసం ప్రారంభించడానికి నిరాకరించాడు. 1947 నాటికి మిత్రరాజ్యాలతో శాంతి ఒప్పందం ప్రకారం ఇటలీ లిబియా అన్ని దావాలను విరమించుకుంది.[49]
1951 డిసెంబరు 24 న లిబియా " యునైటెడ్ కింగ్డం ఆఫ్ లిబియా " పేరుతో స్వతంత్రం ప్రకటించింది. లిబియా ఏకైక చక్రవర్తి ఐడ్రిసు పాలనలో రాజ్యాంగం వారసత్వ రాచరికంగా స్వాతంత్రాన్ని ప్రకటించింది. 1959 లో ముఖ్యమైన చమురు నిక్షేపాలను గుర్తించడం, పెట్రోలియం విక్రయాల తరువాత వచ్చే ఆదాయం ప్రపంచ పేద దేశాలలో అత్యంత పేదదేశంగా ఉన్న లిబియా అత్యంత సంపన్న రాజ్యంగా రూపొందించడానికి సహకరించాయి. లిబ్యాను ప్రభుత్వం ఆర్ధికవ్యవస్థను చమురు నాటకీయంగా మెరుగుపర్చినప్పటికీ రాజా ఇద్రీసు చేతిలో సంపద కేంద్రీకరించబడడం కొన్నివర్గాల మధ్య ఆగ్రహం కలిగించింది.[50]
1969 సెప్టెబరు 1 న ముయమ్మరు గడ్డాఫీ నాయకత్వం వహించిన తిరుగుబాటు సైనికాధికారుల బృందం రాజా ఇద్రిసు మిద ఒక ప్రారంభించిన తిరుగుబాటు కార్యక్రమాన్ని " అలు ఫతేహు విప్లవం " అని పిలువబడింది.[51] ప్రభుత్వ ప్రకటనలు, అధికారిక లిబియను ప్రెసులలో గడ్డాఫీను "బ్రదరు లీడరు అండ్ ది రివల్యూషను గైడు" గా పేర్కొన్నారు.[52]
1970 అక్టోబరులో ఇటాలీ ప్రభావాన్ని తగ్గించడానికి ఇటలీకి చెందిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుని లిబియా నుండి 12,000 మంది ఇటాలీ కమ్యూనిటీలను లిబియా యూదుల చిన్న కమ్యూనిటీతో కలిసి బహిష్కరించారు. ప్రస్తుతం ఇది "వెంజియాన్సు డే" గా పిలవబడే జాతీయ సెలవుదినం అయ్యింది.[53]అంతర్గత రాజకీయ అణచివేతతో లిబియా వృద్ధిలో పెరుగుదల సంభవించింది. 1973 లో 75 వ చట్టం క్రింద రాజకీయ అసమ్మతి చట్టవిరుద్ధం చేయబడింది. గడాఫీ రివల్యూషనరీ కమిటీల ద్వారా ప్రజలు సునిశితంగా పరిశీలించబడ్డారు.[54][55][56]
మునుపటి పాలనలో మహిళలపై విధించిన కఠినమైన సాంఘిక పరిమితులను ఎదుర్కోవాలని కూడా గడ్డాఫీ కోరుకున్నాడు. సంస్కరణలను ప్రోత్సహించడానికి విప్లవ మహిళల నిర్మాణంను ఏర్పాటు చేశాడు. 1970 లో ఒక చట్టం లింగ సమానత్వాన్ని ధృవీకరించింది. వేతన పక్షపాతం మీద ఒత్తిడిని కల్పించింది. 1971 లో గడాఫీ లిబియా జనరలు ఉమెన్సు ఫెడరేషను ఏర్పాటును చేసాడు. 1972 లో ఒక పదహారు సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసున్న స్త్రీలను వివాహం చేసుకోవడం నేరమని చట్టం రూపొందించబడింది. వాహానికి మహిళ అంగీకారం అవసరం అని భరోసా ఇచ్చింది.[57]
1975 అక్టోబరు 25 న మిస్రట నగరంలోని దాదాపు 20 సైనిక అధికారులచే తిరుగుబాటు ప్రయత్నం ప్రారంభమైంది.[58] తిరుగుబాటుదారుల ఖైదు చేయబడి, మరణశిక్షలకు గురైచేయబడ్డారు.[59] 1977 మార్చి 2 న లిబియా అధికారికంగా "గ్రేటు సోషలిస్టు పీపుల్సు లిబియా అరబు జమాహిరియా" గా మారింది. గడాఫీ జనరలు పీపుల్సు కమిటీలకు అధికారాన్ని జారీ చేసి, ఇకపై లాంఛనప్రాయంగా ఉండవచ్చని పేర్కొన్నారు.[60] ఆయన స్థాపించిన కొత్త "జామహిరి" పాలనా వ్యవస్థ అధికారికంగా "ప్రత్యక్ష ప్రజాస్వామ్యం" గా సూచించబడింది.[61]
1977 ఫిబ్రవరిలో లిబియా చాదులోని గౌక్యుని ఓయిడెడీ, పీపుల్స్ ఆర్మీ ఫోర్సెసుకు సైనిక సరఫరాలను చేయడం ప్రారంభించింది. ఉత్తర చాదులో తిరుగుబాటు దళాలు లిబియా మద్దతును దండయాత్రకు విస్తరించినప్పుడు " చాదియాన్-లిబియన్ " వివాదం ఆరంభమయ్యింది. అదే సంవత్సరంలో లిబియా, ఈజిప్టు సరిహద్దు యుద్ధం నాలుగు రోజుల జరిగింది. ఇది లిబియన్-ఈజిప్టు యుద్ధంగా పిలువబడింది. ఈ రెండు దేశాలు అల్జీరియన్ అధ్యక్షుడు హౌరీ బొవిదీనే మధ్యవర్తిత్వంతో ఒక కాల్పుల విరమణకు అంగీకరించాయి.[62] వందలాది లిబియన్లు టాంజానియాపై యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు. అణు-వ్యతిరేక ఉద్యమాల నుండి ఆస్ట్రేలియన్ ట్రేడ్ యూనియన్లకు, పలు ఇతర సమూహాలకు గడాఫీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.[63]
1977 నుండి దేశంలో తలసరి ఆదాయం 11,000 డాలర్లకు అధికరించింది. ఇది ఆఫ్రికాలో అత్యధికస్థాయిలో 5 వ స్థానంలో ఉంది.[64] మానవ అభివృద్ధి సూచిక ఆఫ్రికాలో అత్యధికంగా ఉంటూ సౌదీ అరేబియా కంటే ఎక్కువగా ఉంది.[65] ఏ విదేశీ రుణాలు తీసుకోకుండా ఇది లిబియా రుణ రహితత సాధించబడింది.[66] దేశం పెద్ద భాగాలలో స్వచ్ఛమైన నీటిని ఉచితంగా పొందటానికి గ్రేటు మాన్మేడు నది నిర్మించబడింది.[65] అదనంగా విశ్వవిద్యాలయ స్కాలర్షిప్లకు, ఉపాధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించబడింది.[67]
1970 లలో పెరిగిన చమురు నిల్వల నుండి లిబియా ఆదాయం, ఆయుధ కొనుగోళ్లకు, ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్దీ పేదలు, తీవ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం కోసం ఖర్చు చేయబడింది.[68][69][70] 1986 లో గడ్డాఫీని చంపడానికి ఉద్దేశించిన ఒక అమెరికా వాయుదళం దాడి విఫలమైంది. దాడిలో 270 మంది మృతి చెందారు. వాణిజ్య విమానంలో బాంబు దాడుల తరువాత లిబియా మీద ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది.[71]
అరబు తిరుగుబాటు కదలికలను ట్యునీషియా, ఈజిప్టు పాలకులను పడగొట్టిన తరువాత లిబియాలో 2011 ఫిబ్రవరి 17 న పూర్తి స్థాయి తిరుగుబాటు ప్రారంభమైంది.[72] ఈజిప్టు, ట్యునీషియా దేశాలతో పోలిస్తే, ముయామ్మరు గడ్డాఫీ నేతృత్వంలోని లిబియా అధికార పాలన మరింత నిరోధకశక్తిని కలిగి ఉంది. ఈజిప్టు, ట్యునీషియా దేశాలలో అధికారాన్ని పడగొట్టడం చాలా త్వరగా జరుగుతుంది. అయితే లిబియాలో జరిగిన తిరుగుబాటులపై గడాఫీ పోరాటం గణనీయమైన ఆటంకాలకు దారితీసింది.[73] ఒక పోటీ రాజకీయ అధికార తొలి ప్రకటన ఆన్ లైనులో కనిపించింది. మధ్యంతర నేషనలు కౌన్సిలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ప్రకటించింది. గడాఫీ సీనియర్ సలహాదారులలో ఒకరు ఒక ట్వీటును పోస్టు ద్వారా స్పందించారు. అయన రాజీనామా చేసి తొలగించబడ్డాడు. పారిపొమ్మని గడాఫీకి సలహా ఇచ్చాడు.[74] ఫిబ్రవరి 20 నాటికి అశాంతి ట్రిపోలి వరకు వ్యాపించింది. 2011 ఫిబ్రవరి 27 న లిబియా ప్రాంతం తిరుగుబాటుదారుల నియంత్రణలో నేషనలు ట్రాంసిషనలు కౌంసిలు స్థాపించబడింది. 2011 మార్చి 10 న లైబీరియా ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా మండలిని ఫ్రాంసు అధికారికంగా గుర్తించింది.[75][76]
