సూమ్రా రాజవంశం
From Wikipedia, the free encyclopedia
సూమ్రా రాజవంశం ఆధునిక పాకిస్తాను కేంద్రంగా ఉన్న సింధి రాజవంశం. ఇది 11 వ శతాబ్దం ఆరంభం నుండి 1300 ల చివరి వరకు పాలించింది - ప్రారంభంలో బాగ్దాదును పాలించిన అబ్బాసిదు కాలిఫేటు సామ్రాజ్యాల సామంతులుగా పాలించారు.[1] అనేక శతాబ్దాల అరబ్బు పాలన తరువాత సూమ్రా సింధు రాజవంశీయులు స్థానిక సింధీ పాలనను తిరిగి స్థాపించారు.[2] తరువాత వారి పాలనను ముల్తాను, బలూచిస్తాను వరకు విస్తరించారు.
త్వరిత వాస్తవాలు Soomra dynasty, రాజధాని ...
Soomra dynasty | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1026–1356 (Continued in exile until 1440 in Umerkot) | |||||||||
రాజధాని | Thari (in present-day Badin District in Sindh), and Thatta | ||||||||
సామాన్య భాషలు | Sindhi (native language) Arabic (liturgical language) | ||||||||
మతం | Shia Ismaili Islam | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
చరిత్ర | |||||||||
• Soomra dynasty begins | 1026 | ||||||||
• Soomra dynasty ends | 1356 (Continued in exile until 1440 in Umerkot) | ||||||||
|
మూసివేయి
సూమ్రా పాలనలో సింధీ సంస్కృతి పునరుజ్జీవనాన్ని అనుభవించింది. అరబ్బు భాష, సంప్రదాయాలు సింధులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారి పాలనలో షియా ఇస్మాయిలిజం, సున్నీ సూఫిజం సింధులో విస్తృతంగా వ్యాపించారు. అయినప్పటికీ వారు ఒకరితో ఒకరు శాంతియుతంగా సహజీవనం చేశాయి.[1] వారి పతనం ఉన్నప్పటికీ సూమ్రా సంస్కృతి, సంప్రదాయాలు తరువాతి శతాబ్దాలకాలం సింధుప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.[3]