From Wikipedia, the free encyclopedia
సూమ్రా రాజవంశం ఆధునిక పాకిస్తాను కేంద్రంగా ఉన్న సింధి రాజవంశం. ఇది 11 వ శతాబ్దం ఆరంభం నుండి 1300 ల చివరి వరకు పాలించింది - ప్రారంభంలో బాగ్దాదును పాలించిన అబ్బాసిదు కాలిఫేటు సామ్రాజ్యాల సామంతులుగా పాలించారు.[1] అనేక శతాబ్దాల అరబ్బు పాలన తరువాత సూమ్రా సింధు రాజవంశీయులు స్థానిక సింధీ పాలనను తిరిగి స్థాపించారు.[2] తరువాత వారి పాలనను ముల్తాను, బలూచిస్తాను వరకు విస్తరించారు.
Soomra dynasty | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1026–1356 (Continued in exile until 1440 in Umerkot) | |||||||||
రాజధాని | Thari (in present-day Badin District in Sindh), and Thatta | ||||||||
సామాన్య భాషలు | Sindhi (native language) Arabic (liturgical language) | ||||||||
మతం | Shia Ismaili Islam | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
చరిత్ర | |||||||||
• Soomra dynasty begins | 1026 | ||||||||
• Soomra dynasty ends | 1356 (Continued in exile until 1440 in Umerkot) | ||||||||
|
సూమ్రా పాలనలో సింధీ సంస్కృతి పునరుజ్జీవనాన్ని అనుభవించింది. అరబ్బు భాష, సంప్రదాయాలు సింధులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారి పాలనలో షియా ఇస్మాయిలిజం, సున్నీ సూఫిజం సింధులో విస్తృతంగా వ్యాపించారు. అయినప్పటికీ వారు ఒకరితో ఒకరు శాంతియుతంగా సహజీవనం చేశాయి.[1] వారి పతనం ఉన్నప్పటికీ సూమ్రా సంస్కృతి, సంప్రదాయాలు తరువాతి శతాబ్దాలకాలం సింధుప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.[3]
సా.శ. 711 లో ముహమ్మదు బిన్ ఖాసిం ఉమయ్యదు పాలనను సింధు వరకు విస్తరించాడు. ఇది డమాస్కసు కేంద్రంగా ఉన్న ఉమయ్యదు సామ్రాజ్యం తూర్పు ప్రావింసుగా మారింది.[4] ఉమయ్యదు పాలనలో 9 - 11 వ శతాబ్దాల మధ్య పాక్షిక స్వతంత్రపాలనకు ముందు, అరబ్బు హబ్బరి రాజవంశం ఉమయ్యద్ల ప్రధాన రాజ్యంగా స్థాపించబడింది.[5]
850 లో ఉమయ్యదు కాలిఫేటును బాగ్దాదు అబ్బాసిదులు పడగొట్టారు.[4] తరువాత హబ్బరి రాజ్యం స్వతంత్రంగా పాలన సాగించింది. దీనిని అబ్బాసిదులు నామమాత్రంగా గుర్తించారు.[6] 1010 లో అరబ్బు హబ్బరి మీద సుల్తాను ముహమ్మదు ఘజ్నవి దాడిచేసాడు.[6] ఘజ్నువి అబ్బాసిదులు మాత్రమే సరైన కలీఫులని విశ్వసించాడు. అలాగే సింధులో ఉమయ్యదు ప్రభావ అవశేషాలను తొలగించాలని భావించి మంసురాను స్వాధీనం చేసుకున్నాడు.[1]
మన్సురాను తొలగించిన తరువాత ఘజ్నవి సింధును పట్టుకోలేకపోయాడు.[1] ఆయన స్థానంలో స్థానిక సూమ్రో తెగ సూమ్రా రాజవంశాన్ని స్థాపించింది. సింధును అబ్బాసిదు కాలిఫేటు ప్రధాన రాజ్యంగా పరిపాలించడం ప్రారంభించింది.[4] సూమ్రో చరిత్రకారులు వారి మొట్టమొదటి సుల్తానును ఖఫీఫు అని భావించారు. అయితే ఆధునిక పరిశోధనలు ఖఫీఫు మొదటి సూమ్రా సుల్తాను కాకుండా చివరి హబ్బరి సుల్తాను అని సూచిస్తున్నాయి.[7]