పశ్చిమ లిబియాలో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రో-గడ్డాఫీ బలగాలు స్పందించగలిగాయి. తీరం వెంట తిరుగుబాటు కేంద్రం బెంఘజి వైపు ఎదురుదాడిని ప్రారంభించారు.[77] ట్రిపోలి నుండి 48 కిలోమీటర్ల (30 మైళ్ళు) జవియా పట్టణాన్ని వైమానిక దళ విమానాలు, సైన్యం ట్యాంకులు పేల్చివేసి జామహిరియా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. " యుద్ధంలో కనిపించని క్రూరత్వం ఉన్నత స్థాయిలో ఉంది." [78]
ఐక్యరాజ్యసమితి కార్యదర్శి జనరల్ బాన్ కీ-మూను, [79] ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలితో సహా ఐక్యరాజ్యసమితి సంస్థలు, అణిచివేత చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఖండించింది.[80][81]
2011 మార్చి 17 న ఐఖ్యరాజ్యసమితి భద్రతా మండలి 1973 [82] ను 10-0 ఓట్లు, రష్యా, చైనా, భారతదేశం, బ్రెజిల్, జర్మనీతో సహా ఐదు వ్యతిరేకతలతో ఆమోదించబడింది. ఈ తీర్మానం నో ఫ్లై జోను స్థాపనకు అనుమతించింది. లిబియాలో పౌరులను కాపాడటానికి "అవసరమైన అన్ని మార్గాల" ఉపయోగించబడింది.[83] మార్చి 19 న ఫ్లై జోనును రక్షించటానికి మిత్రపక్షాలు మొట్టమొదటగా లిబియా ఎయిరు డెఫెంసు నాశనం చేసాయి. దీనితో ప్రత్యర్థి లక్ష్యాల మీద దాడులకు గురిచేసే నిఘా మిషను ఫ్రెంచి ఎయిరు జెటు విమానాలు లిబియా గగనతలం ప్రవేశించింది.[84]
తరువాత వారాలలో అమెరికా దళాలు లిబియాకు వ్యతిరేకంగా నాటో కార్యకలాపాలలో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో యుద్ధనౌకలు, విమానాలలో 8,000 కంటే ఎక్కువ మంది అమెరికా సిబ్బంది ఉన్నారు. కనీసం 3,000 లక్ష్యాలు మీద 14,202 బాంబులు పడ్డాయి. లక్ష్యాలలో ట్రిపోలీలో 716, బ్రెగాలో 492 లక్ష్యాలు ఉన్నాయి.[85] అమెరికా వైమానిక దాడిలో బి-2 స్టీల్తు బాంబర్సు విమానాలు ఒక్కొక బాంబరులో 2000 పౌండ్ల బాంబులు (16 బాంబులు) సాయుధమయ్యాయి. మిస్సౌరీలో ఉన్న ఖండాంతర యునైటెడు స్టేట్సు స్థావరానికి తిరిగి వెళ్లిపోయాయి. [86] నాటో వైమానిక దళాలు అందించిన మద్దతు విప్లవం అంతిమ విజయానికి దారితీసింది.[87]
2011 ఆగస్టు 22 నాటికి తిరుగుబాటు యోధులు ట్రిపోలిని, ఆక్రమిత గ్రీను ప్రాంతంలో ప్రవేశించారు.[88] 2011 ఫిబ్రవరి 17 నుండి మృతి చెందినవారికి గౌరవసూచకంగా మార్టిర్సు స్క్వేరు అని పేరు పెట్టారు. 2011 అక్టోబరు 20 న, తిరుగుబాటు చివరి భారీ పోరాటం ముగిసింది. సిర్టే నగరంలో గడాఫీ బంధించి చంపబడ్డాడు. సిర్టే పతనం తర్వాత 2011 అక్టోబరు 23 న విధేయుల దళాలు సంతాపం జరుపుకుంది.
పౌర యుద్ధంలో కనీసం 30,000 లిబియన్లు మరణించారు.[89] నేషనలు ట్రాంసిషనలు కౌన్సిలు సభ్యులు 50,000 మంది గాయపడ్డారని అంచనా.[90]
విశ్వసనీయ శక్తుల ఓటమి తరువాత లిబియాలో విభిన్న ప్రాంతాలు, నగరాలు, గిరిజనులతో అనుబంధంగా ఉన్న అనేక ప్రత్యర్థి, సాయుధ సైన్యాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉండి దేశవ్యాప్తంగా తన అధికారాన్ని స్థాపించి దేశాన్ని నియంత్రించడంలో విఫలం అయింది. ఇస్లామిస్టు రాజకీయ నాయకులు, వారి ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరాటంలో ప్రత్యర్థుల సైనికులు ఒకరికి ఒకరితో ఒకరు పోటీపడ్డారు.[91] 2012 జూలై 7 న మాజీ పాలన ముగిసిన తరువాత లిబియన్లు మొదటి పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించారు. 2012 ఆగస్టు 8 న నేషనలు ట్రాంసిషనలు కౌంసిలు అధికారికంగా పూర్తిగా ఎన్నికైన జనరలు నేషనలు కాంగ్రెసుకు అధికారాన్ని అందజేసింది. అది ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి, కొత్త లిబియా రాజ్యాంగం ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణలో ఆమోదించడానికి బాధ్యత వహించింది.[92]
2012 ఆగస్టు 25 న అంతర్యుద్ధం ముగిసిన తరువాత కాలాన్ని "అత్యంత కఠోర సెక్టారియన్ దాడి" గా రాయిటర్సు నివేదించింది. అంతు తెలియని వ్యవస్థీకృత హత్యాకాండలు నిర్వహించబడ్డాయి. పగటి వెలుగులో లిబియా రాజధాని ట్రిపోలీలోని మధ్యలో ఉన్న సుఫీ మసీదు సమాధులతో బుల్డోజర్లతో కూల్చివేయబడ్డాయి. ఇది రెండు రోజులలో సుఫీ ప్రదేశాలలో జరిగిన రెండవ విధ్వంశంగా చెప్పవచ్చు.[93] అనేక విధ్వంసక చర్యలు వారసత్వ వినాశనం అనుమానిత ఇస్లామిస్టు సైనికులు, నగ్దు గజెలు విగ్రహం తొలగించటం, బెంఘజి సమీపంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి బ్రిటీషు సమాధి ప్రదేశాలు నాశనమవడం, అపవిత్రం చేయడం వంటివి నిర్వహించబడ్డాయి.[94][95] ఇస్లామిస్టు సంబంధిత రాడికలు సైనికులు, గుంపులు వారసత్వ విధ్వంసానికి సంబంధించిన అనేక ఇతర కేసులను నిర్వహించినట్లు నివేదించబడింది, అప్పటికే ప్రమాదస్థిలో ఉన్న అనేక చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడం, దొంగిలించడం, దోచుకోవడం జరిగింది.
2012 సెప్టెంబరు 11 న ఇస్లామిస్టు తీవ్రవాదులు బెన్గాజీలోని అమెరికను కాన్సులేటు మీద ఆశ్చర్యకరంగా దాడి చేశారు. లిబియాకు యు.ఎసు. రాయబారి, జె. క్రిస్టోఫరు స్టీవెన్సు మరో ముగ్గురు చంపబడ్డారు. ఈ సంఘటన యునైటెడు స్టేట్సు, లిబియాలో దౌర్జన్యానికి దారితీసింది.[96][97]
2012 అక్టోబరు 7 న కొత్త మంత్రివర్గం పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు రెండవ సారి విఫలమైన తర్వాత లిబియా ప్రధాన మంత్రిగా ఎన్నికయిన ముస్తఫా ఎ.జి.. అబుషగూరును తొలగించారు.[98][99][100] 2012 అక్టోబరు 14 న జనరలు నేషనలు కాంగ్రెసు మాజీ జి.ఎన్.సి. సభ్యుడు, మానవ హక్కుల న్యాయవాది అలీ జెడిడాను ప్రధానమంత్రిగా నియమించబడ్డారు.[101] తన మంత్రివర్గం జి.ఎన్.సి. చే ఆమోదించబడిన తర్వాత జైదాను ప్రమాణం చేసారు.[102][103] ఒక రోగు ఆయిలు షిప్మెంటును నిలిపివేయడంలో విఫలం అయినందుకు 2014 మార్చి 11 న జి.ఎన్.సి. చేత తొలగించబడిన తరువాత,[104] ప్రధాన మంత్రి జైడెను పదవీవిరమణ చేసి ఆ స్థానంలో అబ్దుల్లా అలు-థానీ ప్రధాన మంత్రిగా నియమించబడ్డాడు.[105] 2014 మార్చి 25 న అస్థిరత్వం శిఖరాగ్రాఅనికి చేరుకున్న నేపథ్యంలో అలు-థానీ ప్రభుత్వం క్లుప్తంగా లిబియా రాచరికం పునరుద్ధరణ అవకాశాన్ని అన్వేషించింది.
