పృథ్వీ థియేటర్
From Wikipedia, the free encyclopedia
పృథ్వీ థియేటర్ ముంబైలోని ప్రసిద్ధ థియేటర్లలో ఒకటి. శశి కపూర్, అతని భార్య జెన్నిఫర్ కపూర్, శశి తండ్రి పృథ్వీరాజ్ కపూర్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. అతను తన రెపర్టరీ థియేటర్ కంపెనీ పృథ్వీ థియేటర్స్కు "ఇల్లు" కావాలని కలలు కన్న కపూర్ కుటుంబానికి చెందినవాడు, బాలీవుడ్లో అత్యంత ప్రభావవంతమైన నటులలో, దర్శకులలో ఒకడు. పృథ్వీరాజ్ కపూర్ 1944లో 'పృథ్వీ థియేటర్స్' అనే ట్రావెలింగ్ థియేటర్ కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీ పదహారు సంవత్సరాలు నడిచింది.[1] జెన్నిఫర్ కపూర్ పర్యవేక్షణతో థియేటర్ని డిజైన్ చేసి నిర్మించిన ఆర్కిటెక్ట్ వేద్ సెగన్. జెన్నిఫర్, (ట్రస్టీ) 1984లో ఆమె మరణించే వరకు థియేటర్ భవన నిర్వహణను పర్యవేక్షించింది. 1978లో ముంబైలోని జుహులో పృథ్వీ థియేటర్ ప్రారంభించబడింది. శశి కపూర్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాడు, రోజువారీ వ్యవహారాలను కునాల్ కపూర్ (ట్రస్టీ) సమర్థవంతంగా చూసుకునేవాడు. పృథ్వీ థియేటర్లో సంవత్సరం పొడుగునా ప్రతి రోజు, సోమవారం సెలవు మినహా, పిల్లల కోసం వర్క్షాప్లు, నాటకాల వార్షిక వేసవికాల కార్యక్రమం, ఫిబ్రవరి 28న మెమోరియల్ కాన్సర్ట్, నవంబర్లో వార్షిక థియేటర్ ఫెస్టివల్, భాష, కవిత్వం, అంతర్జాతీయంగా ప్రచారం చేసే అనేక భాగస్వామ్య కార్యక్రమాలు ఉంటాయి. సినిమా అండ్ డాక్యుమెంటరీలు, ప్రదర్శన కళలు మొదలైన కార్యక్రమాలు ప్రజలకు ఉచితంగా అందించేవారు.[2]
Location | జుహు, ముంబై |
---|---|
Owner | శశి కపూర్ జెన్నిఫర్ కెండల్ కునాల్ కపూర్ సంజనా కపూర్ |
Opened | 1944 |
Website | |
prithvitheatre.org |