From Wikipedia, the free encyclopedia
నంద వంశం (The Nanda Empire) భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 5వ, 4వ శతాబ్దాల మధ్య కాలంలో పాలించింది. నంద సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన పంజాబ్ వరకు, దక్షిణంగా వింధ్య పర్వతాల వరకు విస్తరించింది.[1] వీరిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.చంద్రగుప్తా మౌర్య మహాపద్మనంద వారసుడే.
నంద సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
క్రీ.పూ. 424–క్రీ.పూ. 321 | |||||||||
The Nanda Empire at its greatest extent under Dhana Nanda circa 323 BC. | |||||||||
రాజధాని | పాటలీపుత్ర | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం | ||||||||
మతం | Jainism Hinduism Buddhism | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
సామ్రాట్ | |||||||||
చారిత్రిక కాలం | Antiquity | ||||||||
• స్థాపన | క్రీ.పూ. 424 | ||||||||
• పతనం | క్రీ.పూ. 321 | ||||||||
|
నంద రాజవంశం క్రీ.పూ 4 వ శతాబ్దంలో- (బహుశా) (క్రీ.పూ 5 వ శతాబ్దంలో భారత ఉపఖండంలోని ఉత్తర భాగాన్ని పాలించింది. తూర్పు భారతదేశంలోని మగధ ప్రాంతంలోని శిశునాగ రాజవంశాన్ని నందాలు పడగొట్టి తమ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగాన్ని చేర్చారు. పురాతన మూలాలు నందా రాజుల పేర్లు, వారి పాలన కాలానికి సంబంధించిన వివరణలు చాలా భిన్నంగా ఉంటాయి. మహావంశంలో నమోదు చేయబడిన బౌద్ధ గ్రంథాలు ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు వారు సి. క్రీ.పూ 345-322 వారి పాలన క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం నాటిదని పేర్కొన్నాయి.
ఆధునిక చరిత్రకారులు సాధారణంగా గంగారిడై పాలకుడుగా భావిస్తుండగా ప్రాచీన గ్రీకో-రోమను గ్రంథాలు పేర్కొన్న ప్రసిని నందా రాజుగా భావిస్తున్నారు. క్రీ.పూ 327-325 మధ్య కాలంలో వాయవ్య భారతదేశం మీద దాడి చేసిన అలెగ్జాండరు ది గ్రేట్ చరిత్రకారులు ఈ రాజును సైనికపరంగా శక్తివంతమైన, సంపన్న పాలకుడిగా వర్ణించారు. ఈ రాజు మీద యుద్ధం జరిగే సందర్భంలో అలెగ్జాండరు సైనికులలో తిరుగుబాటుకు దారితీసింది. ఫలితంగా అలెగ్జాండరు ప్రసీ మీద యుద్ధం చేయకుండా భారతదేశం నుండి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.
నందాలు హర్యంక, శిశునాగా పూర్వీకుల తరువాత వారి సామ్రాజ్యాలు నిర్మించి మరింత కేంద్రీకృత పరిపాలనను స్థాపించారు. వారు గొప్ప సంపదను సంపాదించి ఘనత వహించినట్లు పురాతన వనరులు పేర్కొంటున్నాయి. ఇది బహుశా కొత్త కరెన్సీ రూపొందించి పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. పురాతన గ్రంథాలు నందాలు తక్కువ స్థాయి పుట్టుక, అధిక పన్ను విధించడం, వారి సాధారణ దుష్ప్రవర్తన కారణంగా వారు ప్రజలలో జనాదరణ పొందలేదని సూచిస్తున్నాయి. చివరి నందా రాజును మౌర్య సామ్రాజ్యం వ్యవస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, చంద్రగుప్తుడి గురువు చాణక్య పడగొట్టారు.
మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు, నంద రాజులు నాయీబ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు[2]. కాలాశోకుడు, అతని పది మంది కుమారులను సంహరించి రాజ్యానికి వచ్చాడు. ఇతనికి మహాక్షాత్రప అనే బిరుదు ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మహాపద్మనందుడు (2వ పరుశురాముడిగా ప్రసిద్ధి) తెలంగాణ ప్రాంతాన్ని మగధ రాజ్యంలో విలీనం చేశాడు. కరీంనగరు రామడుగు వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట. ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది. క్రీస్తునకు పూర్వం 5-4 శతాబ్ది నాటి నంద వంశ పాలనకు శ్రీకారం చుట్టిన.మహా పద్మనందుడు ఇలా నిధిని భూగర్భంలో నిక్షిప్తం చేసినట్టు ప్రసిద్ధమైన కథ ప్రచారంలో ఉంది.ఈ మహాపద్మనందుడు వారసుడే మౌర్య చంద్రగుప్తుడు. లక్ష కోట్ల సువర్ణ ముద్రికలను సేకరించిన.నందరాజు ఆ నిధిని గంగానది అడుగున నిక్షిప్తం చేశాడట! ‘మహాపద్మము’ ఒక సంఖ్య. దీని విలువ లక్ష కోట్లని ‘బ్రౌన్’ నిఘంటుకారుడు నిర్ణయించాడు! గంగానదికి ఆనకట్ట కట్టి నీటిని మళ్లించి ఇసుక తేలిన.నదిలో తవ్వి ఈ లక్షకోట్ల తులాల బంగారాన్ని నందుడు పూడ్చి పెట్టించాడట! కోటి టన్నుల బంగారమన్న మాట-ఇప్పటి లెక్కల్లో-! ఆ తరువాత.ఆయన నదిని మళ్లీ సువర్ణ నిధి నిక్షిప్త ప్రాంతం మీదకి మళ్లించాడట-కట్టను తెంపి...ఈ చారిత్రక వాస్తవాన్ని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన ‘చంద్రగుప్తుని స్వప్నం’ అన్న చారిత్రక రచనలో పేర్కొన్నారు. మహా పద్మనందుడన్న పేరు క్రీస్తునకు పూర్వం నాటి ఆ చక్రవర్తికి అందుకనే వచ్చిందట!!
