భీమునిపట్నం
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
భీమునిపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ చెందిన పట్టణప్రాంతం.[1] విశాఖపట్నం నగరపాలక సంఘంలో విలీనం కాక ముందు భారతదేశంలో ఇది రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి పురపాలక సంఘం. (భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం).[2] ఇప్పటికి కుడా పూర్వపు మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంది. ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుపై చివరన ఉంది.భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే పకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధకేత్రం పావురాళ్ళకొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలీ బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.
భీమునిపట్నం | |
భీమునిపట్నం గంటస్తంభం | |
ముద్దు పేరు: భీమిలి | |
భీమునిపట్నం మండలం | |
అక్షాంశరేఖాంశాలు: 17.886385°N 83.447109°E / 17.886385; 83.447109 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
ప్రభుత్వం | |
- Type | పురపాలక సంఘం భీమునిపట్నం |
- పురపాలక సంఘం అధ్యక్షుడు | |
పిన్ కోడ్ | 531163 |
ఎస్.టి.డి కోడ్ | |
వెబ్సైటు: భీమునిపట్నం పురపాలక సంఘం |