షర్మిలా ఠాగూర్
From Wikipedia, the free encyclopedia
షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానాగా ప్రసిద్ధి, జననం 1944 డిసెంబరు 8) ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి 2011ల మధ్య పనిచేసింది. డిసెంబరు 2005లో ఈమెను యూనిసెఫ్ గుడ్విల్ ఎంబాసిడార్గా ఎన్నుకున్నారు.[2] ఈమె 2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది. 2013లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.[3]
త్వరిత వాస్తవాలు షర్మిలా ఠాగూర్, జననం ...
షర్మిలా ఠాగూర్ | |
---|---|
শর্মিলা ঠাকুর | |
జననం | షర్మిలా ఠాగూర్ (1944-12-08) 1944 డిసెంబరు 8 (వయసు 79) |
ఇతర పేర్లు | బేగం అయేషా సుల్తానా |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1959–1984 1991–2010 |
జీవిత భాగస్వామి | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి |
పిల్లలు | సైఫ్, సబా, సోహా |
బంధువులు | ఠాగూర్ కుటుంబం, పటౌడి కుటుంబం, జ్ఞానాభిరామ్ బారువా |
మూసివేయి