2014 జూన్ లో జనరలు నేషనలు కాంగ్రెసు నుండి అధికారం తీసుకోవాలని ఉద్దేశించి కొత్త శాసనసభ్యుల డిప్యూటీసు కౌన్సిలు కొరకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు హింసాకాండ, తక్కువ ఓటింగుతో దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఓటింగు కేంద్రాలు మూసివేయబడ్డాయి.[106]
సెక్యులరిస్టులు లిబరల్సు ఎన్నికలలో జి.ఎన్.సి. లోని ఇస్లామిస్టు చట్టాలు రద్దయ్యాయి. జి.ఎన్.సి. కోసం ఒక నిరంతర ఆదేశాన్ని పునఃప్రారంభించి డిప్యూటీసు కొత్త కౌన్సిల్ను గుర్తించటానికి నిరాకరించారు.[107] జనరలు నేషనలు కాంగ్రెసు సాయుధ మద్దతుదారులు ట్రిపోలిని ఆక్రమించారు. నూతనంగా ఎన్నుకోబడిన పార్లమెంటు బలవంతంగా టొబ్రకుకు పంపబడ్డారు.[108][109]
2014 మధ్యకాలం నుండి పార్లమెంటుల ప్రత్యర్థి వివాదాలు కొనసాగాయి. అధికార శూన్యతను గిరిజన సైనికులు, జిహాదిస్టు సమూహాలు అవకాశంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రాడికలు ఇస్లామిస్టు యోధులు 2014 లో డెర్నాను స్వాధీనం చేసుకున్నారు. 2015 లో సిర్టేను ఇస్లామికు స్టేటు ఆఫ్ ఇరాకు అండు లెవంతు పేరుతో స్వాధీనం చేసుకున్నారు. 2015 ప్రారంభంలో పొరుగున ఉన్న ఈజిప్టు టోబ్రుకు ప్రభుత్వానికి మద్దతుగా ఐ.ఎసు.ఐ.ఎల్ కు వ్యతిరేకంగా వాయుమార్గ దాడులను ప్రారంభించింది.[110][111][112]
2015 జనవరిలో లిబియాలోని ప్రత్యర్థి పార్టీల మధ్య శాంతి ఒప్పందం కొరకు సమావేశాలు జరిగాయి. అంతర్గత సంఘర్షణ పరిష్కారం కొరకు జింసి, టొబ్రకు ప్రభుత్వాలను ఒకే పట్టికలో జెనీవా-ఘాడామీ చర్చలకు పిలిచారు. అయితే జి.ఎన్.సి. వాస్తవానికి ఎన్నడూ పాల్గొనలేదు. అంతర్జాతీయ విభజన "టొబ్రకు క్యాంపు" , " ట్రిపోలి కాంపు " లను ప్రభావితం చేసింది. ఇంతలో లిబియాలో ఉగ్రవాదం నిలకడగా అధికరించింది. ఇది పొరుగు దేశాలపై ప్రభావం చూపింది. రెండు లిబియన్-శిక్షణ పొందిన తీవ్రవాదులు 2015 మార్చి 18 న బార్డో మ్యూజియం మీద దాడి చేసారు.[113]
2015 లో స్పానిషు దౌత్యవేత్త బెర్నార్డినో లియోను (సెక్రటరీ జనరలు) ప్రతినిథ్యంలో నిర్వహించిన విస్తృత శ్రేణి దౌత్య సమావేశాలు, శాంతి చర్చలకు ఐఖ్యరాజ్యమితి మద్దతు ఇచ్చింది.[114][115][116] లిబ్యాలో ఐక్యరాజ్యసమితి మద్దతు మిషను కృషిచేసింది.[117]
2015 జూలైలో ఎస్ఆర్ఎస్జి లియోను ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిలు చర్చల పురోగతి గురించి నివేదించాడు. ఆ సమయంలో జూలై 11 న "ఒక సమగ్ర ప్రణాళిక ... మార్గదర్శక సూత్రాలు ... సంస్థలు, నిర్ణయాధికారం శాశ్వత రాజ్యాంగం రూపొందించే వరకు మధ్యంతర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయబడింది. " ఆ ప్రక్రియ లక్ష్యం "... ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించడానికి చట్టం రూపొందించడం, అధికారాలను విభజించడం, మానవ హక్కుల గౌరవం ఆధారంగా రూపొందించడంతో ముగుస్తుంది." ఎస్.ఆర్.ఎస్.జి. ఒప్పందం సాధించటానికి కృషిచేసిన వారిని ప్రశంసించింది "లిబియా ప్రజలు నిశ్శబ్దంగా శాంతి కావాలన్న కోరికను వ్యక్తం చేశారు." "లిబియా క్లిష్ట దశలో ఉంది" అని ఎస్.ఆర్.ఎస్.జి తెలియజేసింది. "చర్చల ప్రక్రియలో నిర్మాణాత్మకంగా నిమగ్నమం కావాలని లిబియాలో ఉన్న అన్ని పార్టీలనకు " విజ్ఞప్తి చేసింది, " చర్చలు రాజకీయ రాజీల ద్వారా మాత్రమే, వివాదం సాధించగలదు .. భవిష్యత్తు ప్రభుత్వం జాతీయ అకారర్డుకు మద్దతివ్వడం, సమన్వయ ప్రయత్నం ద్వారా మాత్రమే లిబియాలో శాంతిస్థాపన విజయవంతం అవుతుంది ... " అని వివరించింది. 2015 మధ్యకాలంలో వివిధ అంతర్జాతీయ ప్రదేశాలలో చర్చలు కొనసాగాయి. సెప్టెంబరు ప్రారంభంలో మొరాకోలో స్ఖిరాతులో చర్చలు ముగిసింది.[118][119]
అలాగే 2015 లో అంతర్జాతీయ సమాజం నుండి కొనసాగుతున్న మద్దతులో భాగంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లిబియన్ [120][121] మానవ హక్కుల హై కమిషనరు జైదు రాదు అలు హుస్సేను నుండి నివేదికను కోరింది. ఆయన మానవ హక్కులు, లిబియను న్యాయ వ్యవస్థను పునర్నిర్మాణం గురించి నివేదించడానికి పరిశోధక సంస్థను నియమించాడు.[122]
విషమపరిస్థులను ఎదుర్కొంటున్న లిబియా ఐరోపా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజల ప్రధాన రవాణా కేంద్రంగా ఉద్భవించింది. 2013 నుండి 7,00,000 కి పైగా వలసదారులు లిబియా నుండి పడవలో ఇటలీకి చేరుకున్నారు.[123][124]
2018 మే లో పారిసులో సమావేశమైన తరువాత లిబియా ప్రత్యర్థి నాయకులు పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలను నిర్వహించటానికి అంగీకరించారు.[125]
2019 ఏప్రెలులో ఖాలిఫా హైఫెరు, జాతీయ అకార్డు (జి.ఎన్.ఎ) ప్రభుత్వం నుండి పాశ్చాత్య భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు " లిబియన్ నేషనల్ ఆర్మీ దాడి " చేయబోతుందని ముందుగా ఊహింవి డిగ్నిటీ ఆఫ్ ఆపరేషను ఫ్లడును ప్రారంభించాడు.[126]
లిబియా వైశాల్యం 17,59,540 చ.కి.మీ (6,79,362 చదరపు మైళ్ళు). వైశాల్యపరంగా లిబియా ప్రపంచంలోని 16 వ పెద్ద దేశంగా ఉంది. లిబియా ఉత్తర సరిహద్దులో మధ్యధరా సముద్రం, పశ్చిమాన ట్యునీషియా - అల్జీరియా, నైరుతీ సరిహద్దులో నైగర్, దక్షిణసరిహద్దులో చాద్, ఆగ్నేయ సరిహద్దులో సుడాన్, తూర్పు సరిహద్దులో ఈజిప్టు ఉన్నాయి. లిబియా 19 ° నుండి 34 ° డిగ్రీల అక్షాంశం, 9 ° నుండి 26 ° డిగ్రీల రేఖాశం మద్య ఉంది.
