మకరంద పండు
From Wikipedia, the free encyclopedia
మకరందు పండు (ప్రూనస్ పెర్సికా) అనేదొక కాలానుగుణంగా ఆకురాల్చేగుణమున్నచెట్లకు పండే పండు. ఇది వాయువ్య చీనా ప్రాంతములో తారిం ద్రోణికి మఱియు కన్లన్ పర్వతాల ఉత్తర లోయలకు మధ్య తొలిసారిగా పెంచబడిన మఱియు సాగుచేయబడిన పండు.
పెర్సికా అనే పదం పెర్షియాలో(ప్రస్తుత ఇరాన్) విస్తృతంగా వ్యాప్తిచేయబడిన సాగు కారణంగా వచ్చిన పేరు. అక్కడినుండి ఐరోపాకు ఈ పండు వ్యాప్తించింది. ఈ పండు ఇతర పండ్లైన చెఱీ, ప్రీతిపండు, బాదం, అల్లనేరేడు వలె "ప్రూనస్" అనే జన్యువుకు, గులాబీ పూవు కుటుంబానికి చెందిన పండు. ఈ పండులో గట్టి గింౙ ఉండటం వలన, ఇది బాదంతో కలిపి "ఏమిగ్డాలస్" అనే ఉపజన్యువులోకి వర్గీకరించబడింది. అందువలననే, ఈ పండులోని గింౙ యొక్క రుచి, బాదంపప్పు గింౙ రుచివలె ఉంటుంది. ఈ మకరందపండు గింౙను మార్జిపాన్ అనే ఒక రకం వనస్పతిని తయారుచేస్తారు.
చీనా ఒకటే ప్రపంచవ్యాప్తంగా 58 శాతం మకరంద పండ్లను 2016లో ఉత్పత్తి చేసింది.