ఫలక్నుమా ప్యాలెస్
From Wikipedia, the free encyclopedia
తెలంగాణాలోని హైదరాబాదులో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాదు రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది,[1] తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి, ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క మామయ్య, బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు.[2] ఉర్దూలో ఫలక్నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
ఫలక్నుమా ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
ప్రదేశం | హైదరాబాదు, భారతదేశం |
ప్రారంభం | 2010 (హోటల్ గా) 1893 (ప్యాలెస్ గా) మార్చి 3, 1884 (ప్యాలెస్ శంకుస్థాపన) |
వ్యయం | 60 లక్షలు |
యజమాని | నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా, అమీరే పైగా (1884 నుంచి 1897 వరకు), తరువాత హైదరాబాదు నిజాం |
యాజమాన్యం | తాజ్ హోటల్స్ |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 60 |
అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.[3] ఫలక్నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్లో విడిది చేశారు.
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం లోని ఫైగా వంశస్థులకు చెందినది. ఆతర్వాత దీనిని నిజాం రాజులు సొంతం చేసుకున్నారు.[4] చార్మినార్ కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల (13 హెక్టార్లు) సువిశాల ప్రదేశంలో ఫలక్ నుమా ఫ్యాలెస్ నిర్మించారు. దీనిని అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి (నాలుగవ నిజాం రాజైన మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ బావమరిది) నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించారు.[5] ఫలక్ నుమా అంటే ఉర్దులో “ఆకాశాన్ని ఇష్టపడటం” లేదా "ఆకాశ అద్దం" అని అర్థం.