లిబియాకు 1,770 కిలోమీటర్ల (1,100 మైళ్ళు) పొడవైన మధ్యధరా తీరప్రాంతం ఉంది. అత్యధిక సముద్రతీరం కలిగిన ఆఫ్రికా దేశంగా లిబియా గుర్తించబడుతుంది.[127][128] లిబియా ఉత్తరాన మధ్యధరా సముద్రం భాగం తరచుగా లిబియా సముద్రంగా పిలువబడుతుంది. వాతావరణం ఎక్కువగా చాలా పొడి, ఎడారిగా ఉంటుంది. ఉత్తర ప్రాంతాలు తక్కువస్థాయి మధ్యధరా వాతావరణాన్ని కలిగి ఉంటాయి.[129]
సహజమైన ప్రమాదాలు వేడి, పొడి, డస్టు లాడెను సిరోకో రూపంలో (లిబియాలో గిబ్లిగా పిలుస్తారు) ఉంటాయి. దక్షిణ గాలి అనిపిలువబడుతున్న ఈ పవనాలు వసంత, శరదృతువులలో ఒకటి నుండి నాలుగు రోజులు సంభవిస్తుంటాయి. దుమ్ము తుఫానులు, ఇసుక తుఫానులు కూడా సంభవిస్తుంటాయి. ఒయాసిసులు కూడా లిబియా అంతటా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి గడెమెసు, కుఫ్రా.[130] ఎడారి పర్యావరణం ఉనికిలో ఉన్న కారణంగా లిబియా ప్రపంచంలోని అత్యధిక సూర్యరశ్మి, పొడిగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది.
లిబియాలో విస్తరించివున్న లిబియా ఎడారి, భూమిపై అత్యంత శుష్క, సూర్యదహన (సన్ బేక్డు) ప్రదేశాలలో ఒకటి.[51]లిబియాలో దశాబ్దాలకాలం వర్షపాతం లేని కొన్ని ప్రాంతాలను చూడవచ్చు. పర్వతప్రాంతంలో అరుదుగా వర్షపాతం (ప్రతి 5-10 సంవత్సరాలకు ఒకసారి) జరుగుతుంది. ఉవీనతు వద్ద 2006 నాటికి 1998 సెప్టెంబరులో లో చివరి వర్షపాతం నమోదయింది.[131]
అలాగే, లిబియా ఎడారిలో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది; 1922 సెప్టెబరు 13 న ట్రిజిలికి నైరుతి దిశలో ఉన్న 'అజీజియా' నగరం ప్రపంచ రికార్డుగా 58 ° సెం (136.4 ° ఫా) గాలి ఉష్ణోగ్రత నమోదు చేసింది. [132][133][134] అయితే 2012 సెప్టెంబరులో ప్రపంచ రికార్డు ఫిగరు 58 ° సెం ప్రపంచ వాతావరణ సంస్థచే తొలగించబడింది.[133][134][135]
అక్కడ కొన్ని చెదురుమదురుగా ఉండే జనావాసరహిత చిన్న ఒయాసిసులు ఉన్నాయి. సాధారణంగా క్షీణతలకు అనుసంధానించబడి ఉన్నాయి. అక్కడ కొన్ని అడుగుల లోతు త్రవ్వించడం ద్వారా నీరు లభిస్తుంది. పశ్చిమాన విస్తారంగా చెదరుమదురుగా ఒయాసిసు సమూహాలు ఉన్నాయి. కుఫ్రా బృందంలో టజేర్బో, రిబీనియా, కుఫ్రా ఉన్నాయి.[131] స్క్రాప్లు కాకుండా, ఈజిప్టు-సుడానీస్-లిబియన్ సరిహద్దుల పరిసరాలలో లిబ్యాన్ ఎడారి కేంద్రం సమీపంలో ఉన్న పీటభూమి, మాసిఫులు వరుసక్రమం చదునైన మైదానాలకు అంతరాయం కలిగిస్తుంటాయి.
దక్షిణం వైపున ఆర్కెను, యునినాటు, కిసుల మాసిఫ్లు ఉన్నాయి. ఈ గ్రానైటు పర్వతాలు పురాతనమైనవి. వాటిని చుట్టుపక్కల ఉన్న ఇసుక రాళ్ళకంటే చాలాకాలం పూర్వం ఏర్పడ్డాయి. అర్కెను, పాశ్చిమ వియంటు ఎయిరు పర్వతాలలో ఉండే రింగు కాంప్లెక్సులు ఉన్నాయి. తూర్పు వియంటు (లిబియా ఎడారిలో ఎత్తైన ప్రదేశం) గ్రానైటు భాగం పక్కన పశ్చిమంగా పెరిగిన ఇసుకరాయి పీఠభూమి ఉంది.[131]
వియంటు ఉత్తరాన సాదా విస్పోటనం కలిగిన అగ్నిపర్వత లక్షణాలతో నిండి ఉంది. 1950 వ దశకంలో చమురును కనుగొన్న తరువాత లిబియాలో చాలా పెద్ద భూగర్భ జలం కనుగొనబడింది. ఈ జలాశయంలోని నీరు గత మంచు యుగం, సహారా ఎడారికంటే ముందు కాలం నాటిదని భావిస్తున్నారు.[136] ఇక్కడ అర్కెను నిర్మాణాలు ఉన్నాయి. ఇవి గతంలో అగ్నిపర్వత ముఖద్వారాలని భావించబడ్డాయి.[137]
లిబియా ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా చమురు రంగం నుండి లభించే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇది జీడీపీలో 50%, ఎగుమతులలో 97% ఉంటుంది. [138] లిబియా ఆఫ్రికాలో అతిపెద్ద నిరూపితమైన చమురు నిక్షేపాలను కలిగి ఉంది. గ్లోబలు సప్లై లైటు, స్వీటు క్రూడ్కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.[139] 2010 లో చమురు సగటు ధర బ్యారెలుకు $ 80 ఉన్నప్పుడు చమురు ఉత్పత్తి GDP లో 54% గా ఉంది.[140] పెట్రోలియం కాకుండా సహజ వాయువు, జిప్సం వంటి ఇతర సహజ వనరులు ఉన్నాయి.[141] అంతర్జాతీయ ద్రవ్య నిధి లిబియా నిజమైన జి.డి.పి. వృద్ధి 2011 లో 60%, 2012 లో 122% ఉండగా 2013 లో 60% పతనమై తరువాత 2013 లో 16.7% గా ఉందని అంచనా వేసింది.[138]
ప్రపంచ బ్యాంకు లిబియాను 'ఉన్నత మధ్యతరగతి ఆర్ధికవ్యవస్థగా' (7 ఇతర ఆఫ్రికా దేశాలతో) వర్గీకరిస్తుంది.[142] ఇంధన రంగానికి చెందిన కొంత ఆదాయం జనసంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఆఫ్రికాలో అత్యధిక తలసరి జి.డి.పి. కలిగిన దేశాలలో లిబియా ఒకటిగా ఉంది.[141] ఇది " లిబియా అరబు జమాహిరియా రాజ్యం " లో విస్తృతమైన సాంఘిక భద్రతను అందించింది. ప్రత్యేకంగా గృహ, విద్యా రంగాలలో. [143]
లిబియా సంస్థల కొరత, బలహీన పరిపాలన, దీర్ఘకాలిక చారిత్రాత్మక నిరుద్యోగం వంట్జీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. [144] ఆర్ధిక వైవిధ్యం కొరత, గణనీయంగా వలస కార్మికుల మీద ఆధారపడడం ఆర్ధికరంగాన్ని ప్రభావితం చేస్తుంది.[145] లిబియా సాంప్రదాయకంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం మీద ఆధారపడింది. [146] 2000 మధ్యకాలంలో మొత్తం జాతీయ ఉద్యోగులలో 70% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.[145]
2008 లో తాజా జనాభా లెక్కల ఆధారంగా నిరుద్యోగం 8% నుండి 21% కి అధికరించింది.[147] 2010 నుండి డేటా ఆధారంగా ఒక అరబు లీగు నివేదిక మహిళలలో నిరుద్యోగం 18% ఉంది, పురుషులలో 21% గా ఉందని తెలియజేస్తుంది. లిబియా మహిళల కంటే పురుషులలో నిరుద్యోగులు అధికంగా ఉన్న ఏకైక అరబు దేశంగా ఉంది.[148] లిబియాలో అత్యధిక స్థాయిలో సామాజిక అసమానత, అధికంగా యువత నిరుద్యోగం, అధిక శాతం ప్రాంతీయ ఆర్ధిక అసమానతలు ఉన్నాయి.[146] నీటి సరఫరా కూడా సమస్యగా ఉంది. 2000 లో జనాభాలో 28% మంది సురక్షితమైన త్రాగునీటిని పొందలేకపోయారు.[149]
