రూప్నగర్ జిల్లా
పంజాబ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో రూప్నగర్ జిల్లా (డోయబ్:ਰੂਪਨਗਰ ਜ਼ਿਲਾ) ఒకటి. రూప్నగర్, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పట్టణాన్ని గతంలో రోపార్ /రూపార్ అనేవారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రోఖేశ్వర్ ఈ నగరాన్ని స్థాపించి తన కుమారుని పేరు పెట్టాడని భావిస్తున్నారు. ఇది " సింధూ నాగరికతకు " చెందిన పురాతన నగరమని భావిస్తున్నారు. రూప్ నగర్ జిల్లా లోని ప్రధాన నగరాలు మొరిండా, కురలి, ఆనందపూర్ సాహిబ్. రూప్ నగర్ను భాగ్వాలా (పూదోటల నగరం) అనికూడా అంటారు. మొరిండా చంఢీగఢ్- లుధియానా రహదారిలో ఉంది.
త్వరిత వాస్తవాలు రూప్నగర్ జిల్లా, దేశం ...
రూప్నగర్ జిల్లా | ||||
---|---|---|---|---|
దేశం | India | |||
రాష్ట్రం | పంజాబ్ | |||
Named for | రాజా రోకేశ్వరుని కుమారుడు, రూప్ సేన్ | |||
ముఖ్య పట్టణం | రూప్నగర్ | |||
Area | ||||
• Total | 1,440 km2 (560 sq mi) | |||
Population (2011)‡[›] | ||||
• Total | 6,84,627 | |||
• Density | 480/km2 (1,200/sq mi) | |||
భాషలు | ||||
• అధికారిక | పంజాబీ | |||
Time zone | UTC+5:30 (IST) | |||
ISO 3166 code | IN-PB-RU | |||
అక్షరాస్యత | 82.19% |
మూసివేయి