ఇస్లాం మతంలోకి మారిన సింధులోని మొట్టమొదటి తెగలలో సూమ్రో తెగ ఒకరు. తరువాత వారు మన్సురాలో ధనవంతులు అయ్యారు. [4] వారు స్థానిక సింధులు అయినప్పటికీ సింధీలు వారి మూలాలను అరబ్బులుగా పేర్కొన్నారు.[8] ఉమయ్యదు పాలనలో స్థానిక సింధులతో వివాహం చేసుకోవాలని ప్రోత్సహించిన కారణంగా మిశ్రమ మూలాలు కలిగిన అరబ్బు అధికారుల పాలకవర్గం వారి మూలాలు అరబ్బు అని పేర్కొన్నారు.[1] వాస్తవానికి వారి పేరు ఇరాకులోని సమర్రా నగరం నుండి ఉద్భవించింది.[9] వారు కొన్నిసార్లు రాజ్పుతు సంతతికి చెందినవారని పేర్కొంటారు.[2][9] అయినప్పటికీ ఆ వాదనను ధ్రువీకరించే కచ్చితమైన ఆధారాలు లేవు.[8] ఇస్లాం మతంలోకి మారినప్పటికీ వారు అనేక హిందూ ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించారు.[1]
రెండవ సూమ్రా సుల్తాను పాలనలో సూమ్రా రాజ్యం ముల్తాను, ఉచు వరకు ఉత్తరం వైపు విస్తరించబడింది.[1] 11 వ శతాబ్దం ప్రారంభంలో, ఫాతిమిదు కాలిఫేటు నుండి వచ్చిన ఇస్మాయిలీ మిషనరీ ఇస్మాయిలిజాన్ని వ్యాప్తి చేయడానికి సింధు సందర్శించారు. దీని ఫలితంగా సింధు, ముల్తాను, ఉచు ఇస్మాయిలీ షియా మత కేంద్రాలుగా మారాయి.[8] అదే సమయంలో పర్షియా, మధ్య ఆసియా నుండి పెద్ద సంఖ్యలో సున్నీ సూఫీ మిషనరీలు సింధులోకి ప్రవేశించారు. చివరికి పెద్ద సంఖ్యలో సింధీలు ఇస్లాం మతంలోకి మారడానికి దారితీస్తుంది.[8] షియా, సున్నీ సంప్రదాయాలు రెండూ సింధులో శాంతియుతంగా సహజీవనం చేశాయి. [1]
1000 ల చివరలో -1100 ల ప్రారంభంలో సంఘరు పాలనలో తరువాత ఆయన కుమారుడు రెండవ ఖాఫీఫు-ఎల్ పాలనలో సూమ్రా నియంత్రణ దక్షిణ భారతదేశంలోని గుజరాతు వరకు విస్తరించింది. కచు, కాతియవారు ప్రాంతాలకు విస్తరించింది.[1] అతని మరణం తరువాత సంఘరు భార్య హమూను తన కోసం సూమ్రా సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు సూమ్రా ప్రభువులచే త్వరగా నలిగిపోయాయి.[1]
1100 ల చివరలో ముహమ్మదు ఘోరి సింధు మీద దండెత్తి, పొరుగున ఉన్న సమ్మ రాజవంశం కచు మీద పోరాటాలకు దారితీసింది. [1] 1220 లలో ఖ్వారెజ్ముకు చెందిన జలాలుద్దీను మింగ్బర్ను సింధును కొల్లగొట్టాడు. కొంతకాలం సూమ్రా నౌకాశ్రయమైన డెబలును ఆక్రమించాడు.[1]
బాగ్దాద్ ముట్టడి (1258) వరకు సూమ్రోలు అబ్బాసిదు సామంతులుగా పరిపాలించారు. తరువాత వారు స్వతంత్రంగా పాలించడం ప్రారంభించారు.[9] 1330 లలో సింధు మీద సూమ్రో పాలన బలహీనపడింది. సింధు నది మార్గాన్ని మార్చడంతో సింధు ఆర్థిక వ్యవస్థకు భంగం కలిగింది.[10]
ఢిల్లీ సుల్తానేటు ఖల్జీ రాజవంశం రెండవ రాజు అలావుద్దీను ఖల్జీ చివరి సూమ్రా రాజును ఓడించినప్పుడు సింధు సూమ్రా రాజవంశం పాలన దాదాపు ముగిసింది.[11][12] వారు 1400 ల మధ్యకాలం వరకు ఉమెర్కోట చుట్టూ ఉన్న థారు ఎడారిలో భూభాగాలను పాలించడం కొనసాగించారు.[1]
సూమ్రో చరిత్రకారులు వారి మొదటి సుల్తానును ఖఫీఫు అని భావిస్తున్నప్పటికీ ఆయన చివరి హబ్బరి సుల్తాను అయి ఉండవచ్చు. ఏకాభిప్రాయం కిందివాటిని సూమ్రో పాలకులుగా జాబితా చేస్తుంది:[1]
అబ్బాసిడ్ పాలన రద్దు తరువాత:
సింధులో సూమ్రా పాలన పతనం తరువాత, ఉమర్కోటకు పారిపోయిన పాలకులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.