భారతీయ, గ్రీకో-రోమను సంప్రదాయాలు రాజవంశం స్థాపకుడిని తక్కువ పుట్టుక కలిగిన వ్యక్తిగా వర్గీకరిస్తాయి.[3] గ్రీకు చరిత్రకారుడు డయోడోరసు (క్రీ.పూ. 1 వ శతాబ్దం) ఆధారంగా సమకాలీనులు నంద రాజును మంగలి కొడుకుగా భావించారని అలెగ్జాండరుతో పోరసు చెప్పాడు.[4] రోమను చరిత్రకారుడు కర్టియసు (సా.శ. 1 వ శతాబ్దం) పోరసు అభిప్రాయం ఆధారంగా ఈ మంగలి తన ఆకర్షణీయమైన రూపంతో మాజీ రాణితో సంబంధం ఏర్పరుచుకుని అప్పటి రాజును ద్రోహంగా హత్య చేశాడు. అప్పటి రాకుమారులకు సంరక్షకుడిగా నటించడం ద్వారా సుప్రీం అధికారాన్ని స్వాధీనం చేసుకుని తరువాత యువరాజులను చంపాడు.[4][5]
జైన సంప్రదాయ గ్రంథాలలోని అవశ్యక సూత్రం పారిష్ఠ-పర్వన్లలో నమోదు చేయబడినట్లుగా గ్రీకో-రోమను వృత్తాంతాలను ధ్రువీకరిస్తుంది. మొదటి నందరాజు మంగలి కుమారుడని పేర్కొన్నాడు.[6][7][8] 12 వ శతాబ్దపు పారిష్ఠ-పర్వను వచనం ఆధారంగా మొదటి నందా రాజు తల్లి వేశ్య. ఏది ఏమయినప్పటికీ చివరి నందా రాజు కుమార్తె చంద్రగుప్తుడిని వివాహం చేసుకున్నట్లు కూడా వచనం ఆధారంగా భావించబడుతుంది. ఎందుకంటే క్షత్రియ బాలికలు తమ భర్తను ఎన్నుకోవడం ఆచారం; అందువలన నందరాజు క్షత్రియుడని అంటే యోధుల తరగతి సభ్యుడని పేర్కొన్నాడు.[6]
పురాణాలు రాజవంశం స్థాపకుడికి మహాపద్మ అని పేరు పెట్టాయి. ఆయన శిశునాగ రాజు మహానంది కుమారుడని పేర్కొన్నాడు. ఏది ఏమయినప్పటికీ ఈ గ్రంథాలు కూడా నందాల తక్కువ పుట్టుకను సూచిస్తాయి. మహాపద్మ తల్లి చతుర్వర్ణాలలో నాలుగవది అయిన శూద్ర తరగతికి చెందినది.[8]
రాజవంశం స్థాపకుడి మంగలి అన్న విషయాన్ని పూర్వీకులైన గ్రీకో-రోమను, జైన అనే రెండు వేర్వేరు సంప్రదాయాలు ధ్రువీకరించాయి. ఇది శిశునాగా పూర్వీకుల పురాణ వాదన కంటే విశ్వసించదగినదిగా కనిపిస్తుంది.[9]
బౌద్ధ సంప్రదాయం నందాలను "తెలియని వంశవృక్షం" (అన్నాట-కులా) అని పిలుస్తుంది. మహావంశ ఆధారంగా రాజవంశం స్థాపకుడు ఉగ్రసేన. ఆయన మొదట "సరిహద్దు నివాసిత మనిషి": అతను దొంగల ముఠా చేతిలో పడి తరువాత వారి నాయకుడయ్యాడు. [10] తరువాత ఆయన శిశునాగ రాజు కలషోకా (లేదా కాకవర్ణ) కుమారులను బహిష్కరించాడు. [5]
నందాల పాలన మొత్తం వ్యవధికి సంబంధించి పురాతన వనరులలో ఏకాభిప్రాయం లేదు.[11] ఉదాహరణకు మత్స్య పురాణం మొదటి నందా రాజు 88 సంవత్సరాలు పాలించినట్లు పేర్కొన్నది.[9] అయితే వాయు పురాణం కొన్ని లిపిలు నంద పాలన మొత్తం వ్యవధిని 40 సంవత్సరాలుగా పేర్కొన్నాయి. 16 వ శతాబ్దపు బౌద్ధ పండితుడు తారనాథ నందాలు 29 సంవత్సరాలు పాలించారని పేర్కొన్నాడు.[12]
నందా, మగధ ఇతర ప్రారంభ రాజవంశాలకు కచ్చితమైన తేదీని కేటాయించడం కష్టం.[13] చరిత్రకారులు ఇర్ఫాను హబీబు, వివేకానంద ఝా నందులు సా.శ. క్రీస్తుపూర్వం 344-322 పాలనసాగించినట్లు పేర్కొన్నారు. శ్రీలంక బౌద్ధ సంప్రదాయం మీద ఆధారపడినట్లు, నందాలు 22 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొంది.[7] చరిత్రకారుడు " ఉపేందరు సింగు " నందులు క్రీ.పూ. 364-345 మధ్యకాలంలో పాలించారని గౌతమబుద్ధుడు క్రీ.పూ 486 లో మరణించడం ఆధారంగా పేర్కొన్నాడు.[13]
