1945 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
బ్రిటిషు భారతదేశంలో డిసెంబరు 1945లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు జరిగాయి. [2] ఎన్నికైన 102 సీట్లలో 57 గెలుచుకుని భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. [3] ముస్లిం లీగ్ అన్ని ముస్లిం నియోజకవర్గాలను గెలుచుకుంది, కానీ ఇతర స్థానాలను గెలుచుకోలేకపోయింది. మిగిలిన 13 స్థానాల్లో పంజాబ్లోని సిక్కు నియోజకవర్గాల్లో 8 యూరోపియన్లకు, 3 స్వతంత్ర అభ్యర్థులకు, 2 అకాలీ అభ్యర్థులకు దక్కాయి. [4] 1946లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జిన్నాకు, విభజనవాదులకూ వ్యూహాత్మక విజయంగా నిరూపితమయ్యాయి. కాంగ్రెస్ గెలిచినప్పటికీ, లీగ్ ముస్లిం ఓట్లను ఏకం చేసింది. అఖండ భారతదేశం అత్యంత అస్థిరంగా ఉంటుందని ఈ ఎన్నికలతో స్పష్టంగా తెలియడంతో ప్రత్యేక ముస్లిం మాతృభూమిని మరింత బలంగా కోరుకునే శక్తిని లీగ్ పొందింది.
| |||||||||||||||||||
102 ఎన్నుకునే స్థానాలు మెజారిటీ కోసం 52 సీట్లు అవసరం | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||
|
ఎన్నికైన సభ్యులు తరువాత భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు.
బ్రిటిషు భారతదేశంలో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికలు ఇవి. తరువాతి ఎన్నికలు భారతదేశంలో 1951-52 లోను, పాకిస్థాన్లో 1970 లోనూ జరిగాయి.