రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు, కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2010 డిసెంబరు 7న పులివెందులలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించాడు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు[1]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | |
---|---|
అధ్యక్షులు | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి |
Secretary | విజయసాయి రెడ్డి |
పార్లమెంటరీ పార్టీ నేత | విజయసాయి రెడ్డి |
లోక్సభలో పార్టీ నేత | పి.వి.మిధున్ రెడ్డి |
రాజ్యసభలో పార్టీ నేత | విజయసాయి రెడ్డి |
అసెంబ్లీలో పార్టీ నేత | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి |
స్థాపన | 2011, మార్చి 11 |
ప్రధాన కార్యాలయం | తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్ |
సిద్ధాంతం | ప్రాంతీయతావాదం |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 175 | 11 / 175 |
0 / 119 | |
లోక్సభ | 4 / 545 |
రాజ్యసభ | 11 / 245 |
ఓటు గుర్తు | |
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పేరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి అభిమాని తొలిగా నమోదు చేశాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దానిపై హక్కులను పొందాడు.[2]
2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకి బాగా చేరువ అయినది. ప్రత్యేక హోదాపై అలుపెరుగని పోరాటం చేయడమే కాక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య నుంచే ఎండగట్టింది. 2019 ఎన్నికలలో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను 151 స్థానాలతో, భారత లోక్సభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది.
అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా అతి తక్కువ స్థానాలు వైకాపా పార్టీకి లభించింది.ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతామని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసిన వైకాపాకు కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఒక్క తెలుగు దేశం పార్టీ నే 216 సీట్లలో విజయం సాధించగా, అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు దక్కాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు 151 స్థానాలు లభించగా తెలుగు దేశం పార్టీకి 23 దక్కాయి.ఈ ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి వైకాపా పరిస్థితి దారుణంగా మారింది.175 స్థానాల్లో పోటీ చేసిన 11 సీట్లకే పరిమితమైంది.
సంవత్సరం | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|
2014 | 14వ శాసనసభ | 67 / 175 |
44.47% | ఓటమి | [3] |
2019 | 15వ శాసనసభ | 151 / 175 |
49.95% | గెలుపు | |
2024 | 16వ శాసనసభ | 11 / 175 |
44.28% | ఓటమి |
సంవత్సరం | సార్వత్రిక ఎన్నికలు | గెలిచిన స్థానాలు |
---|---|---|
2014 | 16వ లోక్సభ | 8 / 25 |
2019 | 17వ లోక్సభ | 22 / 25 |
2024 | 18వ లోక్సభ | 04 / 25 |
వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[4][5] జనాకర్షక పథకాలలో కొన్ని:[6]
2022 మార్చి 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆ పార్టీ నేతలు జరుపుకున్నారు. వైఎస్సార్సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. "దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.[7][8]
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) ప్లీనరీ సమావేశాలు 2022 జూలై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు. గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్లీనరీ వేదికపై[9] పార్టీ ప్రారంభించి పదేళ్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్లీనరీని ఘనంగా ముగిసింది. ఆ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ప్లీనరీలో రెండోరోజు తీర్మానం చేసి ఆమోదించారు.[10] మొదటిరోజు ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.