మరొక సిద్ధాంతం ఆధారంగా ఖగోళ గణాంకాల ఆధారంగా మొదటి నందా రాజు క్రీస్తుపూర్వం 424 లో సింహాసనాన్ని అధిష్టించాడని భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రతిపాదకులు హతిగుంప శాసనం "నందరాజ" (నందా రాజు) మహావీర యుగం 103 వ సంవత్సరంలో (క్రీ.పూ. 424 లో) సుసంపన్నంగా వర్ధిల్లింది.[14]
14 వ శతాబ్దపు జైన రచయిత మెరుతుంగా తన " విచార-శ్రేని " గ్రంథంలో అవంతి రాజు చంద్ర ప్రదయోత జైన నాయకుడు మహావీరుడు పరమపదించిన అదే రాత్రి మరణించాడని పేర్కొన్నాడు. అతని తరువాత అతని కుమారుడు పాలకా 60 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత, నందాలు పటాలిపుత్ర వద్ద అధికారంలోకి వచ్చి అవంతి రాజధాని ఉజ్జయినిని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది రాజుల పాలనలో ఉన్న నందా పాలన 155 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ తరువాత మౌర్యులు అధికారంలోకి వచ్చారు. శ్వేతాంబర జైన సంప్రదాయం ఆధారంగా మహావీరుడు క్రీస్తుపూర్వం 527 లో పరమపదించాడు. అంటే నంద పాలన - మేరుతుంగా రచనల ప్రకారం - క్రీస్తుపూర్వం 467 - క్రీస్తుపూర్వం 312 వరకు కొనసాగింది. చరిత్రకారుడు ఆర్. సి. మజుందారు అభిప్రాయం ఆధారంగా మెరుతుంగా అందించిన అన్ని కాలక్రమ వివరాలను ధ్రువీకరించే ఆధారాలు లేకుండా అంగీకరించలేము. మరింత నమ్మదగిన వనరులకు విరుద్ధంగా ఉంటే అవి పూర్తిగా నమ్మదగనివి కావు.[15]
బౌద్ధ, జైన, పురాణ సంప్రదాయ గ్రంథాలు మొత్తం 9 నందా రాజులు ఉన్నాయని చెబుతున్నాయి.[10] కానీ మూలాలు ఈ రాజుల పేర్ల విషయంలో చాలా విభేదిస్తూ ఉన్నాయి.[7] గ్రీకో-రోమను వృత్తాంతాల ప్రకారం, నందా పాలన రెండు తరాల వరకు విస్తరించింది.[3] ఉదాహరణకు రోమను చరిత్రకారుడు కర్టియసు (సా.శ. 1 వ శతాబ్దం) మంగలి వమ్శానికి చెందిన వ్యక్తి నందరాజవంశం స్థాపకుడు అయ్యాడని ఆయన కుమారుడు రాజవంశం చివరి రాజును చంద్రగుప్తుడు పడగొట్టాడని పేర్కొన్నాడు.[4] గ్రీకు వృత్తాంతాలు అలెగ్జాండరు సమకాలీనుడైన ఒక నంద రాజు - అగ్రమ్సు లేదా క్జాండ్రేమ్సు మాత్రమే. "అగ్రమ్సు" అనే సంస్కృత పదం "ఆగ్రసైన్య" గ్రీకు లిప్యంతరీకరణ కావచ్చు (అక్షరాలా "ఉగ్రసేన కుమారుడు లేదా వారసుడు", ఉగ్రసేన బౌద్ధ సంప్రదాయగ్రంధాల ఆధారంగా రాజవంశం స్థాపకుడి పేరు).[7][5]
భారతదేశంలో సంకలనం చేయబడిన పురాణాలు సి. 4 వ శతాబ్దం CE (బహుశా అంతకంటే పూర్వపుమూలాల ఆధారంగా) నందాలు రెండు తరాలపాటు పరిపాలించినట్లు కూడా పేర్కొన్నాయి.[3] పురాణ సంప్రదాయం ఆధారంగా రాజవంశ స్థాపకుడు మహాపద్మ: మత్స్య పురాణం అతనికి 88 సంవత్సరాల నమ్మశక్యం కాని సుదీర్ఘ పాలనచేసాడని పేర్కొన్నది. అయితే వాయు పురాణం అతని పాలన కాలవ్యవధిని 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొన్నది.[9] మహాపద్మ 8 మంది కుమారులు అతని తరువాత మొత్తం 12 సంవత్సరాలు పరిపాలించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ కుమారులలో ఒకరికి మాత్రమే పాలకుడుగా పేరు పెట్టబడింది: సుకల్ప.[8] ఒక వాయు పురాణ లిపి అతనిని "సహల్య" అని పేరు పేర్కొన్నది. ఇది బౌద్ధ గ్రంథమైన దివ్యవదనలో పేర్కొన్న "సహాలిను"కు అనుగుణంగా ఉంటుంది.[11] విష్ణు పురాణ వ్యాఖ్యాత అయిన దుండిరాజా నంద రాజులలో ఒకరిని సర్వత-సిద్ధి అని పేర్కొన్నాడు. ఆయన కుమారుడు మౌర్యుడు అని అతని కుమారుడు చంద్రగుప్త మౌర్యుడు అని పేర్కొన్నాడు.[13] ఏదేమైనా పురాణాలు నంద, మౌర్య రాజవంశాల మధ్య ఎటువంటి సంబంధం గురించి పేర్కొనలేదు.[16]
