సిలిగురి కారిడార్
From Wikipedia, the free encyclopedia
సిలిగురి కారిడార్, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉన్న భూభాగం.[1][2] ఈ భూభాగం వెడల్పు అత్యంత సన్నగా ఉండే చోట 20–22 కిలోమీటర్లు (12–14 మై.) ఉంటుంది. దీని ఆకారాన్ని బట్టి దీన్ని "కోడిమెడ" (చికెన్ నెక్) అని అంటారు. ఈ భౌగోళిక-రాజకీయ, భౌగోళిక-ఆర్థిక కారిడార్ ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.[1] కారిడార్కు ఇరువైపులా నేపాల్, బంగ్లాదేశ్ దేశాలు ఉండగా, కారిడారుకు ఉత్తర కొసన భూటాన్ ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం, ఈ ప్రాంతంలోని ప్రధాన నగరం. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, సిక్కిం, డార్జిలింగ్, ఈశాన్య భారతదేశం - వీటన్నిటినీ కలిపే కేంద్ర బిందువు.