2023 మహిళల ప్రీమియర్ లీగ్
From Wikipedia, the free encyclopedia
2023 మహిళల ప్రీమియర్ లీగ్ (టాటా డబ్ల్యూపీఎల్) బిసిసిఐ నిర్వహించిన మహిళల ఫ్రాంచైజీ ట్వంటీ20 క్రికెట్ లీగ్ ప్రారంభ సీజన్. ఈ టోర్నమెంట్ లో ఐదు జట్లు పాల్గొనగా, 4 మార్చి[1] నుండి 26 మార్చి 2023 వరకు జరిగింది. 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ గెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో ఓ ఎలిమినేటర్, ఫైనల్తో మొత్తం 22 మ్యాచులు జరిగాయి, ప్రతీ జట్టు ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడగా, టాప్గా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. రెండు, మూడు స్థానాల్లోని రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి తొలి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా, ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసి చాంపియన్ గా నిలిచింది.[2]