శుక్రేశ్వర దేవాలయం
From Wikipedia, the free encyclopedia
శుక్రేశ్వర్ దేవాలయం భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో గల ఒక ప్రముఖ శివాలయం. ఈ ఆలయం గౌహతి నగరంలోని పన్బజార్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున శుక్రేశ్వర్ లేదా ఇటాఖులి కొండపై ఉంది. ఆలయ ప్రాంగణం నుండి నదికి పొడవైన మెట్ల మార్గం ఉంది. శుక్రేశ్వర్ ఘాట్ మెట్లపై కూర్చుని నదిలో సూర్యుడు అస్తమించే దృశ్యం చూడవచ్చు. ఈ ప్రాంతంలో ప్రజలు వారి పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారు. శివుని అతిపెద్ద లింగాలలో ఒకటి ఈ ప్రాంతంలో ఉంది.[1]
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
త్వరిత వాస్తవాలు శుక్రేశ్వర దేవాలయం, భౌగోళికం ...
శుక్రేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26.1878049°N 91.7410059°E / 26.1878049; 91.7410059 |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | కామ్రూప్ జిల్లా |
ప్రదేశం | గౌహతి |
సంస్కృతి | |
దైవం | మహాశివుడు |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | ప్రమత్త సింహ [ఆధారం చూపాలి] |
మూసివేయి