పాలి భాషలో వ్రాసిన శ్రీలంక బౌద్ధ గ్రంథం మహావంశ ఆధారంగా 9 మంది నంద రాజులు ఉన్నారు - సోదరులందరూ కలిసి మొత్తంగా 22 సంవత్సరాలు వరుసగా పాలించారని పేర్కొన్నది.[7] ఈ తొమ్మిది మంది రాజులు:
• చక్రవర్తి మహపద్మ నంద - నంద రాజ్యం స్థాపకుడు, భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు (క్రీ.పూ.424). [13][7]
నందా రాజధాని తూర్పు భారతదేశంలోని మగధ ప్రాంతంలోని పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా సమీపంలో) వద్ద ఉంది. బౌద్ధ, జైన సంప్రదాయాలతో పాటు సంస్కృత నాటకం ముద్రారాక్షసం గ్రధం ద్వారా ఇది ధ్రువీకరించబడింది. పురాణాలు మగధ ప్రాంతాన్ని పరిపాలించిన శిశునాగ రాజవంశంతో నందాలను కలుపుతాయి. గ్రీకు వృత్తాంతాలు అగ్రామ్సు (నందా రాజుగా గుర్తించబడ్డాయి) గంగారిడై (గంగా లోయ), ప్రసీ (బహుశా సంస్కృత పదం ప్రాచ్యాసు లిప్యంతరీకరణ, అక్షరాలా "తూర్పువాసులు") పాలకుడు అని పేర్కొంది. తరువాతి రచయిత మెగాస్తేనిసు (క్రీ.పూ. 300) అభిప్రాయం ఆధారంగా పాటలీపుత్ర (గ్రీకు: పాలిబోత్రా) ప్రసీ దేశంలో ఉంది. ఇది పాటలీపుత్ర నంద రాజధాని అని మరింత నిర్ధారిస్తుంది.[7]
నందా సామ్రాజ్యం పశ్చిమంలో ప్రస్తుత పంజాబు నుండి తూర్పున ఒడిశా వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది.[17] పురాతన గ్రీకు వృత్తాంతాలు, పురాణాలు, హతిగుంఫా శాసనంతో సహా వివిధ చారిత్రక వనరుల విశ్లేషణ - నందాలు తూర్పు భారతదేశం, గంగా లోయ, కళింగలో కనీసం ఒక భాగాన్ని నియంత్రించారని సూచిస్తుంది.[18] మధ్య భారతదేశంలోని అవంతి ప్రాంతాన్ని వారు నియంత్రించడం కూడా చాలా నిశ్చితంగా భావిస్తున్నారు. ఇది వారి వారసుడు చంద్రగుప్త మౌర్యుడు ప్రస్తుత పశ్చిమ భారతదేశం లోని గుజరాతును జయించటానికి వీలు కల్పించింది. [19] జైన సంప్రదాయగ్రంధాల ఆధారంగా నందులమంత్రి తీర ప్రాంతాల వరకు ఉన్న మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[20]
నంద రాజు మహాపద్మ క్షత్రియులను నాశనం చేసి వివాదాస్పద సార్వభౌమత్వాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి.[21] క్షత్రియులు ఆయాను నిర్మూలించినట్లు భావిస్తున్నారు. ఇందులో మైథలాలు, కాషేయాలు, ఇక్ష్వాకులు, పాంచాలలు, శూరసేనలు, కురులు, హైహయాలు, వితిహోత్రులు, కళింగాలు, అష్మకులు ఉన్నారు.[20]
[7] "నంద-రాజా" (నందా రాజు) కళింగలో ఒక కాలువను త్రవ్వించి, కళింగ నుండి జైన విగ్రహాన్ని తీసుకున్నట్లు శాసనం పేర్కొంది.[13] శాసనం ఆధారంగా ఈ కాలువను "టి-వాసా-సాతా" సంవత్సరాల క్రితం తవ్వారు: ఈ పదాన్ని "మూడు వందలు" లేదా "నూట మూడు" అని విభిన్నంగా అన్వయించారు. [27]
