పుదుచ్చేరి శాసనసభ
భారత కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకసభ్య శాసనసభ / From Wikipedia, the free encyclopedia
పుదుచ్చేరి శాసనసభ, (ఫ్రెంచ్:అసెంబ్లీ లెజిస్లేటివ్ డి పాండిచ్చేరి) అనేది పుదుచ్చేరి భారత కేంద్రపాలిత ప్రాంతం (యుటి) ఏకసభ శాసనసభ. ఇది పుదుచ్చేరి, కారైకల్, మాహె, యానాం అనే నాలుగు జిల్లాలను కలిగి ఉంది. భారతదేశం లోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో, కేవలం మూడింటికి మాత్రమే శాసనసభలు ఉన్నాయి. అవి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. పునర్విభజన తర్వాత పుదుచ్చేరి శాసనసభలో 33 స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. 33 మంది సభ్యులలో 30 మంది సార్వత్రిక వయోజనల ఓటింగు ఆధారంగా ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు. మిగిలిన ముగ్గురు కేంద్రప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు. ఈ నామినేటెడ్ సభ్యులుకు, శాసనసభకు ఎన్నికైన మిగతా సభ్యులతో సమానమైన అధికారాలను కలిగి ఉంటారు.
Puducherry Legislative Assembly Assemblée législative de Pondichéry | |
---|---|
15th Puducherry Assembly | |
రకం | |
రకం | Unicameral |
కాల పరిమితులు | 5 years |
చరిత్ర | |
స్థాపితం | 1 జూలై 1963; 61 సంవత్సరాల క్రితం (1963-07-01) |
అంతకు ముందువారు | Puducherry Representative Assembly |
నాయకత్వం | |
Speaker | |
Deputy Speaker | P. Rajavelu, AINRC 25 August 2021 నుండి |
Leader of the House (Chief Minister) | N. Rangaswamy, AINRC 7 May 2021 నుండి |
Leader of the Opposition | R. Siva, DMK 8 May 2021 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 30 (elected) + 3 (nominated) |
రాజకీయ వర్గాలు | Government (22) Official Opposition (8)
Nominated (3)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | First-past-the-post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 6 April 2021 |
తదుపరి ఎన్నికలు | 2026 |
సమావేశ స్థలం | |
Puducherry Legislative Assembly | |
వెబ్సైటు | |
https://puddu.neva.gov.in/ |
భౌగోళికంగా, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కింద మూడు విడదీయబడిన ప్రాంతాలను కలిగి ఉంది. పుదుచ్చేరి, కారైకాల్ జిల్లాలు తమిళనాడు జిల్లాలతో చుట్టుముట్టబడ్డాయి. యానాం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఎన్క్లేవ్గా, మాహే జిల్లా కేరళ జిల్లాల సరిహద్దులో ఉంది. 1962లో భారతదేశంలో విలీనం కావడానికి ముందు ఈ నాలుగు జిల్లాలు ఫ్రెంచ్ వారిచే పాలించబడ్డాయి. పరిపాలన సౌలభ్యం కోసం, ఫ్రెంచ్ పాలనలో, ఈ నాలుగు జిల్లాల పరిధిలోని ప్రాంతాన్ని 39 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారు. భారతదేశ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత, పుదుచ్చేరి 30 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది. వీటిని 2005లో డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరించింది.