From Wikipedia, the free encyclopedia
డాక్టర్ బొమ్మి రెడ్డి సుందరరామి రెడ్డి గారు ఆత్మకూరు(నెల్లూరు జిల్లా ) పట్టణమందు ప్రముఖ వైద్యునిగా రాణించారు. డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి | |||
డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1978 – 1983 | |||
ముందు | కంచర్ల శ్రీహరి నాయుడు | ||
---|---|---|---|
తరువాత | ఆనం వెంకటరెడ్డి | ||
నియోజకవర్గం | ఆత్మకూరు నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే (2 సార్లు) | |||
పదవీ కాలం 1985 – 1994 | |||
ముందు | ఆనం వెంకటరెడ్డి | ||
తరువాత | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | ||
నియోజకవర్గం | ఆత్మకూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1935 అక్టోబర్ 17 బట్టేపాడు, ఆత్మకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, భారతీయ_జనతా_పార్టీ | ||
జీవిత భాగస్వామి | అరవిందమ్మ | ||
సంతానం | ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె | ||
వృత్తి | డాక్టర్ |
1935 అక్టోబర్ 17వ తేదీ మండలంలోని బట్టేపాడులో జన్మించారు.
ఆత్మకూరు ప్రజలకు వైద్యుడిగా చిరకాల పరిచయం ఉన్న సుందరరామిరెడ్డి తన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చిన ఎందరో పేదలకు ఉచిత వైద్య సహాయం అందించారు. ఆ సేవలే ఆయనను రాజకీయంగా తిరుగులేని నాయకుడిగా చేసాయి.
డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి చెన్నైలో ఎం.బి.బి. ఎస్.(MBBS) పూర్తి చేసారు. ఆ తరువాత ఆత్మకూరు, అనంతసాగరంలో ప్రభుత్వ వైద్యునిగా పని చేసి 1970లో ఆత్మకూరులో సొంత వైద్యశాలను ప్రారంభించాడు.
డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి హయం లో డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి వైద్యశాల (Dr.BSR hospital) నెల్లూరు జిల్లా లోనే ప్రముఖ వైద్యశాల వెలుగొందింది.
ఆయన లో 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి నాటి రాజకీయ ఉద్ధండుడు జనతా పార్టీకి చెందిన జీసీ కొండయ్యపై ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1983లో ఓడిపోయి, తిరిగి 1985 లో హోరాహోరీగా జరిగిన శాశన సభ ఎన్నికల్లో నాటి బీజేపీ అభ్యర్థి, నేటి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పై విజయం సాధించారు. 1989 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అభ్యర్థి ఆంజనేయరెడ్డిపై విజయం సాధించారు. ఆయన 1991లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ(ఎస్ఎఫ్సీ) చైర్మన్గా పని చేశాడు.
డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డిడి 2020 ఫిబ్రవరి 6న మరణించాడు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు డా.బి. రవీంద్రనాథ్ రెడ్డి, డా.బి.రాజేంద్రనాథ్ రెడ్డి, బి. రాఘవేంద్ర రెడ్డి (మాజీ జిల్లా పరిషత్ చైర్మన్), ఒక కుమార్తె ఉన్నారు.[2][3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.