లిబియా తృణధాన్య అవసరాలలో 90% దిగుమతి చేసుకుంటుంది. 2012-13 లో గోధుమ దిగుమతులు సుమారు 1 మిలియను టన్నులు ఉన్నట్లు అంచనా వేయబడింది. [150] 2012 గోధుమ ఉత్పత్తి 200,000 టన్నుల వద్ద అంచనా వేయబడింది. [150] 2020 నాటికి 8,00,000 టన్నుల తృణధాన్యాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.[150] అయినప్పటికీ సహజ, పర్యావరణ పరిస్థితులు లిబియా వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.[150] 1958 కి ముందు వ్యవసాయం దేశం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. జి.డి.పి లో సుమారు 30% ఉంది. 1958 లో చమురును కనుగొన్న తరువాత వ్యవసాయ రంగం పరిమాణం వేగంగా తగ్గింది. 2005 నాటికి 5% జి.డి.పి కంటే తక్కువగా ఉంటుంది.[151]
1962 లో ఒ.పి.ఇ.ఎస్ లో చేరింది.[141] లిబియా " ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యదేశం కానప్పటికీ 2004 లో లిబియా ప్రవేశపెట్టిన చర్చలు ప్రారంభమయ్యాయి.[152]1980 ల ప్రారంభంలో లిబియా ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటి; తలసరి జి.డి.పి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువగా ఉంది.[153]
2000 ల ఆరంభంలో జమాహిరియా శకంలో అధికారులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లిబియాను పునఃప్రారంభించడానికి ఆర్థిక సంస్కరణలను చేపట్టారు.[155] 2003 సెప్టెంబరులో ఐఖ్యరాజ్యసమితి ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి. 2003 డిసెంబరులో సామూహిక వినాశనకర ఆయుధాలను నిర్మించే కార్యక్రమాలు వదలివేయబడుతుందని లిబియా ప్రకటించింది.[156] లిబియా వరల్డు ట్రేడు ఆర్గనైజేషను సభ్యత్వానికి దరఖాస్తు చేసింది. రాయితీలను తగ్గించాయి, ప్రైవేటీకరణకు ప్రణాళికలు ప్రకటించాయి.[157]
2003 లో చమురు శుద్ధి, పర్యాటకం, రియలు ఎస్టేట్లతో కలిపి పరిశ్రమలలో 100 కంటే అధికంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 100% విదేశీ యాజమాన్యం కలిగిన సంస్థలు 29 ఉన్నాయి.[158] అనేక అంతర్జాతీయ చమురు కంపెనీలు దేశంలోకి వచ్చాయి. వీటిలో చమురు కంపెనీలు షెలు, ఎక్సాన్మొబిలు ఉన్నాయి.[159] ఆంక్షలు ఎత్తివేయడంతో ఎయిరు ట్రాఫికు క్రమంగా అధికరించింది. 2005 నాటికి 1.5 మిలియన్ల వార్షిక విమాన ప్రయాణికులు పయనించారు.[160] కఠినమైన వీసా నిబంధనలు కారణంగా పశ్చిమదేశాల పర్యాటకులు సందర్శించడానికి లిబియా దీర్ఘకాలంగా ఒక కష్టతరమైన దేశంగా ఉంది.[161]
2007 లో ముమామరు గడ్డాఫీ రెండవ కుమారుడు సైమఫు అలు-ఇస్లాం గడ్డాఫీ సైరెనెకు పర్యాటకాన్ని తీసుకొచ్చేందుకు, ఈ ప్రాంతంలో గ్రీకు శిధిలాలను సంరక్షించడానికి " గ్రీను డెవెలెప్మెంటు " కార్యక్రమంలో పాల్గొన్నాడు.[162]
2011 ఆగస్టులో లిబియా మౌలికనిర్మాణ వ్యవస్థను పునర్నిర్మించటానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది అని అంచనా వేశారు. ఎన్.టి.సి. గడాఫీ పరిపాలన "పూర్తిగా నిర్లక్ష్యం" కారణంగా 2011 యుద్ధానికి ముందు లిబియా మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్నాయని పేర్కొన్నది.[163] 2012 అక్టోబరు నాటికి 2011 ఆర్థిక స్థితి నుండి స్వస్థత పొందింది. చమురు ఉత్పత్తి తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంది.[138] యుద్ధానికి ముందు చమురు ఉత్పత్తి రోజుకు 1.6 మిలియను బారెల్సు కంటే అధికంగా ఉంది. 2012 అక్టోబరు నాటికి సగటు చమురు ఉత్పత్తి 1.4 మిలియను బిపిడీని అధిగమించింది. [138] టోటలు, ఎని, రెప్సోలు, వింటెర్షలు, ఓక్సిడెంటలు వంటి ప్రధాన పాశ్చాత్య కంపెనీలు త్వరగా తిరిగి రావడంతో ఉత్పత్తి పునఃప్రారంభం సాధ్యపడింది.[138] 2016 లో సంస్థ నుండి ఒక ప్రకటన తరువాత సంవత్సరంలో రోజుకు 9,00,000 బ్యారెలు లక్ష్యంగా పెట్టుకుంది. చమురు ఉత్పత్తి నాలుగు సంవత్సరాల యుద్ధంలో రోజుకు 1.6 మిలియన్ల బ్యారెలు నుండి 900,000 కు పడిపోయింది.[164]
లిబియా చిన్న జనాభా ఉన్న ఒక పెద్ద దేశంగా గుర్తించబడింది. తీరప్రాంతాల వెంట జనాభా చాలా అధికంగా కేంద్రీకృతమై ఉంది. [165] ఉత్తర ప్రాంతాలలో ట్రిపోలిటానియా, సెరెనకా ప్రాంతాలలో జనసాంధ్రత చ.కి.మీ 50 మంది. మిగిలిన ప్రాంతాలలో జనసాంధ్రత చ.కి.మీ 1 వ్యక్తి మాత్రమే ఉంటారు. 10% కంటే తక్కువ భూభాగంలో 90% మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధానంగా తీరం వెంట ఉన్నారు. 88% ప్రజలు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరు అధికంగా మూడు అతిపెద్ద నగరాలు: ట్రిపోలి, బెంఘజి, మిస్రటాలలో కేంద్రీకృతమై ఉన్నారు. లిబియాలో సుమారు 6.3 మిలియన్ల జనాభా ఉంది.[166]వీరిలో 15 ఏళ్ళలోపు 27.7% మంది ఉన్నారు. [155] 1964 లో 1.54 మిలియన్ల ప్రజలు ఉండగా 1984 లో జనాభా 3.6 మిలియన్లుకు చేరుకుంది.[167]
లిబియా జనాభాలో అధికభాగం ప్రస్తుతం అరబు, అనగా అరబిక్-మాట్లాడే, అరబు-సంస్కృతికి చెందిన ప్రజలు ఉన్నట్లు గుర్తించబడింది. అయినప్పటికీ డి.ఎన్.ఎ. అధ్యయనాల ఆధారంగా అరబ్ లిబియా ప్రజలు 90% అరబు బెర్బెర్లు ఉన్నారని భావిస్తున్నారు.[168] అయితే బెర్బెరు లిబియన్లు, బెర్బెరు భాష, బెర్బెరు సంస్కృతిని నిలబెట్టే ప్రజలు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. లిబియాలో 140 తెగలు, వంశాలు ఉన్నాయి.[169]
లిబియా ప్రజలకు కుటుంబ జీవితం ముఖ్యం. వీరిలో అధికభాగం వారి ఆదాయం, సంపద ఆధారంగా అపార్ట్మెంటు బ్లాక్సు, ఇతర స్వతంత్ర గృహ యూనిట్లలో నివసిస్తుంటారు. అరబు లిబియన్లు సాంప్రదాయకంగా గుడారాలలో నివసించే సంచార జీవనశైలి ఉన్నప్పటికీ వారు ప్రస్తుతం వివిధ పట్టణాలు, నగరాలలో స్థిరపడ్డారు.[170] దీని కారణంగా వారి పాత మార్గాలు క్రమంగా క్షీణించాయి. శతాబ్దాలుగా వారి కుటుంబాలు నివసించిన జీవన శైలిలో ఎడారిలో నివసిస్తున్న లిబియన్లు స్వల్పసంఖ్యలో కనిపిస్తుంటారు. జనాభాలో చాలామంది పరిశ్రమలు, సేవలలో వృత్తులను కలిగి ఉన్నారు. స్వల్ప శాతం ప్రజలు వ్యవసాయం ఉపాధిగా జీవిస్తున్నారు.