దక్షిణ భారతదేశంలో నేటి కర్ణాటకలో కొంత భాగాన్ని కలిగి ఉన్న కుంతల దేశాన్ని కూడా నందాలు పరిపాలించారని కొన్ని శాసనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ శాసనాల కాలం (సా.శ. 1200) నందపాలనతో సరిపోల్చడానికి వీలుపడనందున, ఈ సందర్భంలో ఇవి విశ్వసించదగినవిగా పరిగణించలేము. మౌర్యుల పాలనలో మగధ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో - నందాల వారసులను కలిగి ఉంది - కాని వారు ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి ఎలా వచ్చారనే దానిపై సంతృప్తికరమైన కథనం లేదు. [26]
అలెగ్జాండరు ది గ్రేట్ ఆగ్రమ్సు లేదా క్జాండ్రేమ్సు సమయంలో వాయవ్య భారతదేశంపై దాడి చేశాడు.[7] ఆధునిక చరిత్రకారులు సాధారణంగా చివరి నందరాజు - ధనా నందాగా గుర్తించారు.[28] క్రీస్తుపూర్వం 326 వేసవిలో అలెగ్జాండరు సైన్యం నందా భూభాగం ఉన్న బియాసు నదికి (గ్రీకు: హైఫాసిస్) చేరుకుంది.[29]
కర్టియసు అభిప్రాయం ఆధారంగా అగ్రెమ్సుకు 2,00,000 పదాతిదళం ఉందని అలెగ్జాండరు తెలుసుకున్నాడు; 20,000 అశ్వికదళం; 3000 ఏనుగులు; 2,000 నాలుగు గుర్రాల రథాలు.[7][13] డయోడోరసు ఆధారంగా ఏనుగుల సంఖ్యను 4,000 గా ఉందని భావిస్తున్నారు.[30] పదాతిదళం మినహాయింపుగా ప్లూటార్కు ఈ సంఖ్యలను గణనీయంగా పెంచుతుంది:[31] ఆయన అభిప్రాయం ఆధారంగా నందా దళంలో 2,00,000 పదాతిదళాలు ఉన్నాయి; 80,000 అశ్వికదళం; 6,000 ఏనుగులు; 8,000 రథాలు ఉన్నాయని భావిస్తున్నారు.[32] అలెగ్జాండరుకు నివేదించిన సంఖ్యలను స్థానిక భారతీయ జనాభా అతిశయోక్తి చేసి, ఆక్రమణదారులను తప్పుదోవ పట్టించడానికి ప్రోత్సాహించేలా ఉంది.[29]
అలెగ్జాండరును ఎదుర్కోవటానికి నందా సైన్యానికి అవకాశం లేదు. అతని సైనికులు బియాసు నది వద్ద తిరుగుబాటు చేశారు. తూర్పున ఇక ముందుకు వెళ్లడానికి నిరాకరించారు. క్రీస్తుపూర్వం 330 లో అలెగ్జాండరు సైనికులు హెకాటోంపైలోసు వద్ద తమ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ఆందోళన మొదలుపెట్టారు. తరువాతి సంవత్సరాలలో వాయవ్య భారతదేశంలో వారు ఎదుర్కొన్న గట్టి ప్రతిఘటన వారిని నిరాశపరిచింది. శక్తివంతమైన నందా సైన్యాన్ని ఎదుర్కొనడానికి వారు తిరుగుబాటు చేశారు. అలెగ్జాండరు భారతదేశం నుండి వైదొలగాలని వారు బలవంతం చేశారు.[33]
ఈ రోజు నందా పరిపాలన గురించిన సమాచారం తక్కువగా మిగిలి ఉంది.[34]పురాణాలు నందా రాజును ఎకరతు ("ఒకే పాలకుడు") గా అభివర్ణిస్తాయి. ఇది నందా సామ్రాజ్యం వాస్తవంగా స్వతంత్ర భూస్వామ్య రాజ్యాల సమూహంగా కాకుండా సమగ్ర రాచరికం అని సూచిస్తుంది.[35] అయినప్పటికీ గ్రీకు వృత్తాంతాలు మరింత సమాఖ్య పాలన వ్యవస్థను సూచిస్తున్నాయి. ఉదాహరణకు బియాసు నదికి మించిన భూమిని "న్యాయం, మితవాదంతో తమ అధికారాన్ని వినియోగించుకున్న కులీనవర్గం" చేత పాలించబడిందని అర్రియను పేర్కొన్నాడు. గ్రీకు వృత్తాంతాలు గంగారిడై, ప్రసీలను విడిగా ప్రస్తావించాయి. అయినప్పటికీ ఈ రెండింటినీ సాధారణ సార్వభౌమాధికారి పాలించారని సూచించారు. ప్రస్తుత బీహారు, ఉత్తర ప్రదేశులలో నందాలు తమ ప్రధాన భూభాగాల మీద కేంద్రీకృత నియంత్రణను కలిగి ఉన్నారని, కానీ వారి సామ్రాజ్యం సరిహద్దు భాగాలలో గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుమతించారని చరిత్రకారుడు హెచ్. సి. రాయచౌధురి సిద్ధాంతీకరించారు.[34] బౌద్ధ ఇతిహాసాలు దీనిని సూచిస్తున్నాయి. చంద్రగుప్తా వారి రాజధాని దాడి చేసినప్పుడు నందులను ఓడించలేకపోయాడు. కాని ఆయన క్రమంగా వారి సామ్రాజ్యం సరిహద్దు ప్రాంతాలను జయించిన తరువాత వారికి వ్యతిరేకంగా విజయం సాధించాడు.[36]
