2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2023 మే 10న శాసనసభ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2018 మేలో జరగగా దాని పదవీకాలం 2023 మే 24న ముగిసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను 2023 మార్చి 29న సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించాడు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్ జరగగా, మే 13న ఫలితాలు వెల్లడించారు.[1]
| |||||||||||||||||||||||||||||||||||||||||
కర్నాటక అసెంబ్లీలో 224 సీట్లకు, ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు 113 | |||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||
|
కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా, 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 2,165 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 224 స్థానాల్లో, కాంగ్రెస్ 223 స్థానాల్లో, జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు, సీపీఐ నుంచి నలుగురు, స్వతంత్రులు 918 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 73.19% శాతం పోలింగ్ నమోదైంది.[2]