శారదా పీఠం
శారదా పీఠం లేదా సరస్వతీ దేవి శక్తి పీఠం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉండేది. / From Wikipedia, the free encyclopedia
శారదా పీఠం లేదా సరస్వతీ దేవి శక్తి పీఠం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉండేది. శారదా పీఠం పురాతన హిందువుల మందిరం. ప్రస్తుతం ఇది శిథిలమైన హిందూ దేవాలయం, పురాతన విద్యా కేంద్రం. సా.శ. 6వ, 12వ శతాబ్దాల మధ్య ఇది భారత ఉపఖండంలోని అత్యంత ప్రముఖ దేవాలయ విశ్వవిద్యాలయాలలో ఒకటి అని చెపుతారు. ప్రత్యేకించి దాని గ్రంధాలయానికి అత్యంత ప్రసిద్ధి చెందింది.
Sharada Peeth | |
---|---|
మతం | |
అనుబంధం | Hinduism |
జిల్లా | Neelum Valley |
Region | Kashmir |
దైవం | Sharada |
Rite | Shaktism, Shaivism, Vedism |
ప్రదేశం | |
ప్రదేశం | Sharda |
దేశం | Pakistan |
భూభాగం | Azad Kashmir |
భౌగోళిక అంశాలు | 34°47′31″N 74°11′24″E |
వాస్తుశాస్త్రం. | |
శైలి | Kashmiri[1][2] |
లక్షణాలు | |
వెడల్పు | 22 అ. (6.7 మీ.) |
గరిష్ట ఎత్తు | 16 అ. (4.9 మీ.) |
విస్తీర్ణం | 4 kanals (0.5 acre)[3] |
ఉత్తర భారతదేశంలో శారద లిపి అభివృద్ధి, ప్రజాదరణ పొందడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీని వలన లిపికి దాని పేరు వచ్చింది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు. కాశ్మీరీ పండితులు తీర్థయాత్రలలో భాగంగా మూడు పవిత్ర ప్రదేశాలగా మార్తాండ్ సూర్య దేవాలయం, అమర్నాథ్ ఆలయాలతోపాటు శారదా పీఠం కూడా సందర్శిస్తారు.