48 కోసుల కురుక్షేత్ర ప్రదక్షిణ యాత్ర
From Wikipedia, the free encyclopedia
48 కోసుల ప్రదక్షిణ అంటే హర్యానా లోని పవిత్ర నగరం కురుక్షేత్ర చుట్టూ వివిధ మహాభారత సంబంద ప్రదేశాలకు, ఇతర వేద యుగపు తీర్థాలకూ చేసే తీర్థయాత్ర. [1] [2] [3] [4] హిందీలో దీన్ని 48 కోసుల పరిక్రమ అని అంటారు. కురుక్షేత్ర నగరం చుట్టూ అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలన్నింటినీ సందర్శించడమంటే పూర్తి ప్రదక్షిణ చేసినట్లు అర్థం. ఈ మ్యాపు ఈ స్థలాలను పూర్తిగా చూపిస్తుంది.
ఇది వేద యుగానికి, శ్రీకృష్ణుడికి మహాభారతానికీ సంబంధం ఉన్న ప్రదేశం కాబట్టి, ఇది హిందువుల తీర్థయాత్రల్లో ముఖ్యమైనది. ఇది "శ్రీకృష్ణుడికి" సంబంధించిన 3 ప్రధాన పుణ్యక్షేత్ర యాత్రలలో ఒకటి. అవి హర్యానాలోని "కురుక్షేత్రానికి చెందిన 48 కోసుల పరిక్రమ", ఉత్తర ప్రదేశ్, మధుర లోని " బ్రజ్ పరికర్మ", గుజరాత్, ద్వారకాధీశ ఆలయంలోని "ద్వారక పరిక్రమ " ( ద్వారకాధీశ యాత్ర)