హైతీ
కరేబియన్ దేశం / From Wikipedia, the free encyclopedia
McAlister, Elizabeth (1998). "The Madonna of 115th St. Revisited: Vodou and Haitian Catholicism in the Age of Transnationalism". Retrieved 24 July 2013.
హైటీ (/ˈheɪti/ ( listen); French: Haïti [a.iti]; మూస:Lang-ht మూస:IPA-ht), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ హైటీ (French: République d'Haïti; మూస:Lang-ht)[1], సాధారణంగా హేతి అంటారు. [note 1] ఇది కరీబియన్ సముద్రం లోని " గ్రేటర్ ఆంటిల్లెస్ " ద్వీపమాలికలోని హిపానియోలాలో భాగంగా ఉంది.ఇది ద్వీపంలోని పశ్చిమభాగంలో ఉంది.[4][5] హైటీ వైశాల్యం 27,750 చ.కి.మీ.జనసంఖ్య 10.6 మిలియన్లు.[6] ఇది కరీబియన్ , కరీబియన్ దేశాలలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశంగా ఉంది. ఆరంభకాలంలో ఈప్రాంతంలో " టైనో " అనే స్థానికజాతి ప్రజలు నివసించారు.1492 డిసెంబర్ 5 న స్పెయిన్ ఈద్వీపాన్ని కనుగొన్నది. క్రిస్టోఫర్ కొలబస్ మొదటి సాహసయాత్రలో ఆట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వెళుతున్న సమయంలో కొలంబస్ ఈ ద్వీపాన్ని చేరుకుని ఈద్విపాన్ని ఇండియా లేక ఆసియా అనుకున్నాడు.[7] 1492 క్రిస్మస్ రోజున కొలంబస్ ఫ్లాగ్ షిప్ " శాంటా మారియా " లిమనేడ్ " సమీపంలో పయనించింది.[8][9][10][11] కొలంబస్ తన మనుష్యులకు నౌకను విడిచి ద్వీపంలో దిగమని ఆదేశించాడు. తరువాత కొలంబస్ ద్వీపంలో (అమెరికా ఖండాలలో ఇది మొదటిది) మొదటి యురేపియన్ సెటిల్మెంటు స్థాపించి దీనికి " లా నేవిడాడ్ " అని నామకరణం చేసాడు. తరువాత రోజు నౌక విధ్వంశం అయింది. స్పెయిన్ ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న తరువాత ఈద్వీపానికి " లా ఎస్పనొలా " అని నామకరణం చేయబడింది. స్పెయిన్ ఈద్వీపాన్ని 17వ శతాబ్ధం ఆరంభం వరకు పాలించింది.సెటిల్మెంట్లు , ఆక్రమణలు మొదలైన పోటీ కారణంగా ద్వీపంలోని పశ్చిమప్రాంతాన్ని " ట్రీటీ ఆఫ్ రిస్విక్ " తర్వాత ఫ్రెంచి ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.ఫ్రెంచి స్వాధీనం చేసుకున్న భూభాగానికి ఫ్రెంచి " సెయింట్ డొమినిక్యూ " అని నామకరణం చేసింది. తరువాత ఇక్కడ సెటిల్మెంట్లను స్థాపించి చెరకు తోటలను ఏర్పాటు చేసి తోటలలో పనిచేయడానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు.
బానిసత్వం నిర్మూలించబడిన తరువాత , నెపోలియన్ బొనాపర్టే సైన్యం " వర్టియరీస్ యుద్ధంలో " ఓటమి పొందిన తరువాత ఫ్రెంచి విప్లవం (1789-1799) మద్యలో బానిసలు , స్వతంత్రులైన శ్వేతజాతీయులు హైటీయన్ తిరుగుబాటు (1791-1799)ప్రారంభించారు. తరువాత 1804 జనవరి 1న హైటీ లాటిన్ అమెరికా దేశాలలో మొదటి సార్వభౌమదేశంగా , అమెరికా ఖండాలలో రెండవ రిపబ్లిక్గా అవతరించింది.పశ్చిమార్ధగోళంలో అత్యున్నత శక్తులుగా ఉన్న ఫ్రెంచి, స్పెయిన్ , యునైటెడ్ కంగ్డలను ఓడించిన ఏకైకదేసంగా హైటీ గుర్తించబడింది.అంతేకాక ప్రపంచంలో బానిసల తిరుగుబాటుతో స్థాపించబడిన ఏకైక స్వతంత్రదేశంగా కూడా హైటీ ప్రత్యేకత కలిగి ఉంది.[12][13] మునుపటి బానిసల నాయకత్వంలో ఆరంభమైన 1791 తిరుగుబాటుకు ఫ్రెంచి సైన్యంలోని నల్లజాతికి చెందిన " తౌసెయింట్ లౌవర్చ్యూర్ " నాయత్వం వహించాడు. ఫ్రెంచి జైలులో ఆయన మరణించిన తరువాత ఉద్యమానికి తౌసెయింట్ లౌవర్చ్యూర్ లెఫ్టినెంట్ " జీన్- జాక్యూస్ డిస్సలినెస్ " నాయకత్వం వహించాడు.స్వతంత్రం లభించిన తరువాత జీన్- జాక్యూస్ డిస్సలినెస్ హైటీ పాలకుడు అయ్యాడు.[14][15][16][17] 12 సంవత్సరాల హైటీ తిరుగుబాటు తరువాత అలెగ్జాండ్రె పెషన్ నుండి విడిపోయిన తరువాత బానిసలే రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు ప్రభుత్వ నాయకులుగా నియమించబడ్డారు.[18] అమెరికా ఖండాలలో అతిపెద్ద గుర్తించబడిన " హెంరీ క్రిస్టోఫె " కోటను పూర్వపు బానిస , హైటీ మొదటి పాలకుడు " మొదట్ హెంరీ " నిర్మించాడు.విదేశీ దండాయాత్రల నుండి దేశాన్ని రక్షించడానికి ఈకోట నిర్మించబడింది.[19][20] హతి " యునైటెడ్ నేషంస్ " ఆర్గనైజేషంస్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ " [21] అసోసియేషన్ ఆఫ్ కరీబియన్ స్టేట్స్ [22] , " ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫండ్ " ఫౌండింగ్ సభ్యత్వం కలిగి ఉంది.అదనంగా " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " [23] వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషంస్ [24] , " కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ స్టేట్స్ అండ్ కరీబియన్ సభ్యత్వం కలిగి ఉంది.హ్యూమన్ డెవెలెప్మెంట్ జాబితాలో హైటీ అమెరికా ఖండాలలో చివరి స్థానంలో ఉంది.2004లో హైతీ అధ్యక్షుడు " జీన్ బెర్ట్రాండ్ ఆర్టిస్టైడ్ "ను పదవి నుండి తొలగించాలని దేశం ఉత్తర భూభాగంలో తిరుగుబాటు ప్రారంభించబడింది." యునైటెడ్ నేషంస్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ హైటీ " ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది.