![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Portrait_of_Raja_Ram_Mohun_Roy%252C_1833.jpg/640px-Portrait_of_Raja_Ram_Mohun_Roy%252C_1833.jpg&w=640&q=50)
రామ్మోహన్ రాయ్
భారతీయ బెంగాలీ మత, సామాజిక మరియు విద్యా సంస్కర్త (1772–1833) / From Wikipedia, the free encyclopedia
రాజా రామ్మోహన్ రాయ్ (బెంగాలీ: রাজা রামমোহন রায়) (1772, మే 22 –1833, సెప్టెంబరు 27) భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
ఇoడియా వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్యుడిగా గుర్తించబడ్డారు.