భింగా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
భింగా ఉత్తర ప్రదేశ్, శ్రావస్తి జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను నగర పాలికా నిర్వహిస్తుంది.
భౌగోళికం
భింగా 27.72°N 81.93°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 120 మీటర్ల ఎత్తున ఉంది.
భింగా, రాష్ట్ర రాజధాని లక్నో నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న శ్రావస్తి, రాప్తీ నదికి దగ్గరగా ఉంది.
జనాభా వివరాలు
2011 భారత జనగణ వివరాల ప్రకారం భింగా జనాభా 23,780. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. భింగా సగటు అక్షరాస్యత రేటు 45%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ; పురుషుల అక్షరాస్యత 53%, స్త్రీల అక్షరాస్యత 37%. జనాభాలో 18% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.