లాహోర్ తీర్మానం
From Wikipedia, the free encyclopedia
లాహోర్ తీర్మానం (Urdu: قرارداد لاہور, Karardad-e-Lahore; Bengali: লাহোর প্রস্তাব, Lahor Prostab), ముహమ్మద్ జఫరుల్లా ఖాన్ రాయగా, బెంగాల్ ప్రధానమంత్రి ఎ.కె.ఫజలుల్ హక్ ప్రతిపాదించగా ఆలిండియా ముస్లిం లీగ్ మార్చి 22-24, 1940 సందర్భంగా లాహోరులో ఆమోదించి స్వీకరించిన లాంఛనయుత రాజకీయ ప్రకటన. తీర్మానంలో స్వతంత్ర రాష్ట్రాలను కోరుకుంది:
భౌగోళికంగా అవిచ్ఛిన్నమైన విభాగాలను ప్రాంతాలుగా ఏర్పరిచి, అటువంటి ప్రాదేశిక పునర్విభజన చేసి (బ్రిటీష్) ఇండియా వాయువ్య, తూర్పు జోన్లలో ముస్లింలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గ్రూప్ చేసి స్వయంప్రతిపత్తి, సార్వభౌమత్వం కల్పించాలి.
చౌధరీ రహ్మత్ అలీ తన పాకిస్తాన్ తీర్మానంలోనే పాకిస్తాన్ అన్న పేరును ప్రతిపాదించినా,[1] లాహోర్ తీర్మానం తర్వాత గానీ విస్తృతమైన ప్రచారంలోకి రాలేదు.
స్టాన్లీ వోల్పెర్ట్ ప్రకారం, ఒకప్పటి హిందూ-ముస్లిం ఐక్యతా రాయబారి మహమ్మద్ అలీ జిన్నా పూర్తిగా పాకిస్తాన్ మహా నాయకునిగా రూపాంతరం చెందిన సందర్భం ఇదే.[2]