![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/82/Natraja_Temple.jpg/640px-Natraja_Temple.jpg&w=640&q=50)
నటరాజస్వామి ఆలయం (చిదంబరం)
From Wikipedia, the free encyclopedia
చిదంబరం దేవాలయం (తమిళం: சிதம்பரம் கோயில்) పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.[1]
చిదంబరం ఆలయం | |
---|---|
![]() | |
భౌగోళికాంశాలు : | 11°23′58″N 79°41′36″E |
పేరు | |
ప్రధాన పేరు : | చిదంబరం తిల్లై నటరాజర్-కూతన్ కోయిల్ |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | కుడలోర్ జిల్లా |
ప్రదేశం: | చిదంబరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నటరాజు (తిల్లై కూతన్ - శివుడు) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ నిర్మాణశైలి |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/49/Temple_Tangore_1.jpg/640px-Temple_Tangore_1.jpg)
హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.