యు.ఎన్.హె.సి.ఆర్. ఆధారంగా 2013 జనవరిలో లిబియాలో 8,000 నమోదైన శరణార్థులు, 5,500 మంది నమోదుకాని శరణార్థులు, 7,000 మంది శరణు కోరేవారు ఉన్నారని అంచనా. అంతేకాకుండా 47,000 మంది లిబియా దేశస్థులు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. 46,570 మంది అంతర్గత స్థానికులు తిరిగి వచ్చారు.[171]
లిబియా ఆదిమ నివాసితులు ప్రధానంగా వివిధ బెర్బెరు జాతి సమూహాలకు చెందినవారు; అయినప్పటికీ దీర్ఘకాలం విదేశీ దండయాత్రలు - ప్రత్యేకించి అరబ్బులు, టర్కులు లిబియా ప్రజల మీద తీవ్ర శాశ్వతమైన భాషా, సాంస్కృతిక, గుర్తింపు ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం లిబియా నివాసితులలో చాలామంది మిసిసిదు సంతతికి చెందిన అరబికు మాట్లాడే ముస్లింలు, వీరిలో అనేకమంది తమ పూర్వీకులని బాను సులైం తెగకు చెందినవారని భావిస్తున్నారు. అలాగే టర్కీ బెర్బెరు జాతులకి చెందిన వారు తరువాత స్థానంలో ఉన్నారు. టర్కిషు అల్పసంఖ్యాక ప్రజలను తరచుగా "కొలోఫ్లిసు" అని అంటారు. వీరు అధికంగా గ్రామాలు, పట్టణాల కేంద్రీకృతమై ఉన్నారు.[172]అంతేకాకుండా కొన్ని లిబియా జాతి అల్పసంఖ్యాకులలో బెర్బెరు, టువరెగు, టెబో వంటి తెగలు ఉన్నాయి.[173]
1947 లో ఇటలీ లిబియా స్వాతంత్ర్యం తరువాత దాదాపుగా మిలియన్ల మందికంటే అధికంగా ఇటాలియన్ సెటిలర్లు (దాదాపు 5 లక్షల మంది) దేశం విడిచి వెళ్ళారు. 1970 లో ముయామ్మరు గడాఫీ మరణం తరువాత ఎక్కువమంది తిరిగి వచ్చినప్పటికీ కొన్ని వందల మంది 2000 లలో తిరిగి వచ్చారు.[174]
2013 నాటికి ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం లిబియా జనాభాలో 12% (7,40,000 మందికి పైగా) విదేశీ వలసదారులు ఉన్నారని అంచనా.[9] 2011 నాటి విప్లవానికి ముందు అధికారిక, అనధికారిక గణాంకాలు వలస కార్మికుల శాతం 25% నుండి 40% వరకు (1.5 - 2.4 మిలియన్ల మధ్య) ఉంటుందని అంచనా. చారిత్రాత్మకంగా లక్షలాది తక్కువ, ఉన్నత-నైపుణ్యం గల ఈజిప్షియను వలసదారులకు ముఖ్యంగా లిబియా ఆశ్రయంగా ఉంది.[175]
జనాభా గణనలలో అధికారిక గణనలు, అనధికారిక అంచనాల మధ్య తేడాలు ఉన్నందున లిబియాలోని వలసదారుల సంఖ్యను ఖచ్ఛితంగా అంచనా వేయటం కష్టం. 2006 జనాభా లెక్కలలో 3,59,540 విదేశీ పౌరులు (లిబియా మొత్త పౌరులు 5.5 మిలియన్లు. మొత్తం జనాభాలో 6.35%). వీరిలో దాదాపు సగం ఈజిప్షియన్లు, తరువాత సూడానీ, పాలస్తీనా వలసదారులు ఉన్నారు.[176] 2011 విప్లవం సందర్భంగా 7,68,362 మంది వలసదారులు లిబియాను వదిలి వెళ్ళారని ఐఒఎం గణించింది. ఆ సమయంలో జనాభాలో 13% మంది ఉన్నారు. అయినప్పటికీ చాలా మంది దేశంలో ఉన్నారు.[176] [177]
విప్లవానికి ముందు రికార్డులు వలస జనాభాను అంచనా వేయడానికి ఉపయోగిస్తున్నట్లయితే 2009 లో ట్రిపోలీలోని ఈజిప్టు రాయబార కార్యాలయం ద్వారా 2 మిలియన్ల మంది ఈజిప్షియన్ వలసదారులు నమోదు చేయబడ్డారు. తరువాత వారు 87,200 మంది ట్యునీషియస్లు, 68,200 మంది మొరాకోన్లు తమ తమ రాయబార కార్యాలయాలచే నమోదు చేయబడ్డారు. విప్లవానికి ముందు ఆసియా వలసదారులు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు (60,000 మంది బంగ్లాదేశ్లు, 18,000 మంది భారతీయులు, 10,000 పాకిస్థానీలు, 8000 ఫిలిపినోలు, అలాగే చైనీస్, కొరియన్, వియత్నమీస్, థాయ్, ఇతర కార్మికులు).[178] ఇది విప్లవానికి ముందు దాదాపుగా 40% మంది వలస జనాభాను అంచనా వేసింది. 2004 లో సాధారణ అంచనాలు, సక్రమంగా లేని వలస సంఖ్యలు 1.35 - 1.8 మిలియన్లకు (సమయంలో జనాభాలో 25%-33%) ఉంచింది.[176]
అరబు-బెర్బెర్ల లిబియా స్థానిక జనాభా అలాగే వివిధ దేశాలకు చెందిన అరబు వలసదారులు సామూహికంగా 97% మంది ఉన్నారు. మిగిలిన 3% నివాసితులు ఎక్కువగా బంగ్లాదేశ్లు, గ్రీకులు, భారతీయులు, ఇటాలియన్లు, మాల్టీస్, టర్కులు, ఉక్రైనియన్లు అలాగే ఇతర జాతీయులు ఉన్నారు. [179]
సి.ఐ.ఎ. ఆధారంగా లిబియా అధికారిక భాష అరబికు.[179] ఆధునిక ప్రామాణిక అరబికుతో పాటుగా స్థానిక లిబియా అరబికు భాష వాడుకలో ఉంది. తామషెఖ్, ఘదామిసు, నఫస్సి, సుక్నా, అవ్జిలాలతో సహా వివిధ బెర్బెరు భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.[179] లిబియా అమాజిఘు హై కౌన్సిలు (ఎల్.ఎ.హెచ్.సి) లిబియాలోని బెర్బెర్లు నివసించే నగరాలలో, జిల్లాలలో అజీఘు (బెర్బెరు లేదా తమాజీగ్టు) భాషను అధికారిక భాషగా ప్రకటించింది.[180]. అంతేకాక ఇటాలియను, ఆంగ్ల భాషలు ప్రధాన నగరాలలో చక్కగా అర్థం చేసుకోబడ్డాయి. ఇవి గతంలో వ్యాపారంలో, మిగిలిన ఇటాలియన్ జనాభాలో వాడుకలో ఉన్నాయి.[179]
లిబియాలో 97% మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సున్నీ శాఖకు చెందినవారు ఉన్నారు.[155][181] ఇబాడి ముస్లింలు, అహ్మదీయులు కూడా దేశంలో నివసిస్తున్నారు.[182][183]
1930 లకు ముందు లిబియాలో ప్రాధమిక ఇస్లామికు ఉద్యమంగా సున్సీ, సుఫీ ఉద్యమం మొదలైంది. ఎడారికి జీవితంలో భాగంగా మతపర వ్యతిరేకతలు స్వీకరించబడ్డాయి. ఇది జావాయా (లాడ్జెస్) ట్రిపోలిటోనియా, ఫెజ్జన్లలో కనుగొనబడింది. అయితే సెరెనెకాలో సేనుసి ప్రభావం బలంగా ఉంది. అశాంతి, అరాచకత్వం నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడటంలో సెనుసి ఉద్యమం సిరెనికా గిరిజన ప్రజలను మతపరమైన అనుబంధం, ఐక్యత వంటి ప్రయోజనాలు ఇచ్చింది.[184]చివరికి రెండు ఇటాలియన్ ముట్టడి, తరువాత గడ్డాఫీ ప్రభుత్వం నాశనం ఈ ఇస్లామిక్ ఉద్యమాన్ని చెదరగొట్టింది.[184]ప్రస్తుత లిబియాలో చాలా సంప్రదాయవాదం ఇస్లాం మతం నుండి కొంతవరకు భిన్నంగా ఉండేది. గడాఫీ విశ్వాసపాత్రులైన ముస్లింలు, ఆయన ప్రభుత్వం ఇస్లాం మతం తరపున, ఇస్లాం సంస్థలకు మద్దతుగా, ప్రపంచవ్యాప్తంగా మత ప్రచారం చేయడంలో ఒక పాత్ర పోషించింది. [185]
గడ్డాఫీ పతనం అయినప్పటి నుండి, ఇస్లాం అల్ట్రా-సాంప్రదాయిక జాతులు, కొన్ని ప్రదేశాలలో తమ పనులను పునరుద్ధరించాయి. తూర్పు లిబియాలో ఉన్న డెర్నా, చారిత్రాత్మకంగా జిహాదిస్టు ఆలోచనల ప్రాతిపదికగా ఉంది. " ఇస్లామికు స్టేటాఫ్ ఇరాకు అండు ది లెవెంతు " 2014 లో సమైక్యంగా తీవ్రవాదుల నియంత్రణలోకి వచ్చింది.[186] రెండవ లిబియా అంతర్యుద్ధం ఫలితంగా జిహాదిస్టు అంశాలు సిర్టే, బెంఘజి, ఇతర ప్రాంతాలలో విస్తరించారు.[187][188]
క్రైస్తవుల చిన్న విదేశీ సమాజాలు ఉన్నాయి. ఈజిప్టు క్రైస్తవ చర్చి " కాప్టికు ఆర్థోడాక్సు క్రైస్తవ మతం" లిబియాలో అతిపెద్ద, అత్యంత చారిత్రక క్రైస్తవ వర్గంగా ఉంది. లిబియాలో సుమారు 60,000 ఈజిప్షియన్ కాప్టులు ఉన్నారు.[189] లిబియాలో కోట్సు ఈజిప్షియన్. లిబియాలో మూడు కోప్టికు చర్చిలు ఉన్నాయి. ఒకటి ట్రిపోలిలో ఒకటి, బెంఘజిలో ఒకటి, మిజూరాటాలో ఒకటి ఉన్నాయి.