నంద రాజులు తమ హర్యంక, శిశునాగ పూర్వీకులు పాలించిన మగధ రాజ్యాన్ని బలోపేతంగా స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో మొదటి ఉత్తర భారతదేశపు గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించింది. మగధ ఈ రాజవంశాల రాజకీయ విజయాన్ని వివరించడానికి చరిత్రకారులు వివిధ సిద్ధాంతాలను ముందుకు తీసుకునివచ్చారు. మగధ రాజధాని పటాలిపుత్ర, గంగా, సను నదుల కూడలి వద్ద ఉన్నందున సహజంగా రక్షించబడింది. గంగా, దాని ఉపనదులు రాజ్యాన్ని ముఖ్యమైన వాణిజ్య మార్గాలతో అనుసంధానించాయి. ఇది సారవంతమైన నేల, ప్రక్కనే ఉన్న కలప, ఏనుగుల ప్రవేశానికి అనుమతించింది. కొంతమంది చరిత్రకారులు మగధ ప్రజలు బ్రాహ్మణీయ సనాతన ధర్మం నుండి విముక్తి పొందారని సూచించారు. ఇది దాని రాజకీయ విజయంలో పాత్ర పోషించి ఉండవచ్చు; ఏదేమైనా ఈ దావా నిజాయితీని అంచనా వేయడం కష్టం. ఇనుప ఖనిజ గనుల మీద మగధ గుత్తాధిపత్యం దాని సామ్రాజ్య విస్తరణలో ప్రధాన పాత్ర పోషించిందని డిడి కోసాంబి సిద్ధాంతీకరించారు. అయితే చరిత్రకారుడు ఉపీందరు సింగు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఈ గనుల మీద మగధకు గుత్తాధిపత్యం లేదని, చారిత్రక మగధ ప్రాంతంలో అధికమైన ఇనుప గనుల వెలికితీత తరువాత ప్రారంభమైంది. అయితే ప్రక్కనే ఉన్న చోటా నాగపూరు పీఠభూమిలో అనేక ఖనిజాలు, ఇతర ముడి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయని సింగు పేర్కొన్నాడు. ఇవి మగధ సంపదగా ఉన్నాయి.
జైన సంప్రదాయగ్రంధాల ఆధారంగా కల్పక మొదటి నంద రాజు మంత్రిగా ఉన్నాడు. ఆయన అయిష్టంగానే మంత్రి అయ్యాడు. కాని పదవిని చేపట్టిన తరువాత తీవ్రంగా రాజ్యవిస్తరణ విధానాన్ని అవలంబించాలని రాజును ప్రోత్సహించాడు. నంద సామ్రాజ్యం మంత్రి కార్యాలయాలు వంశపారంపర్యంగా ఉన్నాయని జైన గ్రంథాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు చివరి నందరాజు మంత్రి అయిన షకటాల మరణం తరువాత ఆయన స్థానం ఆయన కుమారుడు స్థూలభద్రకు ఇవ్వబడింది; స్థూలభద్ర ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు షకటాలా రెండవ కుమారుడు శ్రియకాను మంత్రిగా నియమించారు.[13]నంద పాలనలో పాటలీపుత్ర నగరం భౌతిక సుసంపన్నం (లక్ష్మి) నివాసంగా మారడమే కాకుండా విద్యాదేవత (సరస్వతి) నివాసంగా మారిందని బృహత్కథ సంప్రదాయగ్రంధం పేర్కొంది. ఈ సంప్రదాయం ప్రకారం వర్షా, ఉపవర్ష, పాణిని, కాత్యాయన, వరురుచి, వ్యాడి వంటి ప్రముఖ వ్యాకరణవేత్తలు నంద కాలంలో నివసించారు.[37]ఈ ఖాతాలో ఎక్కువ భాగం నమ్మదగని జానపద కథలు అయినప్పటికీ నందుల కాలంలో పతంజలికి ముందు కొంతమంది వ్యాకరణవేత్తలు నివసించినట్లు తెలుస్తోంది.[38]
