![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Jammu-Kashmir-Ladakh.svg/langte-640px-Jammu-Kashmir-Ladakh.svg.png&w=640&q=50)
1947 జమ్మూ ఊచకోతలు
1947 లో జమ్మూలో ముస్లిములపై జరిగిన ప్రతీకార దాడులు / From Wikipedia, the free encyclopedia
భారత విభజన తరువాత, 1947 సెప్టెంబరు-నవంబరు కాలంలో జమ్మూ ప్రాంతంలో అనేక మంది ముస్లిములను ఊచకోత కోసారు. ఎంతో మందిని పాకిస్తాను భూభాగంలోకి తరిమికొట్టారు. ఈ ఊచకోతను చేసినది తీవ్రవాద హిందువులు, సిక్ఖులూను. వీరికి మహారాజా హరిసింగ్ యొక్క డోగ్రా సేనలు.[6] రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఈ అల్లర్ల పథకరచనలోను, అమలులోనూ కీలక సహాయం అందించారు.[7][8]
త్వరిత వాస్తవాలు తేదీ, స్థలం ...
1947 జమ్మూ ఊచకోతలు | |
---|---|
తేదీ | 1947 సెప్టెంబరు - 1947 నవంబరు |
స్థలం | జమ్మూ |
లక్ష్యాలు | సామూహిక మారణకాండ, జాతి తుడిచివేత |
పద్ధతులు | అల్లర్లు, మారణకాండ, దహనాలు, సామూహిక అత్యాచారాలు |
జననష్టం | |
మరణాలు | 20,000–100,000 ముస్లిములు[1][2] 20,000+ Hindus and Sikhs[3][4][5] |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Jammu-Kashmir-Ladakh.svg/640px-Jammu-Kashmir-Ladakh.svg.png)
ఆ తరువాత, నేటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని మీర్పూర్లో పాకిస్తాన్ గిరిజన జాతులు, సైనికులూ 20,000 మంది హిందువులను ఊచకోత కోసారు.[3][4][5] అలాగే జమ్మూ డివిజను లోని రాజౌరి ప్రాంతంలో అనేక మంది హిందువులు, సిక్ఖులను ఊచకోత కోసారు.