15 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి From Wikipedia, the free encyclopedia
దగ్గుపల్లి దుగ్గన (దగ్గుబల్లి దుగ్గన అని కూడా ప్రచురంగా ఉంది) 15 వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. అతని తండ్రి దగ్గుపల్లి తిప్పన, తల్లి ఎర్రమ్మ. [1] దుగ్గన నాసికేతోపాఖ్యానము (నాచికేతోపాఖ్యానము) అనే పద్యకావ్యాన్ని రచించాడు.
దుగ్గన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథునికి బావమరిది. [2] శ్రీనాథుని వద్దనే పెరిగి అతని శిష్యరికం లోనే కవిత్వ రచన మొదలుపెట్టాడు. దుగ్గనకు ఇద్దరు అన్నయ్యలు - పోతన, ఎర్రన. ఈ పోతన, బమ్మెర పోతన వేరు. అలాగే ఈ ఎర్రన, కవిత్రయం లోని ఎర్రన వేరు. పోతనను బమ్మెర పోతనగా భావించి అల్లిన కథలు కేవలం కల్పనలే.
దుగ్గన అనేక రచనలు చేసినప్పటికీ నాసికేతోపాఖ్యానం ఒక్కటి మాత్రమే లభ్యమౌతోంది. [3] చెన్నై లోని ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఇది భద్రంగా ఉంది. నేటి నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి రాజ్య పాలకుడు బసవరాజు వద్ద మంత్రిగా ఉన్న చెందలూరు గంగన మంత్రికి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో బ్రహ్మదేవునిపై దండకం రచించాడు.
కాంచీపుర మాహాత్మ్యము, దుగ్గన రచించిన మరొక పద్య కావ్యం. [4] ఈ కావ్యాన్ని చెందలూరు గంగన మంత్రి కుమారుడైన చెందలూరు దేవయామాత్యునికి అంకితమిచ్చాడు. [5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.