లిబియాకు ఈజిప్షియన్ కాప్టుల పెరుగుతున్న ఇమ్మిగ్రేషను కారణంగా లిబియాలో ఇటీవలి సంవత్సరాలలో కోప్టికు చర్చీలు అధికరించాయి. 40,000 రోమన్ కాథలిక్కులకు ఇద్దరు బిషప్పులు సేవలు అందిస్తూ ఉన్నారు. ట్రిపోలి ఒకరు (ఇటాలియన్ కమ్యూనిటీ అందిస్తున్న), బెంఘజి ఒకరు (మాల్టీస్ కమ్యూనిటీ అందిస్తున్న)ఉన్నారు. ఒక చిన్న ఆంగ్లికను కమ్యూనిటీ కూడా ఉంది. వీరిలో ఎక్కువగా ట్రిపోలిలో ఆఫ్రికా వలస కార్మికులు ఉన్నారు; ఇది ఈజిప్టు ఆంగ్లికన్ డియోసెసులో భాగంగా ఉంది. క్రైస్తవ మిషనరీలుగా ఉన్నట్లు అనుమానంతో ప్రజలు ఖైదు చేయబడ్డారు. ఎందుకంటే మతప్రచారం చట్టవిరుద్ధం.[190] క్రైస్తవులు కూడా రాడికలు ఇస్లామిస్టుల నుండి హింసను ఎదుర్కొన్నారు. 2015 ఫిబ్రవరిలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇరాకు ఇస్లామికు స్టేటు అండు లెవంతు విడుదల చేసిన వీడియోలో క్రిస్టియన్ కాప్టుల తలలను కత్తిరిస్తున్న దేశాలు చోటుచేసుకున్నాయి.[191][192]
లిబియా ప్రపంచంలోని పురాతన యూదు సమూహాల్లో ఒకటిగా ఉంది. సామన్య శకం 300 నాటికే లిబియాలో యూదు ప్రజలు ఉన్నారు. [193] 1942 లో దక్షిణ ట్రిపోలీలో ఇటాలియన్ ఫాసిస్టు అధికారులు ఏర్పరిన నిర్బంధిత కార్మిక శిబిరాలలో యూదులు గైడో (3,000 యూదులు), ఘర్యను, జెరన్, తిగ్రిన్న తెగలకు చెందిన యూదులు ఉన్నారు. గియోడోలో 500 మంది యూదులు బలహీనత, ఆకలి, వ్యాధులతో మరణించారు. 1942 లో నిర్బంధ శిబిరాలలో లేని యూదులు తమ ఆర్ధిక కార్యకలాపాలు తీవ్రంగా పరిమితం చేయబడ్డాయి. 18 నుండి 45 సంత్సరాల యూదులు బలవంతంగా నిర్బంధ కార్మికులుగా మార్చబడ్డారు. 1942 ఆగస్టులో ట్రిపొలిటానియాకు చెందిన యూదులు సిది అజాజ్లోని నిర్బంధ శిబిరంలో ఖైదు చేయబడ్డారు. 1945 నవంబరు తరువాత మూడు సంవత్సరాలలో 140 కంటే ఎక్కువ యూదులు హత్య చేయబడ్డారు. అనేక వరుస హత్యలు జరిగాయి.[194] 1948 నాటికి 38,000 మంది యూదులు దేశంలోనే ఉన్నారు. 1951 లో లిబియా స్వాతంత్ర్యం తరువాత ఎక్కువమంది యూదు సమాజం వలస వచ్చింది.
అనేక అరబికు మాట్లాడే లిబియన్లు తమను తాము విస్తారమైన అరబు సమాజంలో భాగంగా భావిస్తారు. 20 వ శతాబ్దం మధ్యకాలంలో పాను-అరబిజం వ్యాప్తి ద్వారా ఇది బలోపేతం అయింది. అరేబియన్లు లిబియాలో అధికారంలోకి రావడంతో వారు ఏకైక అధికారిక భాషగా అరబికకును స్థాపించారు. వారి నియంతృత్వంలో బోధన, దేశీయ టొమాజిటు భాషను ఉపయోగించడం కూడా నిషేధించబడింది.[195] ఇంతకుముందు విద్యాసంబంధ సంస్థలలో బోధించిన విదేశీ భాషలను నిషేధించడంతో లిబియన్ల మొత్తం తరాల ప్రజల ఆంగ్ల భాష అవగాహన పరిమితమైంది. అరబికు మాండలికాలు, తమాజిక్టు రెండింటిలో ఇప్పటికీ ఇటలీ పదాలు వాడుకలో ఉన్నాయి. ఇవి లిబియా ఇటాలియా కాలంలో అంతకంటే ముందుగా లిబియాలో ప్రవేశించాయి.
లిబియన్లు గతంలో సంచలనాత్మక నోమాడికు బెడౌయిను, అమాజిఘు గిరిజనుల అరబికు భాషా సంప్రదాయ వారసత్వం కలిగి ఉన్నారు. చాలా మంది లిబియన్లు గిరిజనులు, ఒట్టోమను పూర్వీకుల వారసత్వం కలిగిన ప్రత్యేకమైన కుటుంబం పేరుతో తమను తాము అనుబంధం చేసుకుంటున్నారు.[ఆధారం చూపాలి].
2013 లో అధ్యయనాలు లిబియా ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనే అలవాటు ప్రపంచంలో మొదటి 20 స్థానాలకు చేరుకుందని తెలియజేస్తున్నాయి. "ఇవ్వడం స్వభావం" (అరబీ: الاحسان Ihsan, Tamazight: ⴰⵏⴰⴽⴽⴰⴼ Anakkaf), ప్రతిబింబిస్తుంది. [196] సి.ఎ.ఎఫ్ ఆధారంగా ఒక సాధారణ నెలలో లిబియన్లలో దాదాపు మూడు వంతుల (72%) ప్రజలు వారికి పూర్తిగా తెలియని వారికి అత్యధిక స్థాయిలో సహాయం అదించారు. - మొత్తం 135 దేశాల సర్వేలో లిబియా 3 వ స్థానంలో ఉంది.
గడాఫీ పాలనలో సాంస్కృతిక అణచివేత, నియంతృత్వ పాలనలో మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోవడం వలన కొన్ని మాత్రమే థియేటర్లు లేదా ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి.[197] అనేక సంవత్సరాలుగా పబ్లిక్ థియేటర్లు లేవు. విదేశీ సినిమాలను చూపించే చాలా కొద్ది సినిమా థియేటర్లు మాత్రమే ఉన్నాయి. జానపద సంస్కృతి సాంప్రదాయం ఇప్పటికీ జీవించి ఉంది. లిబియా, విదేశాలలో తరచూ ఉత్సవాలలో సంగీతం, నృత్య ప్రదర్శనలను బృందాలుగా నిర్వహిస్తారు.[198]
లిబ్యాను టెలివిజను స్టేషన్లు పెద్ద సంఖ్యలో రాజకీయ సమీక్ష, ఇస్లామికు విషయాలు, సాంస్కృతిక దృగ్విషయానికి అంకితమై ఉంటాయి. పలు టీవీ స్టేషన్లు సాంప్రదాయిక లిబియను సంగీతంలోని వివిధ శైలులను ప్రసారం చేస్తాయి.[? విడమరచి రాయాలి]గడామీలలో, దక్షిణప్రాంతాలలో టువరెగు సంగీతం, నృత్యం ప్రాబల్యత సంతరించుకున్నాయి. దక్షిణాన ప్రసిద్ధి చెందాయి. లిబియన్ టెలివిజన్ ఎక్కువగా అరబికు కార్యక్రమాలను అరబికులో ప్రసారం చేస్తుంది. అయితే సాధారణంగా ఇంగ్లీషు, ఫ్రెంచి కార్యక్రమాలకు సమయం కేటాయిస్తుంది. లిబియా నియంతృత్వపాలనలో అరబ్ ప్రపంచం మాధ్యమాన్ని అత్యంత కఠినంగా నియంత్రించింది.[199] 2012 నాటికి వందల సంఖ్యలో టివి స్టేషన్లు పాత పాలన సెన్సార్షిపు పతనం కావడంతో "మాధ్యం స్వాతంత్రం " ప్రారంభం అయింది.
