నరేంద్ర మోదీ స్టేడియం
సర్దార్ పటేల్ స్టేడియం / From Wikipedia, the free encyclopedia
నరేంద్ర మోదీ స్టేడియం (గతంలో మోటెరా స్టేడియం) అనేది భారతదేశంలోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.[1][2] ఇది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉంది. టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ20 ఇంటర్నేషనల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది.[3]
1982 లో నిర్మించిన ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం అని ఉండేది. 2020 ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం స్టేడియం పేరును మార్చారు. దాని సామర్థ్యాన్ని పెంచడానికి, దాని సౌకర్యాలను ఆధునీకరించడానికి 2015 - 2020 మధ్య గణనీయంగా పునర్నిర్మాణాలు జరిగాయి. పునరుద్ధరించిన స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించాడు.
స్టేడియంలో 360-డిగ్రీల LED స్కోర్బోర్డ్, నాలుగు డ్రెస్సింగ్ రూమ్లు, ప్రాక్టీస్ గ్రౌండ్లు, ఇండోర్ క్రికెట్ అకాడమీ, అనేక హాస్పిటాలిటీ బాక్స్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.
క్రికెట్తో పాటు, నరేంద్ర మోడీ స్టేడియం కచేరీలు, ప్రదర్శనలు వంటి ఇతర కార్యక్రమాలను నిర్వహించింది. ఇది అహ్మదాబాద్లో ఒక ప్రముఖ మైలురాయిగా మారింది. క్రికెట్ పట్ల భారతదేశ అభిరుచికి చిహ్నంగా మారింది.