మయొట్టె
From Wikipedia, the free encyclopedia
ఫ్రెంచ్ ప్రాంతంలో మాయొట్టి (ఫ్రెంచి: మాయొట్టి, షిమాయొరె, మయోరి) అధికారిక నామం మాయొట్టి డిపార్టమెంట్ డి మౌరిటనియే. [1] ఇందులో ఒక ప్రధాన ద్వీపం గ్రాండే-టెర్రె (లేదా మావోరీ), ఒక చిన్న ద్వీపం పెటిటే-టెర్రె (లేదా పమంజి) ఉన్నాయి. ఈ రెండు ద్వీపాల చుట్టూ అనేక ద్వీపాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ద్వీపసమూహం వాయువ్య మడగాస్కరు ఈశాన్య మొజాంబిక్ మధ్య ఆగ్నేయ ఆఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో ఉత్తర మొజాంబిక్ చానలులో ఉంది. ఫ్రాంసు ప్రాంతాలలో " డిపార్టుమెంట్ ఆఫ్ మయొట్టె " పేద ప్రాంతంగా భావించబడుతున్నప్పటికీ మొజాంబిక్ చానెల్లో ఉన్న దేశాలలో ఇది సుసంపన్న దేశంగా భావించబడుతుంది. ఫలితంగా మాయొట్టి అక్రమ వలసలకు ఒక ప్రధాన గమ్యంగా ఉంది.
మాయొట్టి ప్రాంతం 374 చ.కి.మీ ఒక 2017 గణాంకాలు ఆధారంగా జనసంఖ్య 256,518. జనసాంధ్రత చ.కి.మీ. 686 (చ.మై 1,777).[2] గ్రాండే-టెర్రె ద్వీపంలోని మమౌడ్జౌ అతిపెద్ద నగరం, ప్రిఫెక్చరుగా ఉంది. అయినప్పటికీ డ్జయోడ్జి- పమండ్జి అంతర్జాతీయ విమానాశ్రయం పొరుగున ఉన్న పెటిటే-టెర్రె ద్వీపంలో ఉంది. భూభాగం భౌగోళికంగా కొమొరో దీవులలో భాగంగా ఉంది. భూభాగం ముఖ్యంగా కొమొరోస్ యూనియనులో దీనిని దాని ప్రధాన ద్వీపం పేరుతో మయోరి అంటారు.
మాయోట్టే ఒక ప్రత్యేక విభాగంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరాసుదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ప్రజలలో చాలామందికి మొదటి భాషగా ఫ్రెంచి వాడుకభాషగా ఉంది.[3] అయినప్పటికీ పాతనివేదికలో 14 సంవత్సరాలకు మించిన వారు తాము ఫ్రెంచి మాట్లాడగలగలమని (వివిధ స్థాయిలలో) గణాంకాలలో పేర్కొన్నారని వివరించబడింది.[4]ప్రజలలో చాలామందికి షిమావొరె, వైవిధ్యమైన మాండలికాలలో స్వాహిలి (పొరుగు కొమొరో దీవులు వాడుకలో ఉన్న మాండలికాలు) వాడుకలో ఉన్నాయి. అత్యంత విస్తృతంగా మాట్లాడే ద్వితీయస్థాయిలో ఉన్న స్థానికభాష కిబుషి (అత్యంత సన్నిహితంగా స్లోవేకియా మాండలికం మలగాసి భాష)భాష వాడుకలో ఉంది. ప్రజలలో అత్యధికులు ముస్లిం మత అనుయాయులుగా ఉన్నారు.
ద్వీపంలోకి అరబ్బులు ఇస్లాం మతం తీసుకుని వచ్చింది. ఆలస్యంగా రావడంతో తూర్పు ఆఫ్రికా పొరుగు నుండి జనసాంద్రత తక్కువగా ఉంది. 1500 వ శతాబ్దంలో సుల్తానేటు స్థాపించబడింది. 1841 లో ఇబోనియా రాజు ఆండ్రియాంట్సోలి (మడగాస్కర్|మడగాస్కర్) మయొట్టెను జయించాడు (ఫ్రెంచి ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేయడాని ముందు). తరువాత మొహేలి, అంజుయాన్ ద్వీపాలను స్వాధీనం చేసుకున్నాడు. మాయొట్టి ప్రజలు ఉండటానికి ఓటు 1974 కొమొరోస్ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణలో మయొట్టె రాజకీయంగా పరాసుదేశంలో భాగంగా ఉండటానికి అనుకూలంగా, కొమరోసు నుండి స్వాతత్రం పొందడానికి అనుకూలంగా ఓటు వేసారు. 2009 ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా జనవరి 2011 మార్చన ఐరోపా సమాఖ్య ఓవర్సీస్ శాఖగాను, 2014 జనవరి 1 న సుదూర ప్రాంతంగా మారింది.