అనేక చారిత్రక వనరులు నందాల గొప్ప సంపదను సూచిస్తాయి. మహావంశం ఆధారంగా చివరి నందరాజు నిధి నిల్వ చేసేవాడు. ఆయన 80 కోట్లు (800 మిలియన్లు) విలువైన సంపదను సేకరించాడు. ఆయన ఈ నిధులను గంగా నదీతీరంలో పాతిపెట్టాడు. తోళ్ళు, చిగుళ్ళు, చెట్లు, రాళ్లతో సహా అన్ని రకాల వస్తువుల మీద పన్ను విధించడం ద్వారా అతను మరింత సంపదను సంపాదించాడు.[39]
తమిళ కవి ములానాయనారు రాసిన ఒక పద్యం "నందాల ప్రపంచానికి తెలవని సంపద"ను సూచిస్తుంది. ఇది "గంగానది వరదలతో కొట్టుకుపోయి తరువాత మునిగిపోయింది".[40] ఈ పద్యం మరొక వ్యాఖ్యానం ఈ సంపద గంగా నీటిలో దాగి ఉందని పేర్కొంది. 7 వ శతాబ్దపు చైనా యాత్రికుడు జువాన్జాంగు "రాజు నందా ఏడు విలువైన పదార్ధాల ఐదు సంపదలను" పేర్కొన్నాడు.[39]
గ్రీకు రచయిత జెనోఫోను, తన సైరోపీడియా (క్రీ.పూ. 4 వ శతాబ్దం) లో భారత రాజు చాలా ధనవంతుడని పేర్కొన్నాడు. పశ్చిమ ఆసియా రాజ్యాల మధ్య వివాదాలలో మధ్యవర్తిత్వం వహించాలని ఆకాంక్షించాడు. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం (సైరస్ ది గ్రేట్ కాలం) సంఘటనలను జెనోఫోను పుస్తకం వివరించినప్పటికీ చరిత్రకారుడు హెచ్. సి.రేచౌదురి ఈ కథనంలో వివరించిన రాజు నందవంశానికి చెందినవాడై ఉంటాడని భావించాడు.[41]
పాణిని వ్యాకరణ వ్యాఖ్యాత అయిన కశిక " నందపోక్రమణి మనాని " గురించి ప్రస్తావించింది - నందాలు కొలత ప్రమాణం ప్రవేశపెట్టారని ఇది వారి కొత్త కరెన్సీ వ్యవస్థ, పంచ్-మార్క్ నాణేలను ప్రవేశపెట్టడానికి సూచన కావచ్చు. ఇది వారి సంపదలో ఎక్కువ భాగానికి కారణం కావచ్చు. పురాతన పాటలీపుత్ర స్థలంలో దొరికిన నాణేల నిల్వ బహుశా నంద కాలానికి చెందినది.[42]
నందాలు, మౌర్యులు గ్రేటరు మగధ - జైన మతం, అజివికిజం, బౌద్ధమతం మతాలను పోషించినట్లు తెలుస్తుంది.[17] ఈ పాలకులు ఏ సమకాలీన మతానికి వివక్ష చూపినట్లు ఆధారాలు లేవు.[43]
నందా పూర్వ కాలంలో వేద బ్రాహ్మణిజానికి అనేక చిన్న రాజులు మద్దతు ఇచ్చారు. వీరు బ్రాహ్మణ పూజారులను పోషించారు. మరింత కేంద్రీకృత నంద, మౌర్య పాలనలో ఈ రాజుల క్షీణించిన శక్తి కారణంగా బ్రాహ్మణులు వారి పోషకులను కోల్పోయినట్లు కనిపిస్తోంది. దీని ఫలితంగా సాంప్రదాయ వేద సమాజం క్రమంగా క్షీణించింది.[44]
అనేకమంది నందరాజుల మంత్రులు జైనమతం వైపు మొగ్గు చూపారని జైన సంప్రదాయం సూచిస్తుంది. చివరి నందరాజు మంత్రి అయిన షకటాలా మరణించిన తరువాత ఆయన కుమారుడు స్తులభద్ర తన తండ్రి కార్యాలయాన్ని వారసత్వంగా పొందటానికి నిరాకరించి బదులుగా జైన సన్యాసి అయ్యాడు. స్థూలాభద్ర సోదరుడు శ్రీకా ఈ పదవిని అంగీకరించారు.[13]
పాటలీపుత్ర వౌస్సోయిరు ఆర్చి పటాలిపుత్రలోని కుమ్రారు నుండి కె.పి.జయస్వాలు కనుగొన్న ఒక వంపు గ్రానైటు రాతి భాగాన్ని గేట్వే ట్రెఫాయిలు వంపు పూర్వ మౌర్య నంద కాలం కీస్టోను ముక్కగా విశ్లేషించారు. దాని మీద మూడు పురాతన బ్రాహ్మి అక్షరాల మేసను గుర్తులు చెక్కబడి ఉండవచ్చు. ఇది బహుశా తోరాణాలను అలంకరించింది.[45][46][47] ఇండెంటేషనుతో చీలిక ఆకారపు రాయికి రెండు వైపులా మౌర్య పోలిషు చేయబడి నిలువుగా నిలిపివేయబడింది.