చాలామంది లిబియన్లు తరచూ సముద్రతీరాలకు పోతుంటార్. వారు లిబియా పురావస్తు ప్రదేశాలు, ముఖ్యంగా లెప్టిసు మాగ్నాను సందర్శిస్తారు. ఇది ప్రపంచంలోని సంరక్షించబడిన ఉత్తమ రోమను పురావస్తు ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[200] చాలామంది ప్రజలు ఆటోమొబైలు ద్వారా ప్రయాణం చేస్తున్నప్పటికీ నగరాల మధ్య ప్రజా సాధారణంగా బస్సులలో ప్రయాణిస్తుంటారు.[201] లిబియాలో రైల్వే సేవలు లేవు. వీటిని సమీప భవిష్యత్తులో నిర్మాణం కొరకు ప్రణాళిక చేస్తున్నారు (లిబియాలో రైలు రవాణా చూడండి). [201]
లిబియా రాజధాని ట్రిపోలిలో అనేక సంగ్రహాలయాలు, సంరక్షణాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ లైబ్రరీ, ఎథ్నోగ్రఫికు మ్యూజియం, ఆర్కియలాజికలు మ్యూజియం, నేషనలు ఆర్కైవ్సు, ది ఎపిగ్రఫీ మ్యూజియం, ఇస్లామికు మ్యూజియం ఉన్నాయి. రెడ్ కాజిలు మ్యూజియం తీరానికి దగ్గరలో, నగర కేంద్రంలో ఉన్నది. ఇది యునెస్కో సంప్రదింపులతో నిర్మించబడింది. దేశం అత్యంత ప్రసిద్ధమైనదిగా భావించబడుతుంది.[202]
లిబియా వంటకం వివిధ ఇటాలియన్, బెడౌయిను, సాంప్రదాయ అరబు పాక ప్రభావాల మిశ్రమం.[203] లిబియా పాశ్చాత్య భాగంలో పాస్తా ప్రధానమైన ఆహారంగా ఉంటుంది. అయితే తూర్పులో అన్నం ప్రధానమైన ఆహారంగా ఉంటుంది.
సాధారణ లిబియా ఆహారాలు ఎరుపు (టమాటో) సాస్ ఆధారిత పాస్తా వంటకాలు (ఇటాలియన్ సుగో అర్రాబియాటా డిష్ మాదిరిగానే) అనేక వైవిధ్యాలు; బియ్యం, సాధారణంగా గొర్రె లేదా కోడి మాసం (సాధారణంగా వేయించిన లేదా ఉడికించిన సాస్); కొబ్బరి ముక్కలు, పాలకూర, ఆలివులతో పాటుగా వడ్డించే ఎరుపు (టమోటా) సాస్, మాంసం (కొన్నిసార్లు కోర్జెట్టెస్ / జుసిచిని, కోడి మాంసపు ముక్కలను కలిగి ఉంటుంది) ఆవిరిని వండుతారు. వీటిని దీసకాయముక్కలు, లెట్యూసులతో వడ్డిస్తారు.
బాజీను బార్లీ పిండితో తయారు చేసిన డిష్ దీనిని ఎర్రటి టొమాటో సాస్తో వడ్డిస్తారు. సాధారణముగా చేతితో తింటారు. అనేకమంది ఒకే డిష్ను సాధారణంగా చేతితో పంచుకుంటారు. ఈ వంటకం సాధారణంగా సాంప్రదాయ వివాహాల్లో లేదా ఉత్సవాలలో వడ్డించబడుతుంది. ఆసిడా బాజీను తీపి ఆహారం, ఇది తెలుపు పిండితో తయారు చేయబడింది. ఇది తేనె, నెయ్యి లేదా వెన్న మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఆసిడాకు మరో ఇష్టమైన మార్గం రబ్ (తాజా ఖర్జూర సిరప్) ఆలివ్ నూనెతో వడ్డించబడుతుంది. అస్బాను అనేది జంతువుల ట్రిపు. టమోటో ఆధారిత సూపులో వండిన లేదా ఉడికించిన వరి, కూరగాయలతో నింపబడి ఉంటుంది. షుర్బా అనేది ఎరుపు టమోటా సాస్-ఆధారిత సూప్, సాధారణంగా పాస్తా చేర్చి తింటారు. [203]
లిబియన్లు తినే ఒక సాధారణ చిరుతిండిని " ఖుబ్సు బి టన్ " అని పిలుస్తారు. సాహిత్యపరంగా అర్థం "టునా చేప తో రొట్టె", సాధారణంగా ఒక కాల్చిన బక్వట్టె లేదా పిటా రొట్టెగా చేస్తారు. హరిస్సా (మిరప సాస్), ఆలివ్ నూనె కలిపి ట్యూనా చేప నింపబడి ఉంటుంది. అనేక విక్రేతలు ఈ శాండ్విచ్లను తయారుచేస్తారు. వారిని లిబియా అంతటా చూడవచ్చు. లిబియా రెస్టారెంట్లు అంతర్జాతీయ వంటకాన్ని అందిస్తాయి లేదా గొర్రె, చికెను, కూరగాయల వంటకం, బంగాళాదుంపలు, మాకరోని వంటి ఆహారాలను అందుబాటు ధరలో అందిస్తాయి.[203] మౌలిక సదుపాయాల కారణంగా తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలు, చిన్న పట్టణాలకు రెస్టారెంట్లు లేవు. బదులుగా ఆహార ఉత్పత్తులను పొందడానికి దుకాణాలు వనరులు మాత్రమే ఉన్నాయి.[203] ఆల్కహాల్ వినియోగం మొత్తం దేశంలో చట్టవిరుద్ధం.[204]
సంప్రదాయ లిబియా ఆహారంలో నాలుగు ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి: ఆలీవ్లు (ఆలివు నూనె), ఖర్జూరాలు, ధాన్యాలు, పాలు.[205] వేయించిన ధాన్యాలను తిరగలిలో విసిరి జల్లించి రొట్టె, కేకులు, జావ, బజీను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఖర్జూరాలు పండించడం, ఎండబెట్టి, తినేవి, సిరప్ లేదా కొంచెం వేయించి, బిసిసా, పాలుతో తింటారు. తిన్న తరువాత లిబియన్లు తరచూ బ్లాక్ టీని త్రాగుతారు. ఇది సాధారణంగా రెండవ సారి (రెండవ గ్లాసు టీ కోసం) పునరావృతమవుతుంది. మూడవ రౌండు టీతో వేయించిన వేరుశెనగలు, వేయించిన బాదంపప్పు (షై బి-ఉల్-లజ్)గా పిలుస్తారు (గ్లాసు టీతో కలిపి )తింటారు. [205]
లిబియా జనాభాలో 1.7 మిలియను విద్యార్థులు ఉన్నారు. వీరు 2,70,000 మంది విద్యార్ధులు తృతీయ స్థాయి అధ్యయనం చేస్తారు.[206] లిబియాలో ప్రాథమిక విద్య అన్ని పౌరులకు ఉచితం.[207]ద్వితీయ స్థాయి వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది. 2010 లో వయోజన అక్షరాస్యత రేటు 89.2%.[208]
1951 లో లిబియాకు స్వాతంత్ర్యం లభించిన తరువాత రాజ శాసనం ద్వారా బెంఘజిలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం - యూనివర్శిటీ ఆఫ్ లిబియా - స్థాపించబడింది.[209] 1975-76 విద్యాసంవత్సరంలో విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఖ్య 13,418 గా అంచనా వేయబడింది. 2004 నాటికి ఈ సంఖ్య 200,000 కంటే అధికంగా అభివృద్ధి చెందింది. ఉన్నత సాంకేతిక వృత్తి రంగంలో 70,000 మంది ప్రవేశించారు.[206] ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధుల సంఖ్య అధికరించిన కారణంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య అధికరించింది.
1975 నుండి విశ్వవిద్యాలయాల సంఖ్య రెండు నుండి తొమ్మిది వరకు అధికరించింది. 1980 లో తర్వాత ఉన్నత సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల సంఖ్య ప్రస్తుతం 84 (12 ప్రభుత్వ యూనివర్శిటీలు)చేరుకుంది.[? విడమరచి రాయాలి][206] 2007 నుండి లిబియా ఇంటర్నేషనలు మెడికలు యూనివర్సిటీ వంటి కొన్ని కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. 2011 ముందు కొద్ది సంఖ్యలో ప్రైవేటు సంస్థలకు అధికారిక గుర్తింపు ఇచ్చినప్పటికీ లిబియా ఉన్నత విద్యకు అధికభాగం ప్రజా బడ్జెటు ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. 1998 లో విద్య కోసం బడ్జెటు కేటాయింపు లిబియా మొత్తం జాతీయ బడ్జెట్లో 38.2% ఉంది.[209]
2010 లో దేశం జి.డి.పి.లో 3.88% ఆరోగ్య సంరక్షణ కొరకు వ్యయం చేయబడుతుంది. 2009 లో 10,000 నివాసులకు 18.71 మంది వైద్యులు, 66.95 నర్సులు ఉన్నారు.[210] 2011 లో ఆయుఃపరిమితి 74.95 సంవత్సరాలు. పురుషులకు 72.44 సంవత్సరాలు, స్త్రీలకు 77.59 సంవత్సరాలు.[211]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.