సుందర్లాల్ బహుగుణ
భారతీయ కార్యకర్త, గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహి / From Wikipedia, the free encyclopedia
సుందర్లాల్ బహుగుణ (1927 జనవరి 9 - 2021 మే 21) [2] గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూపంలో చేపట్టాడు. హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు తెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు.[3] అతను భారతదేశ ప్రారంభ పర్యావరణవేత్తలలో ఒకడు. [4] తరువాత అతను చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలతో కలసి పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా పర్యావరణ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడం ప్రారంభించాడు. వృక్షాల కోసమే కాకుండా, అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కూడా పరితపించాడాయన.[5]
త్వరిత వాస్తవాలు సుందర్లాల్ బహుగుణ, జననం ...
సుందర్లాల్ బహుగుణ | |
---|---|
జననం | (1927-01-09)1927 జనవరి 9 మరోడా గ్రామం, టెహ్రి గర్వాల్, ఉత్తరాఖండ్ [1] |
మరణం | 2021 మే 21(2021-05-21) (వయసు 94) |
వృత్తి | ఉద్యమకారుడు, గాంధేయవాది, పర్యావరణ పరిరక్షకుడు |
జీవిత భాగస్వామి | విమలా బహుగుణ |
పిల్లలు | 3 |
మూసివేయి