కె. పి జయస్వాలు అభిప్రాయం ఆధారంగా నందశకం మూడు మూలాలలో ప్రస్తావించబడింది. 300 లేదా 103 సంవత్సరాల క్రితం నందరాజ కాలువను నిర్మిస్తున్నట్లు " ఖరవేలరాజు " హతిగుంప శాసనం పేర్కొంది. "అల్ బెరుని" అభిప్రాయం ఆధారంగా శ్రీహర్ష శకం కన్నౌజు, మధుర ప్రాంతాలలో ఉపయోగించబడుతోంది. శ్రీహర్ష యుగం, విక్రమా యుగం మధ్య 400 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇది క్రీ.పూ 458 గా మారుతుంది. ఈ లక్షణాలు నందా రాజుల కాలంతో సరిపోలుతాయి. 12 వ శతాబ్దంలో చాళుక్య రాజు 6 వ విక్రమాదిత్య యేదరవా శాసనం ఆధారంగా నందయుగం, విక్రమాదిత్య శకం, షాకశకం కొత్త చాళుక్యుల యుగానికి అనుకూలంగా రద్దు చేయబడ్డాయి. అయినప్పటికీ ఇతర పండితులు సాక్ష్యాలు చాలా తక్కువ అని తేల్చారు.[48]
చివరి నందా రాజు తన ప్రజలలో జనాదరణ పొందలేదని అన్ని చారిత్రక వృత్తాంతాలు అంగీకరిస్తున్నాయి. డయోడోరసు అభిప్రాయం ఆధారంగా సమకాలీన నందరాజు "అప్రయోజనకరమైన పాత్ర" కలిగిన వ్యక్తి అని పోరసు అలెగ్జాండరుతో చెప్పాడు. ఆయన తక్కువ జాతికి చెందినవాడని భావించినందున ఆయనను ప్రజలను గౌరవించలేదు. పోరసు ఆధారంగా నందరాజు తన ప్రజలను తృణీకరించాడని కర్టియసు పేర్కొన్నాడు.[4] ఆండ్రోకోటోసు (చంద్రగుప్తాగా గుర్తించబడ్డాడు) అలెగ్జాండరును కలిశారని పేర్కొన్న ప్లూటార్కు అభిప్రాయం ఆధారంగా ఆండ్రోకోట్టోసు అలెగ్జాండరును కలిసిన తరువాత అలెగ్జాండరు నంద భూభాగాన్ని (గంగారిడై, ప్రసీ) సులభంగా జయించగలడని ప్రకటించాడు. ఎందుకంటే నందరాజు దుర్మార్గుడు, ఆయన ప్రజలను ద్వేషించి తృణీకరించాడు. ఆయన హీనకులజాతుడని, క్రూరుడని అప్పటి ప్రజలు భావించారు.[49] శ్రీలంక బౌద్ధ సంప్రదాయం నందాలు అత్యాశతో, అణచివేతతో పన్ను విధించినందుకు ప్రజలు ఆయనను నిందించారు.[31] భారత పురాణాలు నందాలను అధర్మికులు అని ముద్రవేస్తాయి. వారు ధర్మం లేదా ధర్మబద్ధమైన ప్రవర్తన నిబంధనలను పాటించలేదని సూచిస్తుంది.[10]
నందరాజవంశం చంద్రగుప్త మౌర్యుని చేత పడగొట్టబడింది. ఆయనకు ఆయన గురువు (తరువాత మంత్రి) చాణక్యుడు మద్దతు ఇచ్చాడు. కొన్ని వ్రాతపూర్వక ఆధారాలు చంద్రగుప్త నందా కుటుంబ సభ్యునిగా పేర్కొన్నారు. ఉదాహరణకు 11 వ శతాబ్దపు రచయితలు క్షేమేంద్ర, సోమదేవ చంద్రగుప్తుడిని "నిజమైన నంద కుమారుడు" (పూర్వా-నంద-సూత) గా అభివర్ణించారు. ధుండిరాజా తన విష్ణు పురాణం వ్యాఖ్యానంలో చంద్రగుప్తుడి తండ్రిని మౌర్యుడిగా పేర్కొన్నాడు; ఆయన మౌర్యుడిని నందరాజు సర్వత-సిద్ధి, వేటగాడి కుమార్తె మురకు జన్మించిన కుమారుడుగా వర్ణించాడు.[13]
బౌద్ధ గ్రంథం " మిలిండా పాన్హా " నంద సైన్యాధ్యక్షుడు భద్దసాల (సంస్కృతం: భద్రాశాల), చంద్రగుప్తుడి మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రస్తావించింది. ఈ రచనల ఆధారంగా ఈ యుద్ధం 10,000 ఏనుగులు; 1,00,000 గుర్రాలు; 5,000 రథసారథి; 10,00,000 పదాతిదళం వధకు దారితీసింది. ఇది స్పష్టంగా అతిశయోక్తి అయినప్పటికీ నందరాజవంశం పడగొట్టడం హింసాత్మక వ్యవహారం అని ఇది సూచిస్తుంది.[37]
నంద రాజ వంశీయుల ఆధారాలు :
చంద్రగుప్త మౌర్య నంద రాజ కుమారుడు ఆధారాలు :
1. క్రీ.పూ.4వ శతాబ్దం విశాకదత్తుడు రచించిన “ముద్రరాక్షస” గ్రంథంలో క్లుప్తంగా వివరించారు " చంద్రగుప్త మౌర్య నంద వంశీయుల వారసుడే " అని వివరించారు. (Visakadattas 4th century BC “Mudrarakshasa” Book)
2. ఎజెస్ ఆఫ్ ద నందస్ యండ్ మౌర్యస్ - (రచించిన వారు కె.ఎ.నీలకంఠ శాస్త్రి). (Ages Of The Nandas and Mauryas – Written by K.A.Neelakanta Sastri).
3. ద నందస్ (బార్బర్ రూలర్స్ ఇన్ ఇండియ) - (రచించిన వారు ధనరాజ్ టి.యం). (The Nandas (Barber Rulers In India) - Written by Dhanaraju T.M).
4. భారతదేశ చరిత్ర డిడి.కోసాంబి - ప్రఖ్యతిగాంచిన బౌద్ధమత రచేయిత డిడి.కోసంబి, ఇతను రాసిన అనేక గ్రంథాలలో కుడా “చంద్రగుప్త మౌర్య నంద వారసుడే “ అని రచించాడు. (“DD Kosambi” buddhist Writer – India History)
5. History Of Ancient India - Radhey Shyam Chaurasia.
6. A History Of India – Romola Thapar.
7. సాక్షి దినపత్రికలో (తేది: 20-11-2011) ప్రచురించిన ఫ్యామిలీ పెజిలో వచ్చిన ఆర్టికల్ లో కుడా “ చంద్రగుప్త మౌర్య నంద వారసుడే అని వ్రాసినారు “.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.